Musk Vs Zuckerberg: కేజ్ ఫైట్కు మస్క్, జుకర్బర్గ్ రెడీ.. ట్రైనింగ్ షురూ!
ప్రపంచ కుబేరులైన ఎలాన్ మస్క్, మార్క్ జుకర్బర్గ్ ఫైట్కు సిద్ధమవుతున్నారు. ఇందుకోసం శిక్షణ కూడా తీసుకుంటున్నారు. దీనిపై సోషల్మీడియాలో విపరీతంగా చర్చ జరుగుతోంది.
Image source: Twitter
ఇంటర్నెట్ డెస్క్: అమెరికాకు చెందిన టెక్ దిగ్గజాలు ఎలాన్ మస్క్ (Elon Musk), మార్క్ జుకర్బర్గ్ (Zuckerberg) పోరుకు సన్నద్ధమవుతున్నారు. అలాగని ఏ కొత్త యాప్ కోసమో.. కొత్త టెక్నాలజీ తీసుకురావడం కోసమో వీరి మధ్య పోటీ అనుకుంటే పొరపాటే. పరస్పరం తలపడేందుకు సిద్ధమవుతున్నారీ కుబేరులు. పరస్పరం సవాళ్లు విసురుకోవడంతో ప్రారంభమైన ఈ ప్రచారం.. ఇప్పుడు ట్రైనింగ్ సెషన్ వరకూ చేరడంతో దిగ్గజాల మధ్య ఫైట్ తథ్యమని చర్చించుకుంటున్నారు.
జుకర్బర్గ్ రెడీ అంటే అతడితో తాను కేజ్ ఫైట్కు (cage fight) తాను సిద్ధం అంటూ తొలుత మస్క్ (Elon Musk) ట్విటర్లో పేర్కొన్నాడు. దీనిపై జుకర్బర్గ్ (Zuckerberg) స్పందిస్తూ ‘ప్లేస్ ఎక్కడో చెప్పు’ అంటూ బాలయ్య స్టయిల్లో సవాల్కు సై అన్నాడు. ‘వెగాస్ ఆక్టాగాన్’.. రా చూసుకుందాం’ అంటూ అదే స్టయిల్లో మస్క్ సమాధానమిచ్చాడు. దీంతో వీరిద్దరూ కేజ్ ఫైట్లో తలపడబోతున్నారంటూ ప్రచారం మొదలైంది.
ఏమిటీ కేజ్ ఫైట్..?
డబ్ల్యూడబ్ల్యూఈ (WWE) చూసే వారికి ఈ ఫైట్ గురించి తెలిసే ఉంటుంది. చుట్టూ బోనులాంటి ఆకారం ఉంటుంది. అందులో తలపడే రెజ్లర్లు మాత్రమే ఉంటారు. ఎవరైతే ప్రత్యర్థిని కోలుకోలేకుండా దెబ్బతీసి ఆ బోను ఎక్కుతారో అతడిని విజేతగా ప్రకటిస్తారు.
ట్రైనింగ్లో మస్క్, జుకర్
తొలుత వీరి మధ్య పోరు ప్రచారంలా కనిపించినా.. తాజాగా వీరు ట్రైనింగ్ సెషన్లోనూ పాల్గొనడం చూస్తే ఫైట్ నిజమే అనిపిస్తోంది. రష్యన్-అమెరికన్ అయిన లెక్స్ ఫ్రిడ్మ్యాన్ తాజాగా చేసిన ట్వీట్ ఈ ఇందుకు బలం చేకూరుస్తోంది. ఇద్దరు బిలియనీర్లతో తాజాగా ట్రైనింగ్ సెషన్లో పాల్గొన్నానంటూ అతడు ట్వీట్ చేశాడు. ఎలాన్, జుకర్బర్గ్ మార్షల్ ఆర్ట్స్ ప్రతిభ చూస్తుంటే ఎంతో ముచ్చటేస్తోందని అందులో పేర్కొన్నాడు. వారిద్దరూ కేజ్ ఫైట్ చేయకుండా ఉంటేనే మంచిదని అభిప్రాయపడ్డాడు. ‘మస్క్ చెప్పినట్లుగా.. ఎంటర్టైన్మెంట్ మాత్రం పక్కా’ అని పేర్కొన్నాడు. ఇందుకోసం తాను ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు తెలిపాడు. మస్క్ ట్రైనింగ్లో పాల్గొన్న ఫొటోనూ ట్వీట్లో జత చేశాడు. అంతకుముందు జుకర్బర్గ్కు ట్రైనింగ్ సెషన్ వీడియోనూ ప్రిడ్మ్యాన్ పోస్ట్ చేశాడు.
సోషల్మీడియాలో సందడే సందడి
మస్క్, జుకర్ బర్గ్ మధ్య కేజ్ ఫైట్ నిజంగానే జరుగుతుందో లేదో గానీ సోషల్ మీడియాలో మాత్రం దీని గురించి గట్టిగానే చర్చ జరుగుతోంది. ఒకవేళ తలపడితే వీరిద్దరిలో ఎవరు గెలుస్తారు? అంటూ అప్పుడే పోస్టులు పెడుతున్నారు. 2020 నుంచి మార్షల్ ఆర్ట్స్లో శిక్షణ తీసుకుంటున్న జుకర్బర్గ్ చేతిలో మస్క్ ఓడిపోవడం ఖాయం అంటూ కొందరు పోస్టులు పెడుతుండగా.. మస్క్దే పైచేయి అవుతుందంటూ ఇంకొందరు పోస్టులు పెడుతున్నారు. దీనిపై రూపొందించిన కొన్ని మీమ్స్ సైతం నెట్టింట సందడి చేస్తున్నాయి. కొందరైతే ఏకంగా టీషర్టుల విక్రయాలు కూడా మొదలుపెట్టేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఇండీజీన్ ఐపీఓ ప్రారంభం.. రూ.1,842 కోట్ల సమీకరణ లక్ష్యం
Indegene IPO: రూ.1,842 కోట్ల సమీకరణ లక్ష్యంతో ఇండీజీన్ ఐపీఓ ప్రారంభమైంది. మదుపర్లు రూ.14,916తో కనీసం 33 షేర్లకు (ఒక లాట్) బిడ్లు దాఖలు చేయాలి. -
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 74,000 ఎగువన సెన్సెక్స్
Stock Market Opening bell: ఉదయం 9:25 గంటల సమయంలో సెన్సెక్స్ 202 పాయింట్ల లాభంతో 74,080 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 35 పాయింట్లు పుంజుకొని 22,511 దగ్గర కొనసాగుతోంది. -
లేని సీట్లు అమ్మి.. రూ.550 కోట్ల ఫైన్ కట్టి.. ఓ విమానయాన సంస్థ నిర్వాకం!
Qantas: కాంటాస్ అనే ఆస్ట్రేలియా విమానయాన సంస్థ క్యాన్సిల్ అయిన విమానాల్లోని సీట్లను విక్రయించింది. దీన్ని తీవ్రంగా తప్పుబట్టిన అక్కడి నియంత్రణా సంస్థ రూ.550 కోట్ల జరిమానా విధించింది. -
3 ఐపీఓలు.. రూ.6,400 కోట్ల లక్ష్యం
ఈ వారం మూడు కంపెనీల తొలి పబ్లిక్ ఆఫర్ (ఐపీఓ)లు మార్కెట్లో సందడి చేయనున్నాయి. రూ.6,400 కోట్ల సమీకరించే లక్ష్యంతో ఆధార్ హౌసింగ్ ఫైనాన్స్, ఇండీజీన్, టీబీఓ టెక్ ఐపీఓలు వస్తున్నాయి. -
లాభాలకే అవకాశం
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ వారం రాణించే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. గత శుక్రవారం సూచీలు భారీగా నష్టపోయినా, అది తాత్కాలికమేనని.. సూచీలు అధిక స్థాయులకు చేరాయనే భావనతో, లాభాల స్వీకరణకు దిగడం వల్లే ఆ పరిస్థితి ఏర్పడిందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. -
పసిడిలో లాభాల స్వీకరణ!
పసిడి ఇటీవల రూ.73,925 వద్ద గరిష్ఠాన్ని తాకిన తర్వాత లాభాల స్వీకరణ కనిపిస్తోంది. ఇదే ధోరణి కొనసాగితే జూన్ కాంట్రాక్టు ఈ వారం రూ.69,418 వరకు పడిపోవచ్చు. -
75,100 పైన మరిన్ని సానుకూలతలు!
సానుకూల అంతర్జాతీయ సంకేతాల ప్రభావంతో గత వారం సూచీలు స్వల్ప లాభాల్లో ముగిశాయి. దేశీయ కంపెనీల త్రైమాసిక ఫలితాలు, ముడిచమురు ధరలు చల్లపడటం కలిసొచ్చాయి. -
పురుగు మందుల అవశేషాలపై భారత్లో కఠిన నిబంధనలు: ప్రభుత్వం
ఆహార పదార్థాల్లో పురుగు మందుల అవశేషాల విషయంలో.. భారత్ అత్యంత కఠినమైన నిబంధనలను కలిగి ఉందని ప్రభుత్వం ఆదివారం పునరుద్ఘాటించింది. -
గృహ రుణ బకాయిలు పెరిగాయ్: ఆర్బీఐ
గృహ నిర్మాణ రంగానికి బకాయిపడిన రుణాలు గత రెండు ఆర్థిక సంవత్సరాల్లో సుమారు రూ.10 లక్షల కోట్లు పెరిగి ఈ ఏడాది మార్చి నాటికి రికార్డు స్థాయిలో రూ.27.23 లక్షల కోట్లకు చేరాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) విడుదల చేసిన డేటా వెల్లడించింది.
తాజా వార్తలు (Latest News)
-
రహదారిపై గుంతలకు NHAI కొత్త టెక్నిక్.. వాటంతట అవే పూడుకునేలా.!
-
ఏపీ నూతన డీజీపీగా హరీశ్కుమార్ గుప్తా
-
సీఎం రేవంత్ స్థాయి మరిచి మాట్లాడుతున్నారు: డీకే అరుణ
-
ఓటీటీలోకి హారర్ కామెడీ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే
-
హైదరాబాద్ ‘ప్లేఆఫ్స్’ ఛాన్స్కు ముంబయి ఎసరు పెడుతుందా ?
-
టీ20 ప్రపంచకప్నకు ఉగ్ర ముప్పు..! స్పందించిన ట్రినిడాడ్ పీఎం, ఐసీసీ