29 నుంచి పసిడి బాండ్లు

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఎనిమిదో విడత సార్వభౌమ పసిడి బాండ్ల పథకానికి వచ్చే సోమవారం (29న) నుంచి దరఖాస్తు చేసుకోవచ్చు. డిసెంబరు 3 వరకు ఇందుకు అవకాశముంటుందని, ఇష్యూ ధర గ్రాముకు రూ.4,791

Published : 27 Nov 2021 03:50 IST

ఇష్యూ ధర గ్రాముకు రూ.4,791

దిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఎనిమిదో విడత సార్వభౌమ పసిడి బాండ్ల పథకానికి వచ్చే సోమవారం (29న) నుంచి దరఖాస్తు చేసుకోవచ్చు. డిసెంబరు 3 వరకు ఇందుకు అవకాశముంటుందని, ఇష్యూ ధర గ్రాముకు రూ.4,791 అని ఆర్‌బీఐ వెల్లడించింది. ఆన్‌లైన్‌లో, డిజిటల్‌ పద్ధతిలో చెల్లింపులు చేసే మదుపర్లకు ఇష్యూ ధరలో రూ.50 రాయితీ ఇస్తారు. అంటే వారికి రూ.4,741 అవుతుంది. ఏడో విడత పసిడి బాండ్ల పథకంలో ఇష్యూ ధర  రూ.4,761గా ఉంది. ఈ బాండ్లను ప్రభుత్వం తరపున ఆర్‌బీఐ జారీ చేస్తుంది. బ్యాంకులు (స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంకులు, పేమెంట్స్‌ బ్యాంకులు మినహా), స్టాక్‌ హోల్డింగ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌, ఎంపిక చేసిన తపాలా కార్యాలయాలు, గుర్తింపు ఉన్న స్టాక్‌ ఎక్స్ఛేంజీల్లో ఈ బాండ్లను విక్రయిస్తారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు