Aviation: 24 గంటల ముందే కస్టమ్స్ విభాగానికి.. అంతర్జాతీయ ప్రయాణికుల వివరాలు
విమానం బయలుదేరడానికి 24 గంటల ముందే అంతర్జాతీయ ప్రయాణికుల వివరాలను కస్టమ్స్ విభాగంతో పంచుకోవాలని విమానయాన సంస్థలను ప్రభుత్వం కోరింది.
విమానయాన సంస్థలకు కేంద్రం ఆదేశాలు
దిల్లీ: విమానం బయలుదేరడానికి 24 గంటల ముందే అంతర్జాతీయ ప్రయాణికుల వివరాలను కస్టమ్స్ విభాగంతో పంచుకోవాలని విమానయాన సంస్థలను ప్రభుత్వం కోరింది. ఇందుకోసం ఆర్థిక శాఖ ఆధ్వర్యంలో పనిచేసే కేంద్ర పరోక్ష పన్నులు, కస్టమ్స్ బోర్డు (సీబీఐసీ) ‘ప్యాసింజర్ నేమ్ రికార్డ్ ఇన్ఫర్మేషన్ రెగ్యులేషన్స్, 2022’ను ఈనెల 8న నోటిఫై చేసింది. ఆర్థిక, ఇతరత్రా నేరాలకు పాల్పడిన వారు దేశం నుంచి పారిపోకుండా, దొంగచాటు రవాణా (స్మగ్లింగ్) జరగకుండా చూసేందుకే ఈ వివరాలు కోరుతున్నట్లు తెలుస్తోంది. సీబీఐసీ ఏర్పాటు చేసిన ‘ద నేషనల్ కస్టమ్స్ టార్గెటింగ్ సెంటర్-ప్యాసింజర్’ ఈ సమాచారాన్ని మదింపు చేస్తుంది. తదనంతరం కస్టమ్స్ చట్టం కింద నేరాల అదుపు, గుర్తింపు, దర్యాప్తు, విచారణలను చేపడుతుంది. ఇతర ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీలు లేదా ఇతర దేశాల కోసం కూడా ఈ పని చేస్తుందని ప్రభుత్వం తెలిపింది.
60 దేశాల సరసన: తాజా పరిణామంతో, అంతర్జాతీయ ప్రయాణికుల వివరాలను ముందుగా సేకరించే 60 దేశాల సరసన భారత్ కూడా చేరింది. ప్రస్తుతం పేరు, జాతీయత, పాస్పోర్టు వివరాలనే ఇమిగ్రేషన్ అధికారులతో విమానయాన సంస్థలు పంచుకుంటున్నాయి. ఇకపై విమానయాన సంస్థలన్నీ కస్టమ్స్ విభాగం వద్ద రిజిస్ట్రేషన్ చేసుకుని, తాజా ఆదేశాలను అమలు చేయాల్సి ఉంటుంది.
* ప్రయాణికుల పేర్లు, టికెట్ చెల్లింపు సమాచారం, టికెట్ జారీ తేదీ, వారి కాంటాక్ట్ వివరాలైన.. ఇమెయిల్ ఐడీ, మొబైల్ నంబరు, పీఎన్ఆర్, ప్రయాణ వివరాలు, ఏజెన్సీ, బ్యాగేజీ, కోడ్ షేర్ సమాచారాన్నీ సంస్థలు అందించాల్సి ఉంటుంది. బ్యాంకు రుణ ఎగవేతదార్లు దేశం విడిచివెళ్లకుండా చూసేందుకే ఈ ఆదేశాలని విశ్లేషకులు అంటున్నారు. తాజా ఆదేశాలను పాటించకపోతే విమానయాన సంస్థలు కనీసం రూ.25,000; గరిష్ఠంగా రూ.50,000 వరకు అపరాధ రుసుము కట్టాల్సి వస్తుందని కేంద్రం తెలిపింది.
ఇప్పటిదాకా 38 మంది పరారీ: గత అయిదేళ్లలో నీరవ్ మోదీ, విజయ్ మాల్యా, మెహుల్ చోక్సీ వంటి 38 మంది ఆర్థిక నేరగాళ్లు దేశం విడిచి పరారయ్యారు. విజయ్మాల్యా రూ.9,000 కోట్లు, మెహుల్ చోక్సీ రూ.13,000 కోట్ల మేర బ్యాంకులకు బకాయిలు కట్టకుండా దేశం నుంచి వెళ్లిపోయారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మహిళా ఆవిష్కర్తలు పెరగాలి
మనదేశంలో మహిళా ఆవిష్కర్తల సంఖ్య తక్కువగా ఉండటం ఆందోళన కలిగిస్తోందని, ఈ అంశంపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ అన్నారు. -
వరుస లాభాలకు విరామం
సూచీల అయిదు రోజుల లాభాల ర్యాలీకి కళ్లెం పడింది. మిశ్రమ అంతర్జాతీయ సంకేతాల నేపథ్యంలో బ్యాంకింగ్, ఫైనాన్స్ షేర్లలో మదుపర్లు లాభాలు స్వీకరించారు. -
2047 నాటికి ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తెలంగాణ
తెలంగాణ 2047 నాటికి ఒక ట్రిలియన్ డాలర్ల (రూ.85 లక్షల కోట్ల) ఆర్థిక వ్యవస్థగా మారేందుకు భారత పరిశ్రమల సమాఖ్య(సీఐఐ) తన వంతు పాత్ర పోషిస్తుందని సీఐఐ తెలంగాణ ఛైర్మన్, భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సాయి డి ప్రసాద్ అన్నారు. -
హార్లిక్స్ ‘హెల్త్ డ్రింక్’ కాదు
హిందుస్థాన్ యునిలీవర్(హెచ్యూఎల్) తన బ్రాండ్ హార్లిక్స్ లేబుల్పై కీలక మార్పులు చేసింది. గతంలో ‘హెల్త్ ఫుడ్ డ్రింక్స్’ కేటగిరిలో ఉన్న హార్లిక్స్ను ‘ఫంక్షనల్ న్యూట్రిషనల్ డ్రింక్స్’ కేటగిరిలోకి మార్చింది. -
రిలయన్స్కు రేటింగ్ సంస్థల ‘జై’
2024 మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి బలమైన ఆర్థిక ఫలితాలను ప్రకటించడంతో రిలయన్స్ ఇండస్ట్రీస్కు అంతర్జాతీయ రేటింగ్ సంస్థలు ఎస్ అండ్ పీ, ఫిచ్ జై కొట్టాయి. -
భారత జీడీపీ వృద్ధి 6.6 శాతం
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2024-25)లో భారత జీడీపీ వృద్ధి 6.6 శాతంగా నమోదుకావొచ్చని డెలాయిట్ ఇండియా అంచనా వేసింది. -
మారుతీకి విక్రయాల జోష్
జనవరి-మార్చి త్రైమాసికంలో మారుతీ సుజుకీ ఇండియా నికర లాభం 47.8 శాతం పెరిగి రూ.3,877.70 కోట్లుగా నమోదైంది. -
హెచ్సీఎల్ టెక్ లాభం రూ.3,986 కోట్లు
దేశంలో మూడో అతిపెద్ద ఐటీ సంస్థ హెచ్సీఎల్ టెక్ జనవరి- మార్చి త్రైమాసికంలో రూ.3,986 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. ఏడాది క్రితం ఇదే త్రైమాసికంలో కంపెనీ లాభం రూ.3,983 కోట్లుగా ఉంది. -
పూర్తి స్థాయి బ్యాంకులుగా మారేందుకు ఎస్ఎఫ్బీల నుంచి దరఖాస్తుల ఆహ్వానం
పూర్తి స్థాయి బ్యాంకులుగా మారేందుకు నిర్దేశిత అర్హతలను కలిగి ఉన్న స్మాల్ ఫైనాన్స్ బ్యాంకుల (ఎస్ఎఫ్బీ) నుంచి దరఖాస్తులను ఆహ్వానించినట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తెలిపింది. -
సంక్షిప్త వార్తలు(6)
అపోలో హాస్పిటల్స్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ (ఏహెచ్ఈఎల్) అనుబంధ సంస్థ అపోలో హెల్త్కో లిమిటెడ్(అపోలో 24/7)కు రూ.2,475 కోట్ల ఈక్విటీ పెట్టుబడులు వచ్చాయి. -
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
Flipkart: ఫ్లిప్కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ తేదీలను ప్రకటించింది. మే 3 నుంచి 9 వరకు ఈ సేల్ అందుబాటులో ఉండనుంది.