Interest rate hike: రేట్ల పెంపు నిలుపుదల మా చేతుల్లో లేదు: ఆర్బీఐ గవర్నర్
చాలా మంది రేట్ల పెంపును (Interest rate hike) నిలిపివేయాలని తనకు సూచిస్తున్నారని ఆర్బీఐ గవర్నర్ దాస్ తెలిపారు. అయితే, అది పూర్తిగా క్షేత్రస్థాయి పరిస్థితులు, ఆర్థిక వ్యవస్థ గమనం, ద్రవ్యోల్బణం.. వంటి అంశాలపై ఆధారపడి ఉంటుందని వివరించారు.
దిల్లీ: వడ్డీరేట్ల పెంపు (Interest rate hike)ను నిలిపివేయడం అనేది తమ చేతుల్లో లేదని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ (Shaktikanta Das) అన్నారు. ఇది పూర్తిగా క్షేత్రస్థాయి పరిస్థితులపైనే ఆధారపడి ఉంటుందని స్పష్టం చేశారు. పరిశ్రమల సమాఖ్య సీఐఐ నిర్వహించిన ఓ సమావేశంలో మాట్లాడుతూ బుధవారం ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
చాలా మంది రేట్ల పెంపును (Interest rate hike) నిలిపివేయాలని తనకు సూచిస్తున్నారని దాస్ తెలిపారు. అయితే, అది పూర్తిగా క్షేత్రస్థాయి పరిస్థితులు, ఆర్థిక వ్యవస్థ గమనం, ద్రవ్యోల్బణం.. వంటి అంశాలపై ఆధారపడి ఉంటుందని వివరించారు. తనకు తానుగా తీసుకునే నిర్ణయం కాదని తెలిపారు. మరోవైపు రిటైల్ ద్రవ్యోల్బణం (Retail Inflation) కొంత తగ్గుముఖం పట్టిందని గుర్తుచేశారు. అయితే, ఇంతటితో సంతృప్తి చెందడం సబబు కాదని పేర్కొన్నారు. ఈ నెలలో ద్రవ్యోల్బణం 4.7 శాతం దిగువకు చేరుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఏప్రిల్లో రిటైల్ ధరల ఆధారిత ద్రవ్యోల్బణ సూచీ 4.7 శాతంగా నమోదైన విషయం తెలిసిందే.
బలమైన బ్యాంకింగ్ వ్యవస్థ..
భారత బ్యాంకింగ్ వ్యవస్థ స్థిరంగా, బలంగా ఉందని దాస్ ధీమా వ్యక్తం చేశారు. బలమైన మూలధన నిల్వలున్నాయన్నారు. ద్రవ్యలభ్యత కావాల్సిన స్థాయిలో ఉందన్నారు. ఆస్తుల నాణ్యత సైతం మెరుగవుతోందని తెలిపారు. దేశ ఆర్థిక వ్యవస్థను స్థిరంగా ఉంచేందుకు కావాల్సిన అన్ని చర్యలను ఆర్బీఐ తీసుకుంటుందని హామీ ఇచ్చారు.
అంతరాయం లేకుండా నోట్ల మార్పిడి..
రూ.2,000 నోట్ల మార్పిడి ప్రక్రియ ఎలాంటి అంతరాయం లేకుండా కొనసాగుతుందని శక్తికాంత దాస్ తెలిపారు. ఆర్బీఐ క్షేత్రస్థాయి పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుందని చెప్పారు. ఇప్పటి వరకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తలేదని తెలిపారు. నగదు నిర్వహణలో భాగంగా రూ.2,000 నోట్లను చలామణి నుంచి ఉపసంహరించుకుంటున్నట్లు ఆర్బీఐ ప్రకటించిన విషయం తెలిసిందే. వీటి మార్పిడి ప్రక్రియ మంగళవారం నుంచి ప్రారంభమైంది. సెప్టెంబరు 30 వరకు అది కొనసాగుతుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మహిళా ఆవిష్కర్తలు పెరగాలి
మనదేశంలో మహిళా ఆవిష్కర్తల సంఖ్య తక్కువగా ఉండటం ఆందోళన కలిగిస్తోందని, ఈ అంశంపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ అన్నారు. -
వరుస లాభాలకు విరామం
సూచీల అయిదు రోజుల లాభాల ర్యాలీకి కళ్లెం పడింది. మిశ్రమ అంతర్జాతీయ సంకేతాల నేపథ్యంలో బ్యాంకింగ్, ఫైనాన్స్ షేర్లలో మదుపర్లు లాభాలు స్వీకరించారు. -
2047 నాటికి ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తెలంగాణ
తెలంగాణ 2047 నాటికి ఒక ట్రిలియన్ డాలర్ల (రూ.85 లక్షల కోట్ల) ఆర్థిక వ్యవస్థగా మారేందుకు భారత పరిశ్రమల సమాఖ్య(సీఐఐ) తన వంతు పాత్ర పోషిస్తుందని సీఐఐ తెలంగాణ ఛైర్మన్, భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సాయి డి ప్రసాద్ అన్నారు. -
హార్లిక్స్ ‘హెల్త్ డ్రింక్’ కాదు
హిందుస్థాన్ యునిలీవర్(హెచ్యూఎల్) తన బ్రాండ్ హార్లిక్స్ లేబుల్పై కీలక మార్పులు చేసింది. గతంలో ‘హెల్త్ ఫుడ్ డ్రింక్స్’ కేటగిరిలో ఉన్న హార్లిక్స్ను ‘ఫంక్షనల్ న్యూట్రిషనల్ డ్రింక్స్’ కేటగిరిలోకి మార్చింది. -
రిలయన్స్కు రేటింగ్ సంస్థల ‘జై’
2024 మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి బలమైన ఆర్థిక ఫలితాలను ప్రకటించడంతో రిలయన్స్ ఇండస్ట్రీస్కు అంతర్జాతీయ రేటింగ్ సంస్థలు ఎస్ అండ్ పీ, ఫిచ్ జై కొట్టాయి. -
భారత జీడీపీ వృద్ధి 6.6 శాతం
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2024-25)లో భారత జీడీపీ వృద్ధి 6.6 శాతంగా నమోదుకావొచ్చని డెలాయిట్ ఇండియా అంచనా వేసింది. -
మారుతీకి విక్రయాల జోష్
జనవరి-మార్చి త్రైమాసికంలో మారుతీ సుజుకీ ఇండియా నికర లాభం 47.8 శాతం పెరిగి రూ.3,877.70 కోట్లుగా నమోదైంది. -
హెచ్సీఎల్ టెక్ లాభం రూ.3,986 కోట్లు
దేశంలో మూడో అతిపెద్ద ఐటీ సంస్థ హెచ్సీఎల్ టెక్ జనవరి- మార్చి త్రైమాసికంలో రూ.3,986 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. ఏడాది క్రితం ఇదే త్రైమాసికంలో కంపెనీ లాభం రూ.3,983 కోట్లుగా ఉంది. -
పూర్తి స్థాయి బ్యాంకులుగా మారేందుకు ఎస్ఎఫ్బీల నుంచి దరఖాస్తుల ఆహ్వానం
పూర్తి స్థాయి బ్యాంకులుగా మారేందుకు నిర్దేశిత అర్హతలను కలిగి ఉన్న స్మాల్ ఫైనాన్స్ బ్యాంకుల (ఎస్ఎఫ్బీ) నుంచి దరఖాస్తులను ఆహ్వానించినట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తెలిపింది. -
సంక్షిప్త వార్తలు(6)
అపోలో హాస్పిటల్స్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ (ఏహెచ్ఈఎల్) అనుబంధ సంస్థ అపోలో హెల్త్కో లిమిటెడ్(అపోలో 24/7)కు రూ.2,475 కోట్ల ఈక్విటీ పెట్టుబడులు వచ్చాయి. -
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
Flipkart: ఫ్లిప్కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ తేదీలను ప్రకటించింది. మే 3 నుంచి 9 వరకు ఈ సేల్ అందుబాటులో ఉండనుంది.