Stock market: భారీ నష్టాల్లో మార్కెట్లు.. పతనానికి కారణాలు ఇవే!
Stock market: దేశీయస్టాక్ మార్కెట్ సూచీలు భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ 700 పాయింట్లు నష్టపోగా.. నిఫ్టీ 22వేల స్థాయిని కోల్పోయింది.
Stock market | ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో ట్రేడవుతున్నాయి. వడ్డీ రేట్లపై అమెరికా ఫెడ్ నిర్ణయం వెలువడనుండటం, అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావం మన సూచీలపై పడింది. సూచీల్లో అధిక వెయిటేజీ కలిగిన టీసీఎస్, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఇన్ఫోసిస్లో అమ్మకాల వల్ల సూచీలు భారీగా పతనమయ్యాయి. ఓ దశలో సెన్సెక్స్ 700 పాయింట్ల మేర నష్టపోగా.. నిఫ్టీ 21,900 స్థాయికి చేరింది. మధ్యాహ్నం 12.40 గంటలకు సెన్సెక్స్ 628 పాయింట్ల నష్టంతో 72,119 వద్ద, నిఫ్టీ 195 పాయింట్ల నష్టంతో 21,860 వద్ద ట్రేడవుతున్నాయి. సెన్సెక్స్లో బజాజ్ ఫైనాన్స్, కోటక్ మహీంద్రా బ్యాంక్, భారతీ ఎయిర్టెల్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, టైటాన్ మినహా అన్ని షేర్లూ నష్టాల్లో ట్రేడువుతున్నాయి.
ఎందుకీ పతనం..?
- వడ్డీ రేట్లపై అమెరికా ఫెడరల్ రిజర్వ్ ఈ వారమే నిర్ణయం తీసుకోనుంది. ఈ క్రమంలో మదుపరులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. హాంకాంగ్, దక్షిణ కొరియా షేర్లు నష్టపోవడంతో ఆసియా సూచీలు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. దీని ప్రభావం మన మార్కెట్లపై పడింది.
- బ్లాక్ డీల్ ద్వారా 2.02 కోట్ల టీసీఎస్ షేర్లను టాటా సన్స్ మంగళవారం విక్రయించనున్న నేపథ్యంలో టీసీఎస్ షేర్లు పతనమయ్యాయి. ఆ కంపెనీ షేరు 3 శాతం మేర క్షీణించింది. ఇతర ఐటీ కంపెనీలైన హెచ్సీఎల్ టెక్నాలజీస్, విప్రో, ఇన్ఫోసిస్ షేర్లు కూడా నష్టాల్లో ట్రేడవుతుండడం సూచీలపై ప్రభావం చూపింది.
- విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు అమ్మకాలకు దిగడమూ మరో కారణం. సోమవారం రూ.2,061 కోట్ల విలువైన దేశీయ షేర్లను వారు విక్రయించినట్లు మార్కెట్ డేటా చెబుతోంది.
- అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధరలు పెరగడమూ మదుపరుల సెంటిమెంట్ను దెబ్బతీసింది. బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ 86 డాలర్ల ఎగువన ట్రేడవుతోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మహిళా ఆవిష్కర్తలు పెరగాలి
మనదేశంలో మహిళా ఆవిష్కర్తల సంఖ్య తక్కువగా ఉండటం ఆందోళన కలిగిస్తోందని, ఈ అంశంపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ అన్నారు. -
వరుస లాభాలకు విరామం
సూచీల అయిదు రోజుల లాభాల ర్యాలీకి కళ్లెం పడింది. మిశ్రమ అంతర్జాతీయ సంకేతాల నేపథ్యంలో బ్యాంకింగ్, ఫైనాన్స్ షేర్లలో మదుపర్లు లాభాలు స్వీకరించారు. -
2047 నాటికి ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తెలంగాణ
తెలంగాణ 2047 నాటికి ఒక ట్రిలియన్ డాలర్ల (రూ.85 లక్షల కోట్ల) ఆర్థిక వ్యవస్థగా మారేందుకు భారత పరిశ్రమల సమాఖ్య(సీఐఐ) తన వంతు పాత్ర పోషిస్తుందని సీఐఐ తెలంగాణ ఛైర్మన్, భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సాయి డి ప్రసాద్ అన్నారు. -
హార్లిక్స్ ‘హెల్త్ డ్రింక్’ కాదు
హిందుస్థాన్ యునిలీవర్(హెచ్యూఎల్) తన బ్రాండ్ హార్లిక్స్ లేబుల్పై కీలక మార్పులు చేసింది. గతంలో ‘హెల్త్ ఫుడ్ డ్రింక్స్’ కేటగిరిలో ఉన్న హార్లిక్స్ను ‘ఫంక్షనల్ న్యూట్రిషనల్ డ్రింక్స్’ కేటగిరిలోకి మార్చింది. -
రిలయన్స్కు రేటింగ్ సంస్థల ‘జై’
2024 మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి బలమైన ఆర్థిక ఫలితాలను ప్రకటించడంతో రిలయన్స్ ఇండస్ట్రీస్కు అంతర్జాతీయ రేటింగ్ సంస్థలు ఎస్ అండ్ పీ, ఫిచ్ జై కొట్టాయి. -
భారత జీడీపీ వృద్ధి 6.6 శాతం
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2024-25)లో భారత జీడీపీ వృద్ధి 6.6 శాతంగా నమోదుకావొచ్చని డెలాయిట్ ఇండియా అంచనా వేసింది. -
మారుతీకి విక్రయాల జోష్
జనవరి-మార్చి త్రైమాసికంలో మారుతీ సుజుకీ ఇండియా నికర లాభం 47.8 శాతం పెరిగి రూ.3,877.70 కోట్లుగా నమోదైంది. -
హెచ్సీఎల్ టెక్ లాభం రూ.3,986 కోట్లు
దేశంలో మూడో అతిపెద్ద ఐటీ సంస్థ హెచ్సీఎల్ టెక్ జనవరి- మార్చి త్రైమాసికంలో రూ.3,986 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. ఏడాది క్రితం ఇదే త్రైమాసికంలో కంపెనీ లాభం రూ.3,983 కోట్లుగా ఉంది. -
పూర్తి స్థాయి బ్యాంకులుగా మారేందుకు ఎస్ఎఫ్బీల నుంచి దరఖాస్తుల ఆహ్వానం
పూర్తి స్థాయి బ్యాంకులుగా మారేందుకు నిర్దేశిత అర్హతలను కలిగి ఉన్న స్మాల్ ఫైనాన్స్ బ్యాంకుల (ఎస్ఎఫ్బీ) నుంచి దరఖాస్తులను ఆహ్వానించినట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తెలిపింది. -
సంక్షిప్త వార్తలు(6)
అపోలో హాస్పిటల్స్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ (ఏహెచ్ఈఎల్) అనుబంధ సంస్థ అపోలో హెల్త్కో లిమిటెడ్(అపోలో 24/7)కు రూ.2,475 కోట్ల ఈక్విటీ పెట్టుబడులు వచ్చాయి. -
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
Flipkart: ఫ్లిప్కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ తేదీలను ప్రకటించింది. మే 3 నుంచి 9 వరకు ఈ సేల్ అందుబాటులో ఉండనుంది.