సుకన్య సమృద్ధి యోజనతో పాప భవిష్యత్తు బంగారం చేద్దామా!
సుకన్య సమృద్ధి యోజన పథకంలో పెట్టుబడి సురక్షితం, వడ్డీపై పన్ను మినహాయింపు, కచ్చితమైన రాబడి ఉంటుంది.
సుకన్య సమృద్ధి యోజన పథకంలో పెట్టుబడి సురక్షితం, వడ్డీపై పన్ను మినహాయింపు, కచ్చితమైన రాబడి ఉంటుంది దేశ జనాభా తోపాటు వారి జీవన ప్రమాణాలు , అవసరాలు కూడా పెరిగాయి . విదేశాలనుంచి దిగుమతులను తగ్గించి స్వదేశంలోనే ఉత్పత్తి పెంచేందు ప్రభుత్వం 'మేక్ ఇన్ ఇండియా ’ అనే నినాదంతో విదేశీ పెట్టుబడి దారులను ఆహ్వానిస్తోంది . ఈ ఉద్యమంలో స్త్రీ, పురుషులు ఇద్దరూ సమానమే . ముఖ్యంగా యువత ఈ ఉద్యమాన్ని ఎంతో బాధ్యతతో ముందుకు తీసుకువెళుతున్నారు.
ప్రస్తుతం ఆడపిల్లలు అన్ని రంగాలలోని ఉద్యోగాల్లో ముందంజ వేస్తున్నారు. స్వంతంగా సంస్థలను నడుపుతున్నారు. అంకుర సంస్థలను స్థాపించి నలుగురికి ఉపాధితోపాటు కల్పించడంతో పాటు ఆదర్శంగా నిలుస్తున్నారు. మారుతున్న కాలానికి తగ్గట్లు ఆడపిల్లలు చదువులో ముందుంటున్నారు. అయితే నాణ్యమైన ఉన్నత చదువులు కొంచెం ఖరీదైనవి. అయితే ఒక పద్దతి ప్రకారం మదుపు చేసినట్లయితే నాణ్యమైన ఉన్నత చదువులు సాధించవచ్చు.
ఉదా : కరుణ , కరుణాకరరావు లకు ఒక ఏడాది కుమార్తె కిరణ్మయి. భవిష్యత్తులో మంచి చదువు చెప్పించాలని వారి కోరిక. అందుకోసం వారు కొనుగొన్న వివరాలు ఈ కింది పట్టికలు చూపించడమైనది.
పాప బంగారు భవిష్యత్తు కోసం వారు సుకన్య సమృద్ధి యోజన పధకాన్ని ఎంచుకున్నారు. ముఖ్యంగా ఆడపిల్లల కోసం ప్రవేశ పెట్టిన మదుపు పధకం ’ సుకన్య సమృద్ధి యోజన '. ఇందులో పెట్టుబడి సురక్షితం, వడ్డీపై పన్ను మినహాయింపు, కచ్చితమైన రాబడి ఉంటుంది . దీని ద్వారా 10 ఏళ్ల లోపు ఉన్న ఆడపిల్లల పేరుమీద ఖాతా తెరిచి, వార్షికంగా రూ 1.50 లక్షల వరకు జమ చేసినట్లయితే , పాపకు 18 సంవత్సరాల వయసుకు తగిన మొత్తం జమ అవుతుంది.
వారు మొదటి ఐదు సంవత్సరాలు ప్రతి నెల రూ 12,500 (వార్షికంగా రూ 1.50 లక్షలు ) జమ చేస్తారు. తరువాతి ఐదు సంవత్సరాలు నెలకు రూ 16,667 (వార్షికంగా రూ 2 లక్షలతో), అలాగే చివరి నాలుగు సంవత్సరాలు ప్రతి నెల రూ 20,833 (వార్షికంగా రూ 2.50 లక్షలు ) జమ చేస్తారు.
ఈ కింది పట్టిక ద్వారా ఎంత జమ అవుతుందో చూద్దాం:
ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 80సి కింద వార్షికంగా రూ 1.50 లక్షల వరకు పన్ను మినహాయింపు పొందవచ్చు. ప్రతి 5 సంవత్సరాలకు ప్రభుత్వం పన్ను మినహాయింపు పరిమితిని పెంచుతుందని , మొత్తం కాలానికి వార్షిక వడ్డీ రేటు 7.6 శాతంగా ఉంటుందని అంచనా వేయడమైనది.
ముగింపు:
ఇప్పటికి ఈ మొత్తం ఎక్కువగా అనిపించ వచ్చు. అయితే పెరుగుతున్న విద్యా ఖర్చులను పరిగణనలోకి తీసుకుంటే , 18 సంవత్సరాలకు ఈ మొత్తం సరిపోకపోవచ్చు. ఎందుకంటే ఉన్నత విద్యా ఖర్చులు వార్షికంగా 8-10 శాతం పెరుగుతుంటాయి.
ప్రభుత్వ నియమ నిబంధలను అనుసరించి ఖాతాను నిర్వహించాలి. ఇంతకంటే అధిక మొత్తంలో మదుపు చేయాలనుకుంటే ఈ పధకంతోపాటు పీ పీ ఎఫ్ , ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ వంటి వాటిలో కూడా మదుపు చేసి పన్ను మినహాయింపు పొందవచ్చు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
మంత్రిగారి నగదు ‘బదిలీ’లకు కోడ్ ఉన్నా ఆమోదం
-
విజయ్ ‘ఫ్యామిలీ స్టార్’ ఓటీటీలోకి వచ్చేసింది.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
రమణదీక్షితులుపై కేసులో 41ఏ నోటీసు నిబంధనను పాటించండి: పోలీసులకు హైకోర్టు ఆదేశం
-
వైకాపా వెన్నులో వణుకు.. చెమటలు పట్టిస్తున్న పూతలపట్టు కాంగ్రెస్ అభ్యర్థి
-
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
-
టీఎస్బీపాస్తోనే అనుమతులు.. డీపీఎంఎస్ విధానం పూర్తిగా నిలుపుదల