TATA Group: కర్ణాటకలో టాటా గ్రూప్ రూ.2,300 కోట్ల పెట్టుబడులు
TATA Group: ఎయిరిండియా, ‘టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ లిమిటెడ్ (TASL)’ కలిసి కర్ణాటకలో రూ.2,300 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నాయి.
బెంగళూరు: టాటా గ్రూప్ (TATA Group) కంపెనీలైన ఎయిరిండియా, ‘టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ లిమిటెడ్ (TASL)’ కర్ణాటకలో రూ.2,300 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నాయి. దీనివల్ల దాదాపు 1,650 మందికి ప్రత్యక్షంగా ఉపాధి లభించనున్నట్లు కంపెనీ ప్రతినిధులు ప్రకటించారు. ఈమేరకు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, భారీ, మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి ఎం.బి.పాటిల్ సమక్షంలో ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం కుదిరింది.
‘మెయింటెనెన్స్ రిపేర్ అండ్ ఓవర్హాల్ (MRO)’ ఫెసిలిటీని ఏర్పాటుచేసి దక్షిణ భారత్లో బెంగళూరును ఏవియేషన్ కేంద్రంగా మార్చనున్నట్లు ఎయిరిండియా తెలిపింది. దీనికోసం రూ.1,300 కోట్లు వెచ్చించనున్నట్లు వెల్లడించింది. ప్రత్యక్షంగా 1,200 మందికి ఉపాధి లభిస్తుందని పేర్కొంది. హబ్ ఏర్పాటు వల్ల ప్రత్యక్షంగా, పరోక్షంగా 25 వేల మందికి ఉపాధి దొరుకుతుందని ‘నేషనల్ కౌన్సిల్ ఫర్ అప్లయిడ్ ఎకానమిక్ రీసెర్చ్’ అధ్యయనం తెలిపింది. దీనివల్ల వ్యాపార కార్యలాపాలు పుంజుకోవటంతో పాటు పర్యటకం సైతం అభివృద్ధి చెందుతుందని పేర్కొంది.
టీఏఎస్ఎల్ రూ.1,030 కోట్లతో మూడు ప్రాజెక్టులు చేపట్టనుంది. ప్యాసింజర్ టు ఫ్రెయిటర్ ఎయిర్క్రాఫ్ట్ కన్వర్షన్ ఫెసిలిటీ (రూ.420 కోట్లు), గన్ తయారీకేంద్రం (రూ.310 కోట్లు), ఏరోస్పేస్- డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ (రూ.300 కోట్లు) కేంద్రం ఏర్పాటుచేయనున్నట్లు తెలిపింది. 450 మందికి ప్రత్యక్షంగా ఉపాధి లభిస్తుందని వెల్లడించింది. గన్ తయారీ కేంద్రానికి కావాల్సిన 13,000 భాగాల్లో 50 శాతానికి పైగా కర్ణాటక నుంచే సమకూర్చుకోనున్నట్లు తెలిపింది. తద్వారా 300-350 చిన్న, మధ్యతరహా పరిశ్రమల్లో మరో 2,000-3,000 మందికి ఉపాధి లభిస్తుందని పేర్కొంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మహిళా ఆవిష్కర్తలు పెరగాలి
మనదేశంలో మహిళా ఆవిష్కర్తల సంఖ్య తక్కువగా ఉండటం ఆందోళన కలిగిస్తోందని, ఈ అంశంపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ అన్నారు. -
వరుస లాభాలకు విరామం
సూచీల అయిదు రోజుల లాభాల ర్యాలీకి కళ్లెం పడింది. మిశ్రమ అంతర్జాతీయ సంకేతాల నేపథ్యంలో బ్యాంకింగ్, ఫైనాన్స్ షేర్లలో మదుపర్లు లాభాలు స్వీకరించారు. -
2047 నాటికి ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తెలంగాణ
తెలంగాణ 2047 నాటికి ఒక ట్రిలియన్ డాలర్ల (రూ.85 లక్షల కోట్ల) ఆర్థిక వ్యవస్థగా మారేందుకు భారత పరిశ్రమల సమాఖ్య(సీఐఐ) తన వంతు పాత్ర పోషిస్తుందని సీఐఐ తెలంగాణ ఛైర్మన్, భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సాయి డి ప్రసాద్ అన్నారు. -
హార్లిక్స్ ‘హెల్త్ డ్రింక్’ కాదు
హిందుస్థాన్ యునిలీవర్(హెచ్యూఎల్) తన బ్రాండ్ హార్లిక్స్ లేబుల్పై కీలక మార్పులు చేసింది. గతంలో ‘హెల్త్ ఫుడ్ డ్రింక్స్’ కేటగిరిలో ఉన్న హార్లిక్స్ను ‘ఫంక్షనల్ న్యూట్రిషనల్ డ్రింక్స్’ కేటగిరిలోకి మార్చింది. -
రిలయన్స్కు రేటింగ్ సంస్థల ‘జై’
2024 మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి బలమైన ఆర్థిక ఫలితాలను ప్రకటించడంతో రిలయన్స్ ఇండస్ట్రీస్కు అంతర్జాతీయ రేటింగ్ సంస్థలు ఎస్ అండ్ పీ, ఫిచ్ జై కొట్టాయి. -
భారత జీడీపీ వృద్ధి 6.6 శాతం
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2024-25)లో భారత జీడీపీ వృద్ధి 6.6 శాతంగా నమోదుకావొచ్చని డెలాయిట్ ఇండియా అంచనా వేసింది. -
మారుతీకి విక్రయాల జోష్
జనవరి-మార్చి త్రైమాసికంలో మారుతీ సుజుకీ ఇండియా నికర లాభం 47.8 శాతం పెరిగి రూ.3,877.70 కోట్లుగా నమోదైంది. -
హెచ్సీఎల్ టెక్ లాభం రూ.3,986 కోట్లు
దేశంలో మూడో అతిపెద్ద ఐటీ సంస్థ హెచ్సీఎల్ టెక్ జనవరి- మార్చి త్రైమాసికంలో రూ.3,986 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. ఏడాది క్రితం ఇదే త్రైమాసికంలో కంపెనీ లాభం రూ.3,983 కోట్లుగా ఉంది. -
పూర్తి స్థాయి బ్యాంకులుగా మారేందుకు ఎస్ఎఫ్బీల నుంచి దరఖాస్తుల ఆహ్వానం
పూర్తి స్థాయి బ్యాంకులుగా మారేందుకు నిర్దేశిత అర్హతలను కలిగి ఉన్న స్మాల్ ఫైనాన్స్ బ్యాంకుల (ఎస్ఎఫ్బీ) నుంచి దరఖాస్తులను ఆహ్వానించినట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తెలిపింది. -
సంక్షిప్త వార్తలు(6)
అపోలో హాస్పిటల్స్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ (ఏహెచ్ఈఎల్) అనుబంధ సంస్థ అపోలో హెల్త్కో లిమిటెడ్(అపోలో 24/7)కు రూ.2,475 కోట్ల ఈక్విటీ పెట్టుబడులు వచ్చాయి. -
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
Flipkart: ఫ్లిప్కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ తేదీలను ప్రకటించింది. మే 3 నుంచి 9 వరకు ఈ సేల్ అందుబాటులో ఉండనుంది.