భారత కంపెనీల క్రెడిట్ రేటింగ్ నిష్పత్తి మరింత మెరుగు
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి అర్ధభాగంలో (ఏప్రిల్- సెప్టెంబరు) భారత కంపెనీల క్రెడిట్ రేటింగ్ నిష్పత్తి (డౌన్ గ్రేడింగ్, అప్గ్రేడింగ్ల మధ్య) మరింత మెరుగయ్యిందని క్రిసిల్ రేటింగ్స్ వెల్లడించింది.
ఏప్రిల్- సెప్టెంబరులో 5.2
క్రిసిల్ రేటింగ్స్
దిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి అర్ధభాగంలో (ఏప్రిల్- సెప్టెంబరు) భారత కంపెనీల క్రెడిట్ రేటింగ్ నిష్పత్తి (డౌన్ గ్రేడింగ్, అప్గ్రేడింగ్ల మధ్య) మరింత మెరుగయ్యిందని క్రిసిల్ రేటింగ్స్ వెల్లడించింది. 2021-22 రెండో అర్ధభాగంలో క్రెడిట్ నిష్పత్తి 5.04 పాయింట్లు ఉండగా.. 2022-23 మొదటి అర్ధభాగంలో 5.52 పాయింట్లకు పెరిగిందని తెలిపింది. ఏప్రిల్- సెప్టెంబరులో 569 కంపెనీల రేటింగ్ను పెంచగా.. 103 కంపెనీల రేటింగ్ను తగ్గించినట్లు పేర్కొంది. 80 శాతం కంపెనీలు రేటింగ్ను యథాతథంగా కొనసాగించినట్లు తెలిపింది. అయితే తాజాగా వెల్లడించిన గణాంకాలు.. దేశీయ కంపెనీల రేటింగ్ నాణ్యతను పూర్తి స్థాయిలో ప్రతిబింబించక పోవచ్చని క్రిసిల్ స్పష్టం చేసింది. కొన్ని చిన్న సంస్థలు వివరాలను ఇచ్చేందుకు సహకరించక పోవడమే ఇందుకు కారణంగా పేర్కొంది. కొవిడ్-19 అనంతరం భారత కంపెనీలు బలంగా పుంజుకున్నాయని క్రిసిల్ ఎండీ గురుప్రీత్ ఛాత్వాల్ తెలిపారు. కేంద్రీయ బ్యాంకుల కీలక రేట్ల పెంపు, అధిక ద్రవ్యోల్బణం లాంటి అంతర్జాతీయ పరిణామాలు సృష్టించిన కుదుపులను కార్పొరేట్ భారత్ తట్టుకోగల్గుతుందనే ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు.
మున్ముందు తగ్గొచ్చు..: అయితే కొన్ని కంపెనీలు ఎదుర్కొంటున్న సవాళ్ల రీత్యా మున్ముందు క్రెడిట్ నిష్పత్తి తగ్గే అవకాశం ఉందనీ ఆయన అన్నారు. ప్రధానంగా మౌలిక రంగం వల్లే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి అర్ధభాగంలో క్రెడిట్ నిష్పత్తి పెరిగిందని చెప్పారు. రేటింగ్ పెంచిన కంపెనీల్లో మూడొంతులు ఈ రంగానివేనని తెలిపారు. ప్రాజెక్టుల అనుమతులు వేగవంతం కావడం, అధిక కాంట్రాక్టులు రావడం లాంటివి మౌలిక రంగ కంపెనీల రేటింగ్ పెంపునకు దోహదం చేశాయని క్రిసిల్ పేర్కొంది. ఆర్బీఐ కీలక రేట్ల పెంపు పరిణామాల వల్ల కంపెనీల పెట్టుబడులు నెమ్మదించొచ్చని క్రిసిల్ నీరింగ్, నిర్మాణం, రోడ్డు లాంటి రంగాల్లో రేటింగ్ పెంపు ఎక్కువగా ఉందని పేర్కొంది. రేటింగ్ను పెంచిన కంపెనీల్లో దాదాపు సగం వరకు ఈ రంగాల్లోనే ఉన్నాయని తెలిపింది. రేటింగ్ను తగ్గించడానికి ఆయా కంపెనీలకు పలు కారణాలు దోహదపడ్డాయని పేర్కొంది. పాలనాపరమైన ఇబ్బందులు, ముడి సరకు వ్యయాలు పెరగడం, ప్రాజెక్టుల జాప్యం లాంటివి ఇందులో కొన్ని అని ఇక్రా వివరించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మహిళా ఆవిష్కర్తలు పెరగాలి
మనదేశంలో మహిళా ఆవిష్కర్తల సంఖ్య తక్కువగా ఉండటం ఆందోళన కలిగిస్తోందని, ఈ అంశంపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ అన్నారు. -
వరుస లాభాలకు విరామం
సూచీల అయిదు రోజుల లాభాల ర్యాలీకి కళ్లెం పడింది. మిశ్రమ అంతర్జాతీయ సంకేతాల నేపథ్యంలో బ్యాంకింగ్, ఫైనాన్స్ షేర్లలో మదుపర్లు లాభాలు స్వీకరించారు. -
2047 నాటికి ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తెలంగాణ
తెలంగాణ 2047 నాటికి ఒక ట్రిలియన్ డాలర్ల (రూ.85 లక్షల కోట్ల) ఆర్థిక వ్యవస్థగా మారేందుకు భారత పరిశ్రమల సమాఖ్య(సీఐఐ) తన వంతు పాత్ర పోషిస్తుందని సీఐఐ తెలంగాణ ఛైర్మన్, భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సాయి డి ప్రసాద్ అన్నారు. -
హార్లిక్స్ ‘హెల్త్ డ్రింక్’ కాదు
హిందుస్థాన్ యునిలీవర్(హెచ్యూఎల్) తన బ్రాండ్ హార్లిక్స్ లేబుల్పై కీలక మార్పులు చేసింది. గతంలో ‘హెల్త్ ఫుడ్ డ్రింక్స్’ కేటగిరిలో ఉన్న హార్లిక్స్ను ‘ఫంక్షనల్ న్యూట్రిషనల్ డ్రింక్స్’ కేటగిరిలోకి మార్చింది. -
రిలయన్స్కు రేటింగ్ సంస్థల ‘జై’
2024 మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి బలమైన ఆర్థిక ఫలితాలను ప్రకటించడంతో రిలయన్స్ ఇండస్ట్రీస్కు అంతర్జాతీయ రేటింగ్ సంస్థలు ఎస్ అండ్ పీ, ఫిచ్ జై కొట్టాయి. -
భారత జీడీపీ వృద్ధి 6.6 శాతం
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2024-25)లో భారత జీడీపీ వృద్ధి 6.6 శాతంగా నమోదుకావొచ్చని డెలాయిట్ ఇండియా అంచనా వేసింది. -
మారుతీకి విక్రయాల జోష్
జనవరి-మార్చి త్రైమాసికంలో మారుతీ సుజుకీ ఇండియా నికర లాభం 47.8 శాతం పెరిగి రూ.3,877.70 కోట్లుగా నమోదైంది. -
హెచ్సీఎల్ టెక్ లాభం రూ.3,986 కోట్లు
దేశంలో మూడో అతిపెద్ద ఐటీ సంస్థ హెచ్సీఎల్ టెక్ జనవరి- మార్చి త్రైమాసికంలో రూ.3,986 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. ఏడాది క్రితం ఇదే త్రైమాసికంలో కంపెనీ లాభం రూ.3,983 కోట్లుగా ఉంది. -
పూర్తి స్థాయి బ్యాంకులుగా మారేందుకు ఎస్ఎఫ్బీల నుంచి దరఖాస్తుల ఆహ్వానం
పూర్తి స్థాయి బ్యాంకులుగా మారేందుకు నిర్దేశిత అర్హతలను కలిగి ఉన్న స్మాల్ ఫైనాన్స్ బ్యాంకుల (ఎస్ఎఫ్బీ) నుంచి దరఖాస్తులను ఆహ్వానించినట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తెలిపింది. -
సంక్షిప్త వార్తలు(6)
అపోలో హాస్పిటల్స్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ (ఏహెచ్ఈఎల్) అనుబంధ సంస్థ అపోలో హెల్త్కో లిమిటెడ్(అపోలో 24/7)కు రూ.2,475 కోట్ల ఈక్విటీ పెట్టుబడులు వచ్చాయి. -
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
Flipkart: ఫ్లిప్కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ తేదీలను ప్రకటించింది. మే 3 నుంచి 9 వరకు ఈ సేల్ అందుబాటులో ఉండనుంది.