టాటా నెక్సాన్‌లో కొత్త రకం

టాటా మోటార్స్‌ తన కాంప్యాక్ట్‌ ఎస్‌యూవీ నెక్సాన్‌లో కొత్త వేరియంట్‌ను ఆవిష్కరించింది. దీని ధర రూ.9.75లక్షలు (ఎక్స్‌-షోరూం). ఎక్స్‌ఎమ్‌(ఎస్‌), ఎక్స్‌జడ్‌+ వేరియంట్ల మధ్య తీసుకొచ్చిన....

Published : 14 Jul 2022 02:53 IST

దిల్లీ: టాటా మోటార్స్‌ తన కాంప్యాక్ట్‌ ఎస్‌యూవీ నెక్సాన్‌లో కొత్త వేరియంట్‌ను ఆవిష్కరించింది. దీని ధర రూ.9.75లక్షలు (ఎక్స్‌-షోరూం). ఎక్స్‌ఎమ్‌(ఎస్‌), ఎక్స్‌జడ్‌+ వేరియంట్ల మధ్య తీసుకొచ్చిన ఈ కొత్త వేరియంట్‌ను ఎక్స్‌ఎమ్‌+(ఎస్‌)గా పిలవనున్నారు. ఎలక్ట్రిక్‌ సన్‌రూఫ్‌, ఆండ్రాయిడ్‌ ఆటో, యాపిల్‌ కార్‌ప్లేతో ఏడు అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్‌ సిస్టమ్‌, కూల్డ్‌ గ్లోవ్‌ బాక్స్‌, వెనకవైపు ఏసీ వెంట్లు, రెయిన్‌ సెన్సింగ్‌ వైపర్లు, ఆటో హెడ్‌లాంప్స్‌ను జత చేశారు. ‘దేశంలో నెక్సాన్‌కు పెరుగుతున్న ఆదరణను దృష్టిలో పెట్టుకుని సరికొత్త వేరియంట్‌ తీసుకొచ్చామ’ని టాటా మోటార్స్‌ ప్యాసింజర్‌ వెహికల్స్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ (విక్రయాలు, మార్కెటింగ్‌, కస్టమర్‌ కేర్‌) రాజన్‌ అంబా పేర్కొన్నారు. ఇప్పటికే 3.5 లక్షలకు పైగా నెక్సాన్‌లను కంపెనీ విక్రయించింది. పెట్రోలు, డీజిల్‌ వెర్షన్‌లలో మొత్తం 62 వేరియంట్లు నెక్సాన్‌లో ఉన్నాయని కంపెనీ తెలిపింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని