LIC: ఎల్‌ఐసీ ఛైర్మన్‌ ఇక సీఈవో

ల్‌ఐసీ ఐపీవోకు సన్నద్ధమవుతున్న కేంద్ర ప్రభుత్వం.. ఆ సంస్థలోని అత్యున్నత పదవి విషయంలో కీలక మార్పులు చేసింది. ఎల్‌ఐసీ ఛైర్మన్‌ పదవిని చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌గా మార్చింది. అంటే ఎల్‌ఐసీ ఛైర్మన్‌ను......

Published : 08 Jul 2021 20:16 IST

దిల్లీ: ఎల్‌ఐసీ ఐపీవోకు సన్నద్ధమవుతున్న కేంద్ర ప్రభుత్వం.. ఆ సంస్థలోని అత్యున్నత పదవి విషయంలో కీలక మార్పులు చేసింది. ఎల్‌ఐసీ ఛైర్మన్‌ పదవిని చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌గా మార్చింది. అంటే ఎల్‌ఐసీ ఛైర్మన్‌ను ఇకపై సీఈవో అని వ్యవహరించాల్సి ఉంటుంది. ఈ మేరకు ఆర్థిక మంత్రిత్వ శాఖ నేతృత్వంలోని డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ఫైనాన్షియల్‌ సర్వీస్‌ ఎల్‌ఐసీ చట్టం 1956లోని కొన్ని సవరణలు చేసింది. ఈ మేరకు జులై 7న  గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ చేసింది.

మరోవైపు ఎల్‌ఐసీ ఐపీవో ద్వారా భారీగా నిధులు సమకూర్చుకోవాలని భావిస్తున్న కేంద్ర ప్రభుత్వం.. ఇప్పటికే అధీకృత మూలధనాన్ని రూ.25వేల కోట్లకు పెంచింది. ఈ మేరకు కొన్ని నిబంధనలను సవరించింది. తొలుత ఓ ఐదు శాతం షేర్లను విక్రయించాలని లక్ష్యంగా పెట్టుకున్న కేంద్రం.. ఐదేళ్ల తర్వాత 25 శాతం మేర వాటాలను విక్రయించాలని భావిస్తోంది. ఇటీవలే ఎల్‌ఐసీ ఛైర్మన్‌గా ఉన్న ఎంఆర్‌ కుమార్‌ పదవీకాలాన్ని కూడా పొడిగించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని