Inflation: ద్రవ్యోల్బణాన్ని అదుపు చేయడంలో విజయం సాధిస్తాం: నిర్మలా సీతారామన్
ద్రవ్యోల్బణాన్ని సమర్థంగా నిర్వహించడంలో భారత్ విజయం సాధిస్తుందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ధీమా వ్యక్తంచేశారు.
దిల్లీ: ద్రవ్యోల్బణాన్ని సమర్థంగా అదుపు చేయడంలో భారత్ విజయం సాధిస్తుందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ధీమా వ్యక్తంచేశారు. ఆహార పదార్థాల ధరల అదుపునకు సరఫరా అవరోధాలను అధిగమించేందుకు ఇప్పటికే చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ఆర్బీఐ నిర్దేశించుకున్న సౌకర్యవంత స్థాయికి ఎగువనే కొన్ని నెలలుగా ద్రవ్యోల్బణం కొనసాగుతున్న వేళ నిర్మలా సీతారామన్ ఓ సదస్సులో దీనిపై మాట్లాడారు. క్రూడాయిల్ వంటి దిగుమతుల వల్ల ఏర్పడే ద్రవ్యోల్బణం కొనసాగుతుందని నిర్మలా సీతారామన్ అన్నారు.
ద్రవ్యోల్బణాన్ని అదుపు చేయడంలో తాము తప్పకుండా విజయం సాధిస్తామని నిర్మలా సీతారామన్ అన్నారు. వచ్చే ఏడాది మొదట్లో గానీ, వచ్చే ఏడాది మధ్య నాటికి ద్రవ్యోల్బణం దిగి వస్తుందని చెప్పారు. ద్రవ్యోల్బణాన్ని అనేక కారణాలు ప్రభావితం చేస్తున్నాయని, దేశంలో మాత్రం పరిస్థితి బాగానే ఉందని చెప్పారు. వచ్చే ఏడాదికి వృద్ధి పథంలో భారత్ దూసుకెళుతుందన్నారు.
ఈ సందర్భంగా రష్యా నుంచి క్రూడాయిల్ దిగుమతిపై వచ్చిన ప్రశ్నలపై ఆర్థిక మంత్రి స్పందించారు. పశ్చిమ దేశాల మాదిరిగానే భారత్ కూడా రష్యా చమురును కొనుగోలు చేస్తోందన్నారు. చౌక ధరకు చమురు దొరుకుతుండడమే ఇందుకు కారణమన్నారు. రష్యా చమురు ధరపై పరిమితి విధించాలని డిమాండ్ చేసేవారే ఇంకా ఎక్కువ చమురును ఆ దేశం నుంచి దిగుమతి చేసుకుంటున్నారని నిర్మలా సీతారామన్ అన్నారు. అందుబాటు ధరల్లో వస్తువులు అందరికీ ఉండాలని తాను కోరుకుంటానని, సరకులపై ఆంక్షలు విధిస్తే కొంతమందిపై ప్రభావం పడుతుందన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మహిళా ఆవిష్కర్తలు పెరగాలి
మనదేశంలో మహిళా ఆవిష్కర్తల సంఖ్య తక్కువగా ఉండటం ఆందోళన కలిగిస్తోందని, ఈ అంశంపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ అన్నారు. -
వరుస లాభాలకు విరామం
సూచీల అయిదు రోజుల లాభాల ర్యాలీకి కళ్లెం పడింది. మిశ్రమ అంతర్జాతీయ సంకేతాల నేపథ్యంలో బ్యాంకింగ్, ఫైనాన్స్ షేర్లలో మదుపర్లు లాభాలు స్వీకరించారు. -
2047 నాటికి ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తెలంగాణ
తెలంగాణ 2047 నాటికి ఒక ట్రిలియన్ డాలర్ల (రూ.85 లక్షల కోట్ల) ఆర్థిక వ్యవస్థగా మారేందుకు భారత పరిశ్రమల సమాఖ్య(సీఐఐ) తన వంతు పాత్ర పోషిస్తుందని సీఐఐ తెలంగాణ ఛైర్మన్, భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సాయి డి ప్రసాద్ అన్నారు. -
హార్లిక్స్ ‘హెల్త్ డ్రింక్’ కాదు
హిందుస్థాన్ యునిలీవర్(హెచ్యూఎల్) తన బ్రాండ్ హార్లిక్స్ లేబుల్పై కీలక మార్పులు చేసింది. గతంలో ‘హెల్త్ ఫుడ్ డ్రింక్స్’ కేటగిరిలో ఉన్న హార్లిక్స్ను ‘ఫంక్షనల్ న్యూట్రిషనల్ డ్రింక్స్’ కేటగిరిలోకి మార్చింది. -
రిలయన్స్కు రేటింగ్ సంస్థల ‘జై’
2024 మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి బలమైన ఆర్థిక ఫలితాలను ప్రకటించడంతో రిలయన్స్ ఇండస్ట్రీస్కు అంతర్జాతీయ రేటింగ్ సంస్థలు ఎస్ అండ్ పీ, ఫిచ్ జై కొట్టాయి. -
భారత జీడీపీ వృద్ధి 6.6 శాతం
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2024-25)లో భారత జీడీపీ వృద్ధి 6.6 శాతంగా నమోదుకావొచ్చని డెలాయిట్ ఇండియా అంచనా వేసింది. -
మారుతీకి విక్రయాల జోష్
జనవరి-మార్చి త్రైమాసికంలో మారుతీ సుజుకీ ఇండియా నికర లాభం 47.8 శాతం పెరిగి రూ.3,877.70 కోట్లుగా నమోదైంది. -
హెచ్సీఎల్ టెక్ లాభం రూ.3,986 కోట్లు
దేశంలో మూడో అతిపెద్ద ఐటీ సంస్థ హెచ్సీఎల్ టెక్ జనవరి- మార్చి త్రైమాసికంలో రూ.3,986 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. ఏడాది క్రితం ఇదే త్రైమాసికంలో కంపెనీ లాభం రూ.3,983 కోట్లుగా ఉంది. -
పూర్తి స్థాయి బ్యాంకులుగా మారేందుకు ఎస్ఎఫ్బీల నుంచి దరఖాస్తుల ఆహ్వానం
పూర్తి స్థాయి బ్యాంకులుగా మారేందుకు నిర్దేశిత అర్హతలను కలిగి ఉన్న స్మాల్ ఫైనాన్స్ బ్యాంకుల (ఎస్ఎఫ్బీ) నుంచి దరఖాస్తులను ఆహ్వానించినట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తెలిపింది. -
సంక్షిప్త వార్తలు(6)
అపోలో హాస్పిటల్స్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ (ఏహెచ్ఈఎల్) అనుబంధ సంస్థ అపోలో హెల్త్కో లిమిటెడ్(అపోలో 24/7)కు రూ.2,475 కోట్ల ఈక్విటీ పెట్టుబడులు వచ్చాయి. -
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
Flipkart: ఫ్లిప్కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ తేదీలను ప్రకటించింది. మే 3 నుంచి 9 వరకు ఈ సేల్ అందుబాటులో ఉండనుంది.