సుజాన్ వ్యవస్థాపకుడు తులసీ తంతి కన్నుమూత
పవన విద్యుత్ సంస్థ సుజ్లాన్ ఎనర్జీ వ్యవస్థాపకుడు తులసీ తంతి (64) శనివారం సాయంత్రం కన్నుమూశారు. భారత ‘విండ్ మ్యాన్’గా ప్రాచుర్యం పొందిన ఆయన గుండె పోటుతో మృతిచెందినట్లు కంపెనీ వెల్లడించింది.
దిల్లీ: పవన విద్యుత్ సంస్థ సుజ్లాన్ ఎనర్జీ వ్యవస్థాపకుడు తులసీ తంతి (64) శనివారం సాయంత్రం కన్నుమూశారు. భారత ‘విండ్ మ్యాన్’గా ప్రాచుర్యం పొందిన ఆయన గుండె పోటుతో మృతిచెందినట్లు కంపెనీ వెల్లడించింది. అహ్మదాబాద్లో విలేకరుల సమావేశం ముగిసిన తర్వాత ఆయన కారులో వెనక్కి వస్తున్నారు. పుణెలో ఆయన ఛాతీ నొప్పితో ఇబ్బందిపడగా, ఆసుపత్రికి తీసుకువెళ్లేలోపే మృతి చెందారు. ఆయనకు భార్య గీత, కుమారుడు ప్రణవ్, కుమార్తె నిధి ఉన్నారు. భారత్లో పవన విద్యుత్ వ్యాపార దిగ్గజాల్లో ఒకరైన తంతి, శుద్ధ ఇంధనంలో కూడా అంతర్జాతీయ గుర్తింపు పొందారు. తంతి మరణానికి ప్రధాన మంత్రి మోదీ, వాణిజ్య మంత్రి పీయూశ్ గోయల్ విచారం వ్యక్తం చేశారు.
* 1958లో రాజ్కోట్లో తులసీ తంతి జన్మించారు. గుజరాత్ విశ్వవిద్యాలయం నుంచి కామర్స్లో బ్యాచిలర్స్ డిగ్రీని పూర్తి చేశారు.
* 1995లో సుజ్లాన్ ఎనర్జీని స్థాపించారు. ప్రస్తుతం కంపెనీ విలువ రూ.8,535.9 కోట్లుగా ఉంది. బెల్జియంకు చెందిన టర్బైన్ విడిభాగాల సంస్థ జడ్ఎఫ్ పవర్ యాంట్వెర్పెన్కు 2006 నుంచి ఛైర్మన్గా తంతి ఉన్నారు. ఇండియన్ విండ్ టర్బైన్ మాన్యుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా వ్యవహరించారు.
* పవన విద్యుత్లోకి రాకముందు తంతికి జౌళి వ్యాపారం ఉండేది. 2001లో దాన్ని విక్రయించారు. 2003లో అమెరికా మిన్నెసోటాలో 24 టర్బైన్ల సరఫరా నిమిత్తం దనమార్ అండ్ అసోసియేట్స్ నుంచి సుజ్లాన్కు మొట్టమొదటి ఆర్డరు లభించింది.
* పవన విద్యుత్ మార్కెట్లో అంతర్జాతీయ సంస్థలు ఆధిపత్యం ప్రదర్శిస్తున్న సమయంలో.. 1995లోనే పునరుత్పాదక ఇంధన రంగంలో అవకాశాలను తంతి గుర్తించారు. ఆయన నాయకత్వంలో సుజ్లాన్ ఎనర్జీ దేశంలో అతిపెద్ద పవన విద్యుత్ సంస్థగా ఎదిగింది. కంపెనీకి మొత్తంగా 19.4 గిగావాట్ల సామర్థ్యం ఉంది. భారత్లో 33 శాతం మార్కెట్ వాటా ఉండగా, 17 దేశాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ప్రపంచంలో రెండో అతిపెద్ద పవన విద్యుత్ విపణి అయిన అమెరికాలో కంపెనీకి 2 గిగావాట్ల సామర్థ్యం ఉంది. అక్టోబరు 11 నుంచి కంపెనీ రూ.1200 కోట్ల రైట్స్ ఇష్యూ ప్రారంభం కానున్న సమయంలో తంతి మృతి చెందారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మహిళా ఆవిష్కర్తలు పెరగాలి
మనదేశంలో మహిళా ఆవిష్కర్తల సంఖ్య తక్కువగా ఉండటం ఆందోళన కలిగిస్తోందని, ఈ అంశంపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ అన్నారు. -
వరుస లాభాలకు విరామం
సూచీల అయిదు రోజుల లాభాల ర్యాలీకి కళ్లెం పడింది. మిశ్రమ అంతర్జాతీయ సంకేతాల నేపథ్యంలో బ్యాంకింగ్, ఫైనాన్స్ షేర్లలో మదుపర్లు లాభాలు స్వీకరించారు. -
2047 నాటికి ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తెలంగాణ
తెలంగాణ 2047 నాటికి ఒక ట్రిలియన్ డాలర్ల (రూ.85 లక్షల కోట్ల) ఆర్థిక వ్యవస్థగా మారేందుకు భారత పరిశ్రమల సమాఖ్య(సీఐఐ) తన వంతు పాత్ర పోషిస్తుందని సీఐఐ తెలంగాణ ఛైర్మన్, భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సాయి డి ప్రసాద్ అన్నారు. -
హార్లిక్స్ ‘హెల్త్ డ్రింక్’ కాదు
హిందుస్థాన్ యునిలీవర్(హెచ్యూఎల్) తన బ్రాండ్ హార్లిక్స్ లేబుల్పై కీలక మార్పులు చేసింది. గతంలో ‘హెల్త్ ఫుడ్ డ్రింక్స్’ కేటగిరిలో ఉన్న హార్లిక్స్ను ‘ఫంక్షనల్ న్యూట్రిషనల్ డ్రింక్స్’ కేటగిరిలోకి మార్చింది. -
రిలయన్స్కు రేటింగ్ సంస్థల ‘జై’
2024 మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి బలమైన ఆర్థిక ఫలితాలను ప్రకటించడంతో రిలయన్స్ ఇండస్ట్రీస్కు అంతర్జాతీయ రేటింగ్ సంస్థలు ఎస్ అండ్ పీ, ఫిచ్ జై కొట్టాయి. -
భారత జీడీపీ వృద్ధి 6.6 శాతం
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2024-25)లో భారత జీడీపీ వృద్ధి 6.6 శాతంగా నమోదుకావొచ్చని డెలాయిట్ ఇండియా అంచనా వేసింది. -
మారుతీకి విక్రయాల జోష్
జనవరి-మార్చి త్రైమాసికంలో మారుతీ సుజుకీ ఇండియా నికర లాభం 47.8 శాతం పెరిగి రూ.3,877.70 కోట్లుగా నమోదైంది. -
హెచ్సీఎల్ టెక్ లాభం రూ.3,986 కోట్లు
దేశంలో మూడో అతిపెద్ద ఐటీ సంస్థ హెచ్సీఎల్ టెక్ జనవరి- మార్చి త్రైమాసికంలో రూ.3,986 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. ఏడాది క్రితం ఇదే త్రైమాసికంలో కంపెనీ లాభం రూ.3,983 కోట్లుగా ఉంది. -
పూర్తి స్థాయి బ్యాంకులుగా మారేందుకు ఎస్ఎఫ్బీల నుంచి దరఖాస్తుల ఆహ్వానం
పూర్తి స్థాయి బ్యాంకులుగా మారేందుకు నిర్దేశిత అర్హతలను కలిగి ఉన్న స్మాల్ ఫైనాన్స్ బ్యాంకుల (ఎస్ఎఫ్బీ) నుంచి దరఖాస్తులను ఆహ్వానించినట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తెలిపింది. -
సంక్షిప్త వార్తలు(6)
అపోలో హాస్పిటల్స్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ (ఏహెచ్ఈఎల్) అనుబంధ సంస్థ అపోలో హెల్త్కో లిమిటెడ్(అపోలో 24/7)కు రూ.2,475 కోట్ల ఈక్విటీ పెట్టుబడులు వచ్చాయి. -
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
Flipkart: ఫ్లిప్కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ తేదీలను ప్రకటించింది. మే 3 నుంచి 9 వరకు ఈ సేల్ అందుబాటులో ఉండనుంది.