75,100 పైన మరిన్ని సానుకూలతలు!
సానుకూల అంతర్జాతీయ సంకేతాల ప్రభావంతో గత వారం సూచీలు స్వల్ప లాభాల్లో ముగిశాయి. దేశీయ కంపెనీల త్రైమాసిక ఫలితాలు, ముడిచమురు ధరలు చల్లపడటం కలిసొచ్చాయి.
సమీక్ష: సానుకూల అంతర్జాతీయ సంకేతాల ప్రభావంతో గత వారం సూచీలు స్వల్ప లాభాల్లో ముగిశాయి. దేశీయ కంపెనీల త్రైమాసిక ఫలితాలు, ముడిచమురు ధరలు చల్లపడటం కలిసొచ్చాయి. దేశీయంగా చూస్తే.. ఏప్రిల్లో తయారీ పీఎంఐ 58.8గా నమోదైంది. మార్చిలో కీలక రంగాల వృద్ధి 5.2 శాతానికి నెమ్మదించింది. ఏప్రిల్లో జీఎస్టీ వసూళ్లు రికార్డు గరిష్ఠమైన రూ.2.1 లక్షల కోట్లకు చేరాయి. బ్యారెల్ ముడిచమురు 7.3 శాతం తగ్గి 83 డాలర్లకు చేరింది. అంతర్జాతీయంగా.. వరుసగా ఆరో సమీక్షలోనూ అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచింది. ఏప్రిల్లో అమెరికాలో కొత్త ఉద్యోగాలు అంచనాల కంటే తక్కువగా 1,75,000గా నమోదయ్యాయి. మొత్తం మీద ఈ పరిణామాలతో గత వారం సెన్సెక్స్ 0.2% లాభంతో 73,878 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 0.2% తగ్గి 22,476 పాయింట్ల దగ్గర స్థిరపడింది. విదేశీ సంస్థాగత మదుపర్లు (ఎఫ్ఐఐలు) నికరంగా రూ.1211 కోట్ల షేర్లను విక్రయించగా, డీఐఐలు రూ.5,253 కోట్ల షేర్లను కొనుగోలు చేశారు. ఏప్రిల్లో విదేశీ పోర్ట్ఫోలియో మదుపర్లు (ఎఫ్పీఐలు) నికరంగా రూ.8,700 కోట్ల పెట్టుబడులు వెనక్కి తీసుకున్నారు. మేలో రెండు ట్రేడింగ్ రోజుల్లో రూ.1,156 కోట్ల పెట్టుబడులు పెట్టారు.
లాభపడ్డ, నష్టపోయిన షేర్ల నిష్పత్తి 3:5గా నమోదు కావడం..
కొన్ని పెద్ద షేర్లలో లాభాల స్వీకరణను సూచిస్తోంది.
ఈ వారంపై అంచనా: గతవారం సెన్సెక్స్ జీవనకాల గరిష్ఠమైన 72,124 పాయింట్లకు చేరువై, మళ్లీ వెనక్కి వచ్చింది. స్వల్పకాలంలో 75,100 పాయింట్ల వద్ద నిరోధం ఎదురుకావొచ్చు. ఇది అధిగమిస్తే మరిన్ని లాభాలకు అవకాశం ఉంటుంది. మరోవైపు 73,000 వద్ద మద్దతు దక్కొచ్చు.
ప్రభావిత అంశాలు: దేశీయ సూచీలపై అంతర్జాతీయ సంకేతాల ప్రభావం కొనసాగొచ్చు. కంపెనీల త్రైమాసిక ఫలితాల నేపథ్యంలో షేరు ఆధారిత కదలికలు కీలకం కానున్నాయి. ఈ నెల 7న లోక్సభ ఎన్నికల మూడో విడత పోలింగ్ జరగనుండటంతో ఓటింగ్ శాతంపై దృష్టిపెట్టొచ్చు. ఈ వారం లుపిన్, మారికో, డాక్టర్ రెడ్డీస్, గోద్రేజ్ కన్జూమర్, వోల్టాస్, పిడిలైట్, టాటా పవర్, హీరో మోటోకార్ప్, ఎల్ అండ్ టీ, ఎస్బీఐ, ఏషియన్ పెయింట్స్, బీపీసీఎల్, సిప్లా, టాటా మోటార్స్, బ్యాంక్ ఆఫ్ బరోడా, టీవీఎస్, కెనరా బ్యాంక్ వంటి దిగ్గజ కంపెనీలు ఫలితాలు ప్రకటించనున్నాయి. అంతర్జాతీయంగా.. ఆస్ట్రేలియా, బ్రిటన్ కేంద్ర బ్యాంకులు వడ్డీ రేట్లను ప్రకటించనున్నాయి. బ్రిటన్ జీడీపీ, చైనా ఎగుమతుల గణాంకాలపై కన్నేయొచ్చు. రూపాయి కదలికలు, ఎఫ్ఐఐ పెట్టుబడులు, చమురు ధరల నుంచి సంకేతాలు తీసుకోవచ్చు. చమురు ధరలు మరింత తగ్గితే దేశీయ సెంటిమెంట్ బలపడనుంది.
తక్షణ మద్దతు స్థాయులు: 73,227, 72,365, 71,816
తక్షణ నిరోధ స్థాయులు: 74,450, 75,095, 75,600
సెన్సెక్స్ 75,100 ఎగువన ముగిస్తే మరింత లాభపడొచ్చు.
సతీశ్ కంతేటి, జెన్ మనీ
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రత్యేక ట్రేడింగ్ సెషన్.. సెన్సెక్స్ 88+, నిఫ్టీ @ 22,500
Stock Market: దేశీయ స్టాక్ మార్కెట్లు శనివారం కొంతసేపు పనిచేశాయి. ఈ ప్రత్యేక సెషన్లో సూచీలు లాభపడ్డాయి. -
నవ లిమిటెడ్.. రుణ రహితం
ఫెర్రో అల్లాయ్స్, మైనింగ్, విద్యుదుత్పత్తిలో నిమగ్నమై ఉన్న నవ లిమిటెడ్, గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో ఏకీకృత ఖాతాల ప్రకారం రూ.951.6 కోట్ల ఆదాయాన్ని, రూ.255.1 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది. -
వసూళ్లు 27%.. వదులుకుంది 73%
నిరర్థక ఆస్తులుగా మారిన రుణాల నుంచి వసూళ్లకు చేపట్టిన దివాలా పరిష్కార ప్రక్రియ, ఆర్థిక సంస్థలకు ఎంతగా ఉపయోగ పడుతోందో ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. -
నలుపు రంగులో అపాచీ ఆర్టీఆర్ 160
టీవీఎస్ మోటార్ తన ‘అపాచీ 160 ఆర్టీఆర్’ బైక్లో బ్లాక్ డార్క్ ఎడిషన్ (నలుపు రంగు)ను తీసుకొచ్చింది. -
టీవీ ఛానళ్లతో పాటు ఓటీటీ ప్రసారాలూ.. స్మార్ట్ ప్లస్ను ఆవిష్కరించిన డిష్ టీవీ
టీవీ ఛానళ్లతోపాటు, ఓటీటీ ప్రసారాలూ అందించే స్మార్ట్ ప్లస్ సేవలు ప్రారంభిస్తున్నట్లు డైరెక్ట్-టు-హోమ్ సేవలను అందించే డిష్ టీవీ ప్రకటించింది. -
2031కి రిటైల్ విపణి రెట్టింపు
భారత వినియోగ వస్తు- సేవల విపణి 2031 కల్లా రెట్టింపు కావొచ్చని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అభిప్రాయపడ్డారు. -
మదుపర్ల సంపద రూ.410 లక్షల కోట్లకు
వరుసగా రెండో రోజూ సెన్సెక్స్, నిఫ్టీ లాభపడ్డాయి. ఎం అండ్ ఎం, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఐటీసీ షేర్లు కొనుగోళ్లతో కళకళలాడాయి. అయితే విదేశీ మదుపర్ల అమ్మకాలు కొనసాగడంతో లాభాలు పరిమితమయ్యాయి. -
ప్రస్తుత కంపెనీలకూ ప్రోత్సాహకాలు!
విద్యుత్ వాహన (ఈవీ) నూతన విధానాన్ని అనుసరించి, పెట్టుబడులు పెట్టాలనుకుంటున్న సంస్థలకు ప్రభుత్వం మార్గదర్శకాలను విడుదల చేయనుంది. -
విదేశీ ఫండ్ల ఆస్తుల్లో 20% వరకే మన మార్కెట్లకు! : సెబీ ప్రతిపాదన
మ్యూచువల్ ఫండ్లలో విదేశీ పెట్టుబడులను మరింత సులభతరం చేసే దిశగా మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ కొన్ని చర్యలను ప్రతిపాదించింది. -
కియా కార్లు అద్దెకూ తీసుకోవచ్చు.. హైదరాబాద్ సహా 6 నగరాల్లో
కారు కొంటే బీమా - నిర్వహణ ఖర్చుల వంటివి తప్పవు. మరో కొత్త మోడల్ కొనుగోలుకు పాత కారు విక్రయించాలంటే తగిన ధర వస్తుందో రాదో అనే బెంగ ఒకటి. -
సంక్షిప్త వార్తలు(5)
కేన్సర్ వ్యాధి చికిత్సలో వినియోగించే కాబోజాంటినిబ్ ట్యాబ్లెట్లను హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఎంఎస్ఎన్ ల్యాబ్స్ ఉత్పత్తి చేసి, జైడస్ లైఫ్సైన్సెస్కు సరఫరా చేయనుంది. -
ఇక కంటితోనే స్క్రీన్ను ఆపరేట్ చేసేలా: త్వరలో యాపిల్ కొత్త ఫీచర్లు
Apple: దివ్యాంగులు కూడా ఐఫోన్, ఐప్యాడ్లను సులువుగా వినియోగించేందుకు వీలుగా యాపిల్ కొత్త ఫీచర్లును త్వరలోనే తీసుకురానున్నట్లు వెల్లడించింది. -
ఆరోగ్యకరమైన ఆహారం.. జొమాటోలో కొత్త ఫీచర్
Zomato: జొమాటోలో కొత్త ఫీచర్ని తీసుకొచ్చినట్లు కంపెనీ సీఈఓ దీపిందర్ గోయల్ ‘ఎక్స్’ వేదికగా ప్రకటించారు. ఇంతకీ ఆ ఫీచర్ ఎలా ఉపయోగపడనుందంటే..
తాజా వార్తలు (Latest News)
-
అయోధ్య రామాలయం గేట్లు తెరిపించిందే కాంగ్రెస్ ప్రభుత్వం: జీవన్రెడ్డి
-
స్వాతి మాలీవాల్పై దాడి ఘటన.. కేజ్రీవాల్ సహాయకుడు బిభవ్ అరెస్ట్
-
మళ్లీ ట్రెండింగ్లోకి రాజమౌళి - మహేశ్ల ప్రాజెక్ట్.. కారణమిదే!
-
23 వరకు ఏపీ, తెలంగాణలో మోస్తరు నుంచి భారీ వర్షాలు
-
ఐదేళ్లుగా పవిత్రతో నా భర్త సహజీవనం: చందు భార్య శిల్ప
-
బెంగళూరు-చెన్నై కీలక పోరు.. వాతావరణ పరిస్థితి ఎలా ఉండనుందంటే?