Samsung: ఈ పాత ఫోన్లు ఉన్నవారికి శాంసంగ్ స్పెషల్ ఆఫర్
Samsung Loyalty Programme: ప్రముఖ ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల సంస్థ శాంసంగ్ ‘Upgrade to Awesome’ పేరుతో ఒక లాయల్టీ ప్రోగ్రామ్ తీసుకొచ్చింది. ఇందులో భాగంగా తన ఏ సిరీస్ ఫోన్లపై పెద్దఎత్తున డిస్కౌంట్లు ఇస్తోంది.
ఇంటర్నెట్డెస్క్: మీరు శాంసంగ్ పాత ఫోన్ వాడుతున్నారా? 5జీ స్మార్ట్ఫోన్కు అప్గ్రేడ్ కావాలనుకుంటున్నారా..? అయితే మీకో గుడ్ న్యూస్. భారత్లోని శాంసంగ్ కస్టమర్ల కోసం ‘అప్గ్రేడ్ టు ఆసమ్’ (Upgrade to Awesome) పేరుతో ఓ లాయల్టీ అప్గ్రేడ్ ప్రోగ్రామ్ తీసుకొచ్చింది. ఇందులో భాగంగా A సిరీస్ 5జీ ఫోన్లపై డిస్కౌంట్ అందిస్తోంది. దాంతో పాటూ ఎటువంటి ఖర్చు లేకుండా శాంసంగ్ కేర్ ప్రొటెక్షన్ ప్లస్ స్క్రీన్ పొటెక్షన్ ప్యాక్ ఇస్తోంది. పాత శాంసంగ్ యూజర్లు సులువుగా 5జీ స్మార్ట్ఫోన్లకు అప్గ్రేడ్ అవ్వటం కోసమే ఈ ప్రోగ్రామ్ను తీసుకొచ్చినట్లు శాంసంగ్ తెలిపింది. వడ్డీ లేని ఈఎంఐ సదుపాయం కూడా ఉంది.
ఏ ఫోన్లపై?
అప్గ్రేడ్ ప్రోగ్రామ్లో భాగంగా 2020 కంటే ముందున్న ఏ సిరీస్, జే సిరీస్ ఫోన్లను కొత్త ఫోన్లతో ఎక్స్ఛేంజ్ చేసుకోవచ్చు. ఈ ప్రోగ్రామ్లో భాగంగా గెలాక్సీ ఏ14 4జీబీ+64 జీబీ వేరియంట్ ధర రూ.18,449కాగా.. రూ.14,499కే ఇవ్వనున్నట్లు కంపెనీ పేర్కొంది. రూ.973 నుంచి ఈఎంఐ ఆప్షన్ అందుబాటులో ఉంది. శాంసంగ్ గెలాక్సీ ఏ23 5జీ 6జీబీ+128 జీబీ వేరియంట్ ఫోన్ ధర రూ.28,990 ఉండగా.. రూ.18,999కే కొనుగోలు చేయొచ్చని కంపెనీ పేర్కొంది. ఈఎంఐ ఆప్షన్స్ రూ.1,407 నుంచి ప్రారంభం అవుతాయి.
5జీ ప్లాన్ ధరలు పెరగనున్నాయా? జియో క్లారిటీ
శాంసంగ్ ఏ సిరీస్లో ఏ34 8జీబీ+128జీబీ వేరియంట్ ధర రూ.35,499 కాగా.. ప్రస్తుతం రూ.25,999కే విక్రయించనున్నట్లు శాంసంగ్ తెలిపింది. అలాగే శాంసంగ్ ఏ54 5జీ 8జీబీ+128 జీబీ వేరియంట్ ధర రూ.41,999 కాగా.. అప్గ్రేడ్ ప్రోగ్రామ్లో భాగంగా శాంసంగ్ కస్టమర్లకు రూ.33,999కే విక్రయించనున్నట్లు కంపెనీ తెలిపింది. రూ.1,883 నుంచి ఈఎంఐ ఆప్షన్లు అందుబాటులో ఉంటాయి. పైన పేర్కొన్న ఏ సిరీస్ ఫోన్లన్నీ ఆండ్రాయిడ్ 13తో పనిచేస్తాయి. 5000 mAh బ్యాటరీని కలిగి ఉన్నాయి.
ఎలా..?
2020 కంటే ముందున్న పాత శాంసంగ్ మొబైల్స్ని ఈ అప్గ్రేడ్ ప్రోగ్రామ్ ద్వారా మార్చుకోవచ్చు. మై గెలాక్సీ యాప్లో అర్హులైన వారికి ఈ బ్యానర్ కనిపిస్తుంది. ఇందుకోసం శాంసంగ్ కస్టమర్లు తమ పాత గెలాక్సీ ఫోన్లోని ‘మై గెలాక్సీ’ యాప్లో కోడ్ జనరేట్ చేసుకోవాలి. ఫోన్ కొన్నాక కొత్త మొబైల్లో ఆ కోడ్ వివరాలు ఎంటర్ చేసి వ్యాలిడేట్ చేయాల్సి ఉంటుంది. వ్యాలిడేట్ అనంతరం 48 గంటల్లో కస్టమర్ కేర్+ ప్యాక్ యాక్టివేట్ అవుతుంది. ఈ స్క్రీన్ ప్రొటెక్షన్ ప్యాక్ ఆరు నెలల పాటు ఉచితంగా శాంసంగ్ అందిస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
50 గంటల బ్యాటరీ లైఫ్తో నాయిస్ పాప్ బడ్స్.. ధర, ఫీచర్లివే..!
Noise Pop Buds: నాయిస్ మరో ట్రూవైర్లెస్ ఇయర్ఫోన్స్ను భారత్లో విడుదల చేసింది. క్వాడ్ మైక్ సిస్టమ్, ఫాస్ట్ ఛార్జింగ్తో పాటు అనేక ఫీచర్లు ఉన్నాయి. -
అమెజాన్, ఫ్లిప్కార్ట్ సేల్స్ షురూ.. స్మార్ట్ఫోన్లపై ఆఫర్లు ఇవిగో..
Amazon- Flipkart: అమెజాన్, ఫ్లిప్కాట్ ఏటా వేసవిలో నిర్వహించే సేల్స్ మొదలయ్యాయి. ఈ సేల్లో స్మార్ట్ఫోన్లపై అందిస్తున్న ఆఫర్లపై ఓ లుక్కేయండి. -
50MP సెల్ఫీ కెమెరాతో వివో కొత్త ఫోన్.. 4 ఏళ్ల సెక్యూరిటీ అప్డేట్స్
Vivo V30e: మొబైల్ తయారీ కంపెనీ 3 ఏళ్లు ఆండ్రాయిడ్ అప్డేట్స్, 4 సంవత్సరాలు సెక్యూరిటీ అప్డేట్స్తో కొత్త మొబైల్ను భారత్ మార్కెట్లో లాంచ్ చేసింది. -
వాట్సప్లో కొత్త ఫీచర్.. ఇకపై ఈవెంట్ ప్లాన్ చేయొచ్చు!
WhatsApp: ఇకపై వాట్సప్లో ఈవెంట్ ప్లాన్ చేయొచ్చు. ఎవరెవరు వస్తారో కూడా తెలుసుకోవచ్చు. వారికి నోటిఫికేషన్ ద్వారా గుర్తు చేయొచ్చు. అందుకు అనుగుణంగా కమ్యూనిటీలో ఈవెంట్స్ అనే కొత్త ఫీచర్ను తీసుకొచ్చింది వాట్సప్. -
లింక్డిన్లోనూ గేమ్స్.. మెదడుకు పదును పెట్టే పజిల్స్
LinkedIn: మెదడుకు పదును పెట్టే ఆటలతో యూజర్లను ఆకర్షించేందుకు లింక్డిన్ సిద్ధమైంది. అందులో భాగంగా మూడు పజిల్ గేమ్స్ను ప్రవేశపెట్టింది. -
వాట్సప్లో కొత్త ఖాతాల నుంచి సందేశాలు రావిక..?
WhatsApp: ప్రముఖ మేసేజింగ్ ప్లాట్ఫామ్ వాట్సప్ భద్రతాపరంగా కొత్త ఫీచర్ను తీసుకొచ్చేందుకు సిద్ధమవుతోంది. తెలియని వ్యక్తుల ఖాతాల నుంచి మెసేజ్లు రాకుండా తాత్కాలికంగా అడ్డుకోనుంది. -
గూగుల్తో ఇంగ్లిష్ ప్రాక్టీస్.. కొత్త ఏఐ ఫీచర్ను ఎలా వాడాలి?
ఆంగ్లంలో అనర్గళంగా మాట్లాడాలనుకునే వారి కోసం గూగుల్ కొత్త ఫీచర్ తీసుకొచ్చింది. దీంతో ఇంగ్లిష్లో స్పీకింగ్ ప్రాక్టీస్ చేయొచ్చు. -
ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ ప్లేలో ఇకపై సన్ నెక్స్ట్..
ఎయిర్టెల్తో సన్ నెక్స్ట్ జట్టు కట్టింది. తద్వారా ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ ప్లేలో సన్ నెక్స్ట్ కంటెంట్ను వీక్షించేందుకు వీలు కలగనుంది. -
బీఎస్ఎన్ఎల్లో బ్రాడ్బ్యాండ్ ఇన్స్టలేషన్ ఛార్జీలు ఉండవ్
BSNL: వచ్చే ఆర్థిక సంవత్సరం ప్రారంభం వరకు తమ బ్రాడ్బ్యాండ్ కనెక్షన్ తీసుకునేవారి నుంచి ఎలాంటి ఇన్స్టలేషన్ ఛార్జీలు వసూలు చేయబోమని బీఎస్ఎన్ఎల్ ప్రకటించింది. -
సోనీ రియాన్ పాకెట్ ఏసీ.. ఎక్కడికైనా వెంట తీసుకెళ్లొచ్చు!
Wearable AC: మెడపై ధరించి ఎక్కడికైనా వెంట తీసుకెళ్లగలిగేలా సోనీ ఓ కొత్త ఏసీ డివైజ్ను తీసుకొచ్చింది. -
భారత్లో నథింగ్ ఫోన్ 2ఏ స్పెషల్ ఎడిషన్.. ధర, ఫీచర్లివే..!
Nothing phone 2a: నథింగ్ ఫోన్ 2ఏ ప్రత్యేక ఎడిషన్ భారత్లో విడుదలైంది. నేవీ బ్లూ రంగులో దీన్ని తీసుకొచ్చారు. -
రూ.49కే బీఎస్ఎన్ఎల్ సినిమాప్లస్ సబ్స్క్రిప్షన్
BSNL Cinemaplus: బీఎస్ఎన్ఎల్ సినిమాప్లస్ పేరిట ఓటీటీ ప్యాకేజీలను అందిస్తోంది. దీంట్లో మొత్తం మూడు ప్యాక్లు ఉన్నాయి. తాజాగా స్టార్టర్ ప్యాక్ ధరను సంస్థ కుదించింది. -
వేసవిలో ఫోన్ ఛార్జింగ్ వేగం తగ్గుతుంది..? ఎందుకు?
వేసవిలో స్మార్ట్ఫోన్ ఛార్జింగ్లో వేగం మందగిస్తుంది. దీనికి కారణమేంటి? ఎందుకు వేగం తగ్గుతుంది? -
ఎయిర్ గెశ్చర్స్తో రియల్మీ నుంచి బడ్జెట్ కొత్త ఫోన్
Realme C65: మొబైల్ తయారీ సంస్థ రియల్మీ బడ్జెట్ ధరలో ఎయిర్గెశ్చర్స్ సదుపాయంతో కొత్త ఫోన్ను భారత మార్కెట్లో లాంచ్ చేసింది. -
రూ.29కే జియోసినిమా ప్రీమియం.. యాడ్ ఫ్రీ కంటెంట్, 4K వీడియో క్వాలిటీ
Jio Cinema: జియో సినిమా కొత్తగా రెండు సబ్స్క్రిప్షన్ ప్లాన్లను తీసుకొచ్చింది. వాటిలో ఒకటి ఫ్యామిలీని దృష్టిలో ఉంచుకొని రూపొందించింది. -
5,000mAh బ్యాటరీ.. 50MP కెమెరాతో నార్జో సిరీస్లో కొత్త ఫోన్లు
Realme Narzo: రియల్మీ మరో రెండు కొత్త ఫోన్లను విడుదల చేసింది. వీటి ధర రూ.11,999 నుంచి ప్రారంభమైంది. ఫీచర్లు, వేరియంట్లు, వాటి ధరలు, ఆఫర్లు ఎలా ఉన్నాయో చూద్దాం..! -
ఎయిర్టెల్ కొత్త రోమింగ్ ప్యాక్స్.. 184 దేశాలకు ఒకే ప్యాక్
ఎయిర్టెల్ కొత్త అంతర్జాతీయ రోమింగ్ ప్లాన్లు తీసుకొచ్చింది. రోజుకు రూ.133 నుంచి ఈ ప్లాన్లు ప్రారంభమవుతాయని ఎయిర్టెల్ తెలిపింది. -
సోషల్మీడియాలో ‘లుక్ బిట్వీన్ కీబోర్డ్’ ట్రెండ్.. ఇంతకీ ఏమిటిది..?
సోషల్మీడియాలో లుక్ బిట్వీన్ పేరిట కొత్త ట్రెండ్ మొదలైంది. ఇంతకీ ఏమిటీ ట్రెండ్..? ఎక్కడ మొదలైంది? -
గుంపులో స్మార్ట్ఫోన్లు కొట్టేస్తే.. చిన్న ట్రిక్తో పట్టేశాడు..!
తన స్మార్ట్ఫోన్లను ఎవరో కొట్టేస్తే చిన్న ట్రిక్తో పట్టేశాడు ఓ టెక్ ఇన్ఫ్లూయెన్సర్. జరిగిందంతా ఓ పోస్ట్లో రాసుకొచ్చాడు. -
వాట్సప్లో కొత్త ఫీచర్.. ఇంటర్నెట్ లేకున్నా ఫొటోలు పంపించొచ్చు!
WhatsApp: ఫొటోలు, వీడియోలు పంపించడాన్ని సులభతరం చేయడం కోసం ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సప్ (WhatsApp) కొత్త ఫీచర్ని తీసుకొచ్చేందుకు సిద్ధమవుతోంది. -
రెడ్మీ కొత్త వైఫై ట్యాబ్.. రూ.20 వేలకే రోబో వాక్యూమ్ క్లీనర్
Xiaomi: షావోమి మంగళవారం మరికొన్ని స్మార్ట్ ఉత్పత్తులను భారత్లో విడుదల చేసింది. వీటిలో ప్యాడ్, బడ్స్, క్లీనర్, స్టీమర్ ఉన్నాయి. వీటి ధర, ఫీచర్లు ఎలా ఉన్నాయో చూద్దాం..!
తాజా వార్తలు (Latest News)
-
China: చంద్ర శిలల సేకరణకు బయల్దేరిన చైనా..!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
ఘోర బస్సు ప్రమాదం.. పాక్లో 20 మంది దుర్మరణం
-
ప్రభాకర్రావు కోసం పోలీసుల వేట .. అరెస్టు వారెంట్ ఇవ్వాలని కోర్టులో పిటిషన్
-
50 కోట్ల ప్రయాణికుల మైలు రాయిని దాటిన హైదరాబాద్ మెట్రో
-
వివాహిత ఇంటికి బాంబు పార్సిల్ పంపిన ప్రియుడు.. భర్త, కుమార్తె మృతి