EPFO: ఈపీఎఫ్‌ వడ్డీ రేటు 8.25శాతం.. ఖరారు చేసిన సీబీటీ

EPF Interest Rate: 2023-24 ఆర్థిక సంవత్సరానికి గానూ ఈపీఎఫ్‌ డిపాజిట్లపై 8.25శాతం వడ్డీఇవ్వాలని నిర్ణయించారు. ఈ మేరకు ఈపీఎఫ్‌వో వర్గాలు వెల్లడించాయి.

Updated : 10 Feb 2024 11:05 IST

దిల్లీ: ఉద్యోగుల భవిష్య నిధి(EPF) ఖాతాల్లో నిల్వలపై వడ్డీరేటు ఖరారైంది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి గానూ 8.25 శాతం వడ్డీరేటు (Interest Rate)ను నిర్ణయించారు. ఈ మేరకు శనివారం జరిగిన సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ట్రస్టీస్‌ సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు ఈపీఎఫ్‌వో (EPFO) వర్గాలు వెల్లడించాయి. గత మూడేళ్లలో ఇదే అత్యధికం. 

సీబీటీ (CBT) నిర్ణయాన్ని కేంద్ర ఆర్థిక శాఖకు పంపనున్నారు. ప్రభుత్వం నుంచి ఆమోదం వచ్చిన తర్వాత వడ్డీ రేటును ఈపీఎఫ్‌ఓ అధికారికంగా నోటిఫై చేస్తుంది. ఆ తర్వాత వడ్డీ మొత్తాన్ని ఈపీఎఫ్‌ఓ (EPFO) 6 కోట్ల చందాదారుల ఖాతాల్లో జమ చేస్తుంది. సీబీటీ ప్రతిపాదనలపై కేంద్ర ఆర్థికశాఖ త్వరలోనే నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది.

గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఇది కాస్త ఎక్కువ. 2022-23 ఆర్థిక సంవత్సరానికి వడ్డీ రేటును 8.15శాతంగా నిర్ణయించారు. అంతకు ముందు 2021-22లో 8.10శాతం వడ్డీ చెల్లించారు. 

గత పదేళ్లలో ఈపీఎఫ్‌ (EPF) వడ్డీ రేట్లు ఇలా ఉన్నాయి..

  • 2013-14 : 8.75 శాతం
  • 2014-15 : 8.75 శాతం
  • 2015-16 : 8.8 శాతం
  • 2016-17 : 8.65 శాతం
  • 2017-18 : 8.55 శాతం
  • 2018-19 : 8.65 శాతం
  • 2019-20 : 8.5 శాతం
  • 2020-21 : 8.5 శాతం
  • 2021-22 : 8.1 శాతం
  • 2022-23 : 8.15 శాతం
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని