హైదరాబాద్ సహా 6 నగరాల్లో ఇడెల్ సేవలు
విద్యుత్ వాహనాలతో సరకు సరఫరా చేసే ‘ఇడెల్’ సేవల్ని హైదరాబాద్, బెంగళూరు, దిల్లీ, ముంబయి, పుణె, కోల్కతాల్లో ప్రారంభించినట్లు మహీంద్రా లాజిస్టిక్స్ (ఎంఎల్ఎల్) వెల్లడించింది
మహీంద్రా లాజిస్టిక్స్
దిల్లీ: విద్యుత్ వాహనాలతో సరకు సరఫరా చేసే ‘ఇడెల్’ సేవల్ని హైదరాబాద్, బెంగళూరు, దిల్లీ, ముంబయి, పుణె, కోల్కతాల్లో ప్రారంభించినట్లు మహీంద్రా లాజిస్టిక్స్ (ఎంఎల్ఎల్) వెల్లడించింది. రాబోయే 12 నెలల్లో ఈ సేవలు మొత్తం 14 నగరాల్లో అందించాలన్నది ప్రణాళికగా కంపెనీ తెలిపింది. ఇడెల్ తొలి దశలో భాగంగా సుమారు 1,000 త్రిచక్ర వాహనాలను కంపెనీ సరఫరా చేయనుంది. ‘మహీంద్రా ఎలక్ట్రిక్ తయారు చేస్తున్న ట్రియో జోర్ విద్యుత్ వాహనాన్ని తొలుత డెలివరీ చేయనున్నాం. ఆ తరవాత 4 చక్రాల వాహనాలను, ఇతర ఆప్షన్లను కూడా మారుమూల ప్రాంతాల వరకు చేరవేస్తామ’ని ఎంఎల్ఎల్ మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ రామ్ప్రవీణ్ స్వామినాథన్ వెల్లడించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నౌక స్వాధీనం ఘటన.. భారత నావికుల్లో ఐదుగురికి ఇరాన్ విముక్తి
-
లాభాల్లో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు..
-
వ్యభిచారం చేయడానికి వచ్చావా? పోలీసులకు పట్టిస్తాం
-
పెళ్లి చేసుకోకపోవడానికి కారణమిదే: కోవై సరళ
-
గతంలో నాటేవారు.. ప్రస్తుతం నరికేస్తున్నారు!
-
మేనత్తను అవమానిస్తే ఆనందిస్తారా?: కాంగ్రెస్ ఎమ్మెల్యేపై డీకే అరుణ ఫైర్