Jio - HBO: త్వరలో జియో సినిమా యాప్లో హెచ్బీఓ కంటెంట్
రిలయన్స్ (Reliance)కు చెందిన స్ట్రీమింగ్ వేదిక జియో సినిమా (Jio Cinema) యాప్ త్వరలో పెద్ద ఎత్తున్న వీడియో కంటెంట్ను యూజర్లకు అందుబాటులోకి తీసుకురానుంది. ఇందుకోసం హాలీవుడ్ నిర్మాణ సంస్థ వార్నర్ బ్రదర్స్ (Warners Bros)తో ఒప్పందం చేసుకున్నట్లు సమాచారం.
ఇంటర్నెట్ డెస్క్: హాలీవుడ్ సూపర్హిట్ సిరీస్లు గేమ్ ఆఫ్ థ్రోన్స్, సక్సెషన్ అభిమానులకు శుభవార్త. త్వరలో వార్నర్ బ్రదర్స్ (Warner Bro), హెచ్బీఓ (HBO) సూపర్హిట్ సిరీస్లు తిరిగి భారత్లో వీక్షకులకు అందుబాటులోకి రానున్నాయి. ఈ నిర్మాణ సంస్థకు చెందిన వీడియో కంటెంట్ రిలయన్స్ (Reliance)కు చెందిన స్ట్రీమింగ్ వేదిక జియో సినిమా (Jio Cinema) యాప్లో ప్రసారం కానున్నాయి. ఈ మేరకు వార్నర్ బ్రదర్స్తో రిలయన్స్కు చెందిన వయాకామ్ 18 (Viacom 18) సంస్థ ఒప్పందం చేసుకున్నట్లు సంస్థ ఉన్నతోద్యోగి ఒకరు తెలిపారు. త్వరలోనే ఈ ఒప్పందంపై ఆయా సంస్థలు ప్రకటన చేయనున్నట్లు సమాచారం.
ఈ ఒప్పందం ద్వారా లక్షల గంటలకు పైగా అందుబాటులో ఉన్న టీవీ షోలు, సినిమాలు, ప్రధాన స్పోర్ట్స్ ఈవెంట్లు జియో సినిమా యాప్లో వీక్షకులకు అందుబాటులోకి రానున్నాయి. ఐపీఎల్ మ్యాచ్ల ఉచిత ప్రసారం, ఫిఫా ప్రపంచకప్ 2022 ప్రసారాలతో ఇప్పటికే జియో సినిమా యాప్ భారత్లో పాపులారిటీని సొంతం చేసుకుంది. ఇకపై వార్నర్ బ్రదర్స్, హెచ్బీవో కంటెంట్తో ఇతర స్ట్రీమింగ్ వేదికలకు గట్టి పోటీ ఇస్తుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ సంస్థ 2023 నుంచి 2027 వరకు ఐపీఎల్ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.
గతంలో వార్నర్ బ్రదర్స్, హెచ్బీవోకు చెందిన టీవీ షోలు, సినిమాలు డిస్నీ+ హాట్స్టార్ (Disney+ Hotstar) ఓటీటీ వేదికగా భారత్లో యూజర్లకు అందుబాటులో ఉండేది. ఈ ఏడాది మార్చి 31 నుంచి డిస్నీ+ హాట్స్టార్ వీటి ప్రసారాలను నిలిపివేసింది. తాజాగా ఈ కంటెంట్ను ప్రసారం చేసేందుకు వార్నర్ బ్రదర్స్తో రిలయన్స్ ఒప్పందం చేసుకుంది. ఈ డీల్ ఖరీదు ఎంతనేది తెలియాల్సివుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మహిళా ఆవిష్కర్తలు పెరగాలి
మనదేశంలో మహిళా ఆవిష్కర్తల సంఖ్య తక్కువగా ఉండటం ఆందోళన కలిగిస్తోందని, ఈ అంశంపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ అన్నారు. -
వరుస లాభాలకు విరామం
సూచీల అయిదు రోజుల లాభాల ర్యాలీకి కళ్లెం పడింది. మిశ్రమ అంతర్జాతీయ సంకేతాల నేపథ్యంలో బ్యాంకింగ్, ఫైనాన్స్ షేర్లలో మదుపర్లు లాభాలు స్వీకరించారు. -
2047 నాటికి ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తెలంగాణ
తెలంగాణ 2047 నాటికి ఒక ట్రిలియన్ డాలర్ల (రూ.85 లక్షల కోట్ల) ఆర్థిక వ్యవస్థగా మారేందుకు భారత పరిశ్రమల సమాఖ్య(సీఐఐ) తన వంతు పాత్ర పోషిస్తుందని సీఐఐ తెలంగాణ ఛైర్మన్, భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సాయి డి ప్రసాద్ అన్నారు. -
హార్లిక్స్ ‘హెల్త్ డ్రింక్’ కాదు
హిందుస్థాన్ యునిలీవర్(హెచ్యూఎల్) తన బ్రాండ్ హార్లిక్స్ లేబుల్పై కీలక మార్పులు చేసింది. గతంలో ‘హెల్త్ ఫుడ్ డ్రింక్స్’ కేటగిరిలో ఉన్న హార్లిక్స్ను ‘ఫంక్షనల్ న్యూట్రిషనల్ డ్రింక్స్’ కేటగిరిలోకి మార్చింది. -
రిలయన్స్కు రేటింగ్ సంస్థల ‘జై’
2024 మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి బలమైన ఆర్థిక ఫలితాలను ప్రకటించడంతో రిలయన్స్ ఇండస్ట్రీస్కు అంతర్జాతీయ రేటింగ్ సంస్థలు ఎస్ అండ్ పీ, ఫిచ్ జై కొట్టాయి. -
భారత జీడీపీ వృద్ధి 6.6 శాతం
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2024-25)లో భారత జీడీపీ వృద్ధి 6.6 శాతంగా నమోదుకావొచ్చని డెలాయిట్ ఇండియా అంచనా వేసింది. -
మారుతీకి విక్రయాల జోష్
జనవరి-మార్చి త్రైమాసికంలో మారుతీ సుజుకీ ఇండియా నికర లాభం 47.8 శాతం పెరిగి రూ.3,877.70 కోట్లుగా నమోదైంది. -
హెచ్సీఎల్ టెక్ లాభం రూ.3,986 కోట్లు
దేశంలో మూడో అతిపెద్ద ఐటీ సంస్థ హెచ్సీఎల్ టెక్ జనవరి- మార్చి త్రైమాసికంలో రూ.3,986 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. ఏడాది క్రితం ఇదే త్రైమాసికంలో కంపెనీ లాభం రూ.3,983 కోట్లుగా ఉంది. -
పూర్తి స్థాయి బ్యాంకులుగా మారేందుకు ఎస్ఎఫ్బీల నుంచి దరఖాస్తుల ఆహ్వానం
పూర్తి స్థాయి బ్యాంకులుగా మారేందుకు నిర్దేశిత అర్హతలను కలిగి ఉన్న స్మాల్ ఫైనాన్స్ బ్యాంకుల (ఎస్ఎఫ్బీ) నుంచి దరఖాస్తులను ఆహ్వానించినట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తెలిపింది. -
సంక్షిప్త వార్తలు(6)
అపోలో హాస్పిటల్స్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ (ఏహెచ్ఈఎల్) అనుబంధ సంస్థ అపోలో హెల్త్కో లిమిటెడ్(అపోలో 24/7)కు రూ.2,475 కోట్ల ఈక్విటీ పెట్టుబడులు వచ్చాయి. -
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
Flipkart: ఫ్లిప్కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ తేదీలను ప్రకటించింది. మే 3 నుంచి 9 వరకు ఈ సేల్ అందుబాటులో ఉండనుంది.