డిపాజిట్‌పై 6 శాతం వరకు వడ్డీ

స్వాతంత్య్ర వజ్రోత్సవాల సందర్భంగా ‘బరోడా తిరంగా డిపాజిట్‌ పథకా’న్ని బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా (బీఓబీ) ప్రారంభించింది

Published : 18 Aug 2022 05:22 IST

బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా ప్రత్యేక పథకం

దిల్లీ: స్వాతంత్య్ర వజ్రోత్సవాల సందర్భంగా ‘బరోడా తిరంగా డిపాజిట్‌ పథకా’న్ని బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా (బీఓబీ) ప్రారంభించింది. ఈ పథకం కింద 444 రోజులకు 5.75 శాతం, 555 రోజులకు 6 శాతం వార్షిక వడ్డీ లభిస్తుందని తెలిపింది. ఈ ఏడాది డిసెంబరు 31 వరకు ఈ ప్రత్యేక పథకం కొనసాగుతుందని బ్యాంక్‌ పేర్కొంది. రూ.2 కోట్లలోపు రిటైల్‌ డిపాజిట్లకు ఈ పథకం వర్తిసుందని, సీనియర్‌ సిటిజన్లకు దీనిపై అదనపు వడ్డీ రేటు అందుతుందని వివరించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని