దేశ ప్రతిష్ఠపై ప్రభావం ఉండదు
అదానీ గ్రూప్ రూ.20,000 కోట్ల మలి విడత పబ్లిక్ ఆఫర్ (ఎఫ్పీఓ)ను ఉపసంహరించుకున్న నేపథ్యంలో దేశ ఆర్థిక ప్రతిష్ఠపై ఎలాంటి ప్రభావం ఉండదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శనివారం పునరుద్ఘాటించారు.
అదానీ ఎఫ్పీఓ ఉపసంహరణపై సీతారామన్
ముంబయి: అదానీ గ్రూప్ రూ.20,000 కోట్ల మలి విడత పబ్లిక్ ఆఫర్ (ఎఫ్పీఓ)ను ఉపసంహరించుకున్న నేపథ్యంలో దేశ ఆర్థిక ప్రతిష్ఠపై ఎలాంటి ప్రభావం ఉండదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శనివారం పునరుద్ఘాటించారు. దేశ స్థూల ఆర్థిక మూలాలు గానీ, ప్రతిష్ఠ గానీ ప్రభావితం కాలేదని.. ఎఫ్పీఓలు రావడం, ఎఫ్ఐఐలు (విదేశీ సంస్థాగత మదుపర్లు) వెళ్లిపోవడం సాధారణంగానే జరుగుతుంటాయన్నారు. గత రెండు రోజుల్లో దేశ విదేశీ మారక నిల్వలు 800 కోట్ల డాలర్ల మేర పెరిగాయని తెలిపారు. ప్రతి మార్కెట్లోనూ ఒడుదొడుకులు అనేవి వస్తుంటాయని, గత కొన్ని రోజులుగా మన మార్కెట్లో వస్తున్న వార్తలతో దేశం, దాని స్వాభావిక బలాలు రెండింటి గురించిన అవగాహన చెక్కుచెదరకుండా ఉందని వివరించారు.
ఆ పని నియంత్రణ సంస్థలు చూసుకుంటాయ్:అదానీ గ్రూప్ షేర్ల పతనంపై మంత్రి మరోమారు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యవహారంలో నియంత్రణ సంస్థలు వాటి పని అవి చేస్తాయని తెలిపారు. ‘రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ), ఎల్ఐసీ ఇప్పటికే దీనిపై స్పందించాయి. ప్రభుత్వంతో సంబంధం లేకుండా నియంత్రణ సంస్థలు స్వతంత్రంగా వ్యవహరిస్తాయి. మార్కెట్లను క్రమబద్ధీకరించేందుకు తగిన చర్యలు తీసుకుంటాయి. సెబీ ఆ పరిస్థితుల్ని దగ్గర్నుంచి పర్యవేక్షిస్తుంద’ని మంత్రి వెల్లడించారు.
స్టాక్ మార్కెట్ పటిష్ఠతను కాపాడేందుకు కట్టుబడి ఉన్నాం: సెబీ
స్టాక్ మార్కెట్ పటిష్ఠతను పరిరక్షించేందుకు కట్టుబడి ఉన్నామని.. షేర్లలో తీవ్ర హెచ్చుతగ్గులను నియంత్రించేందుకు ఇప్పటికే అన్ని రకాలుగా అవసరమైన నిఘా చర్యలను చేపట్టామని మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ శనివారం వెల్లడించింది. అదానీ గ్రూపు కంపెనీల షేర్ల పతనంపై సెబీ ఎందుకు స్పందించడం లేదంటూ అటు ప్రతిపక్షాల నుంచి, విశ్లేషకుల నుంచి విమర్శలు వస్తున్న వేళ.. పై విధమైన స్పష్టతను ఇవ్వడం గమనార్హం. అయితే అదానీ గ్రూపు అని ప్రత్యేకంగా పేరు ప్రస్తావించకుండా.. ఒక దిగ్గజ వ్యాపార గ్రూపు కంపెనీల షేర్లు గత వారంలో అసాధారణ రీతిలో చలించడాన్ని గుర్తించినట్లు సెబీ తెలిపింది. కానీ అధికారులు మాత్రం.. అదానీ వ్యవహారంపైనే సెబీ పై వ్యాఖ్యలు చేసిందని చెబుతున్నారు. ‘స్టాక్ మార్కెట్లు ఒక క్రమపద్ధతిలో, సమర్థంగా పనిచేసేలా చూడడం సెబీ బాధ్యత. నిర్దిష్ట షేర్లలో తీవ్ర హెచ్చు తగ్గుల నియంత్రణకు పలు చర్యలను ఇప్పటికే చేపట్టాం. ఒకవేళ ఏదేని షేర్లలో అనూహ్య ఒడుదొడుకులు చోటుచేసుకుంటే.. వాటంతట అవే ఈ చర్యలు అమల్లోకి వచ్చేస్తాయ’ని సెబీ వివరించింది. అయితే అదానీ షేర్ల వ్యవహారంలో ఏమైనా దర్యాప్తు చేస్తోందా? లేదా? అనే విషయంపై సెబీ స్పష్టత ఇవ్వకపోవడం గమనార్హం.
మరో వైపు, తమ మొత్తం నికర రుణాల్లో అదానీ గ్రూపునకు ఇచ్చిన రుణాల విలువ 0.94 శాతంగా ఉంటుందని యాక్సిస్ బ్యాంక్ తెలియజేసింది. అదానీ గ్రూపునకు ఇచ్చిన రుణాల విషయంలో ఇబ్బందేమీ లేదని పేర్కొంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మహిళా ఆవిష్కర్తలు పెరగాలి
మనదేశంలో మహిళా ఆవిష్కర్తల సంఖ్య తక్కువగా ఉండటం ఆందోళన కలిగిస్తోందని, ఈ అంశంపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ అన్నారు. -
వరుస లాభాలకు విరామం
సూచీల అయిదు రోజుల లాభాల ర్యాలీకి కళ్లెం పడింది. మిశ్రమ అంతర్జాతీయ సంకేతాల నేపథ్యంలో బ్యాంకింగ్, ఫైనాన్స్ షేర్లలో మదుపర్లు లాభాలు స్వీకరించారు. -
2047 నాటికి ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తెలంగాణ
తెలంగాణ 2047 నాటికి ఒక ట్రిలియన్ డాలర్ల (రూ.85 లక్షల కోట్ల) ఆర్థిక వ్యవస్థగా మారేందుకు భారత పరిశ్రమల సమాఖ్య(సీఐఐ) తన వంతు పాత్ర పోషిస్తుందని సీఐఐ తెలంగాణ ఛైర్మన్, భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సాయి డి ప్రసాద్ అన్నారు. -
హార్లిక్స్ ‘హెల్త్ డ్రింక్’ కాదు
హిందుస్థాన్ యునిలీవర్(హెచ్యూఎల్) తన బ్రాండ్ హార్లిక్స్ లేబుల్పై కీలక మార్పులు చేసింది. గతంలో ‘హెల్త్ ఫుడ్ డ్రింక్స్’ కేటగిరిలో ఉన్న హార్లిక్స్ను ‘ఫంక్షనల్ న్యూట్రిషనల్ డ్రింక్స్’ కేటగిరిలోకి మార్చింది. -
రిలయన్స్కు రేటింగ్ సంస్థల ‘జై’
2024 మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి బలమైన ఆర్థిక ఫలితాలను ప్రకటించడంతో రిలయన్స్ ఇండస్ట్రీస్కు అంతర్జాతీయ రేటింగ్ సంస్థలు ఎస్ అండ్ పీ, ఫిచ్ జై కొట్టాయి. -
భారత జీడీపీ వృద్ధి 6.6 శాతం
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2024-25)లో భారత జీడీపీ వృద్ధి 6.6 శాతంగా నమోదుకావొచ్చని డెలాయిట్ ఇండియా అంచనా వేసింది. -
మారుతీకి విక్రయాల జోష్
జనవరి-మార్చి త్రైమాసికంలో మారుతీ సుజుకీ ఇండియా నికర లాభం 47.8 శాతం పెరిగి రూ.3,877.70 కోట్లుగా నమోదైంది. -
హెచ్సీఎల్ టెక్ లాభం రూ.3,986 కోట్లు
దేశంలో మూడో అతిపెద్ద ఐటీ సంస్థ హెచ్సీఎల్ టెక్ జనవరి- మార్చి త్రైమాసికంలో రూ.3,986 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. ఏడాది క్రితం ఇదే త్రైమాసికంలో కంపెనీ లాభం రూ.3,983 కోట్లుగా ఉంది. -
పూర్తి స్థాయి బ్యాంకులుగా మారేందుకు ఎస్ఎఫ్బీల నుంచి దరఖాస్తుల ఆహ్వానం
పూర్తి స్థాయి బ్యాంకులుగా మారేందుకు నిర్దేశిత అర్హతలను కలిగి ఉన్న స్మాల్ ఫైనాన్స్ బ్యాంకుల (ఎస్ఎఫ్బీ) నుంచి దరఖాస్తులను ఆహ్వానించినట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తెలిపింది. -
సంక్షిప్త వార్తలు(6)
అపోలో హాస్పిటల్స్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ (ఏహెచ్ఈఎల్) అనుబంధ సంస్థ అపోలో హెల్త్కో లిమిటెడ్(అపోలో 24/7)కు రూ.2,475 కోట్ల ఈక్విటీ పెట్టుబడులు వచ్చాయి. -
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
Flipkart: ఫ్లిప్కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ తేదీలను ప్రకటించింది. మే 3 నుంచి 9 వరకు ఈ సేల్ అందుబాటులో ఉండనుంది.
తాజా వార్తలు (Latest News)
-
అక్కడికి రాలేం.. మీరే రండి..: గేటెడ్ కమ్యూనిటీల్లో పోలింగ్ కేంద్రాలు లేనట్టే
-
పేరుకే పోలీసులు.. పుత్రరత్నం సేవలో బానిసలు
-
నాడు తండ్రులు నేడు వారసులు.. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆసక్తికరంగా ఎన్నికల పోరు
-
వైకాపా ప్రభుత్వ విలేజీ క్లినిక్.. కాలేదు క్లిక్
-
రెండు కిలోమీటర్లకే రూ.9 వ్యత్యాసమా..!
-
ఇచ్చేది మెతుకంత.. చిందరవందరే బతుకంతా!!