Twitter: అత్యుత్తమ సిబ్బందే మాతో ఉంటారు.. భవితపై ఆందోళన లేదు: మస్క్
ట్విటర్ భవిష్యత్పై తాను ఏమాత్రం ఆందోళనపడటం లేదని ఆ సంస్థ కొత్త యజమాని, టెస్లా అధిపతి ఎలాన్ మస్క్ స్పష్టం చేశారు.
న్యూయార్క్: ట్విటర్ భవిష్యత్పై తాను ఏమాత్రం ఆందోళనపడటం లేదని ఆ సంస్థ కొత్త యజమాని, టెస్లా అధిపతి ఎలాన్ మస్క్ స్పష్టం చేశారు. అత్యుత్తమ ఉద్యోగులే తమతో ఉంటారని పేర్కొన్నారు. మస్క్ ఇచ్చిన గడువు అనంతరం వందల సంఖ్యలో ఉద్యోగులు కంపెనీ నుంచి బయటకు వెళ్లిపోవాలని నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో మస్క్ ఈ వ్యాఖ్య చేయడం గమనార్హం. ట్విటర్లో కొనసాగుతారా లేదా బయటకు వెళ్లిపోతారా అని మీరే నిర్ణయించుకోవాలని ఉద్యోగులకు గురువారం సాయంత్రం గం.5.00 వరకు మస్క్ గడువు ఇచ్చినట్లు న్యూయార్క్ టైమ్స్ కథనం వెల్లడించింది. ‘మూడు నెలల పరిహార వేతనంతో బయటకు వెళ్లేందుకే వందల మంది ఉద్యోగులు నిర్ణయించుకున్నారని పేర్కొంది. అంతేకాకుండా.. మా కార్యాలయాల భవనాలను మూసివేస్తున్నామని, సోమవారం వరకు ఉద్యోగుల బ్యాడ్జ్ యాక్సెస్ కూడా ఉండదని ఇ-మెయిల్ ద్వారా ట్విటర్ ప్రకటించినట్లుగా ఆ కథనం తెలిపింది. ‘అత్యుత్తమమైన వాళ్లే ఉన్నారు. అందువల్ల నాకు ఆందోళన లేద’ని ఓ వినియోగదారుడు అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా మస్క్ ట్వీట్ చేశారు. కాగా.. ముఖ్యమైన ఉద్యోగులు కొందరు కంపెనీని వీడకుండా మస్క్, ఆయన సలహాదార్లు సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది. అత్యంత తక్కువ సమయంలో పెద్ద సంఖ్యలో ఉద్యోగులను తొలగించడం ద్వారా ట్విటర్ కార్యకలాపాలు సమర్థంగా సాగుతాయా అనే దానిపై సందేహాలు ఏర్పడుతాయని న్యూయార్ టైమ్స్ కథనం వివరించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మహిళా ఆవిష్కర్తలు పెరగాలి
మనదేశంలో మహిళా ఆవిష్కర్తల సంఖ్య తక్కువగా ఉండటం ఆందోళన కలిగిస్తోందని, ఈ అంశంపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ అన్నారు. -
వరుస లాభాలకు విరామం
సూచీల అయిదు రోజుల లాభాల ర్యాలీకి కళ్లెం పడింది. మిశ్రమ అంతర్జాతీయ సంకేతాల నేపథ్యంలో బ్యాంకింగ్, ఫైనాన్స్ షేర్లలో మదుపర్లు లాభాలు స్వీకరించారు. -
2047 నాటికి ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తెలంగాణ
తెలంగాణ 2047 నాటికి ఒక ట్రిలియన్ డాలర్ల (రూ.85 లక్షల కోట్ల) ఆర్థిక వ్యవస్థగా మారేందుకు భారత పరిశ్రమల సమాఖ్య(సీఐఐ) తన వంతు పాత్ర పోషిస్తుందని సీఐఐ తెలంగాణ ఛైర్మన్, భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సాయి డి ప్రసాద్ అన్నారు. -
హార్లిక్స్ ‘హెల్త్ డ్రింక్’ కాదు
హిందుస్థాన్ యునిలీవర్(హెచ్యూఎల్) తన బ్రాండ్ హార్లిక్స్ లేబుల్పై కీలక మార్పులు చేసింది. గతంలో ‘హెల్త్ ఫుడ్ డ్రింక్స్’ కేటగిరిలో ఉన్న హార్లిక్స్ను ‘ఫంక్షనల్ న్యూట్రిషనల్ డ్రింక్స్’ కేటగిరిలోకి మార్చింది. -
రిలయన్స్కు రేటింగ్ సంస్థల ‘జై’
2024 మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి బలమైన ఆర్థిక ఫలితాలను ప్రకటించడంతో రిలయన్స్ ఇండస్ట్రీస్కు అంతర్జాతీయ రేటింగ్ సంస్థలు ఎస్ అండ్ పీ, ఫిచ్ జై కొట్టాయి. -
భారత జీడీపీ వృద్ధి 6.6 శాతం
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2024-25)లో భారత జీడీపీ వృద్ధి 6.6 శాతంగా నమోదుకావొచ్చని డెలాయిట్ ఇండియా అంచనా వేసింది. -
మారుతీకి విక్రయాల జోష్
జనవరి-మార్చి త్రైమాసికంలో మారుతీ సుజుకీ ఇండియా నికర లాభం 47.8 శాతం పెరిగి రూ.3,877.70 కోట్లుగా నమోదైంది. -
హెచ్సీఎల్ టెక్ లాభం రూ.3,986 కోట్లు
దేశంలో మూడో అతిపెద్ద ఐటీ సంస్థ హెచ్సీఎల్ టెక్ జనవరి- మార్చి త్రైమాసికంలో రూ.3,986 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. ఏడాది క్రితం ఇదే త్రైమాసికంలో కంపెనీ లాభం రూ.3,983 కోట్లుగా ఉంది. -
పూర్తి స్థాయి బ్యాంకులుగా మారేందుకు ఎస్ఎఫ్బీల నుంచి దరఖాస్తుల ఆహ్వానం
పూర్తి స్థాయి బ్యాంకులుగా మారేందుకు నిర్దేశిత అర్హతలను కలిగి ఉన్న స్మాల్ ఫైనాన్స్ బ్యాంకుల (ఎస్ఎఫ్బీ) నుంచి దరఖాస్తులను ఆహ్వానించినట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తెలిపింది. -
సంక్షిప్త వార్తలు(6)
అపోలో హాస్పిటల్స్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ (ఏహెచ్ఈఎల్) అనుబంధ సంస్థ అపోలో హెల్త్కో లిమిటెడ్(అపోలో 24/7)కు రూ.2,475 కోట్ల ఈక్విటీ పెట్టుబడులు వచ్చాయి. -
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
Flipkart: ఫ్లిప్కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ తేదీలను ప్రకటించింది. మే 3 నుంచి 9 వరకు ఈ సేల్ అందుబాటులో ఉండనుంది.