Stock Market: రెండోరోజూ కొనసాగిన లాభాలు.. నిఫ్టీ @17,379
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు వరుసగా రెండోరోజైన గురువారం లాభాలతో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్లలో మిశ్రమ సంకేతాలు ఉన్నప్పటికీ.. మన మార్కెట్లు రాణించాయి.
ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు వరుసగా రెండో సెషన్లోనూ లాభాలతో ముగిశాయి. గురువారం ఉదయం లాభాలతో ప్రారంభమైన మార్కెట్లు రోజంతా అదే బాటలో పయనించాయి. అంతర్జాతీయ మార్కెట్లలోని మిశ్రమ సంకేతాల మధ్య మన సూచీలు రాణించడం గమనార్హం. మిడ్క్యాప్, స్మాల్క్యాప్ సహా దాదాపు అన్ని రంగాల్లో కొనుగోళ్లు జరిగాయి. అయితే, రూపాయి బలహీనత, రష్యాపై ఐరోపా సమాఖ్య మరిన్ని ఆంక్షల్ని ప్రకటించిన నేపథ్యంలో లాభాలు పరిమితమయ్యాయి.
సెన్సెక్స్ ఉదయం 58,314.05 వద్ద లాభాలతో ప్రారంభమై ఇంట్రాడేలో 58,578.76 దగ్గర గరిష్ఠాన్ని తాకింది. చివరకు 156.63 పాయింట్ల లాభంతో 58,222.10 వద్ద స్థిరపడింది. మరోవైపు నిఫ్టీ 17,379.25 వద్ద ట్రేడింగ్ మొదలుపెట్టి.. 17,428.80 వద్ద గరిష్ఠాన్ని తాకి.. చివరకు 57.50 పాయింట్లు ఎగబాకి 17,331.80 వద్ద ముగిసింది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ మార్కెట్లు ముగిసే సమయానికి రూ.81.90 వద్ద నిలిచింది. సెన్సెక్స్ 30 సూచీలో 18 షేర్లు లాభపడ్డాయి. టాటా స్టీల్, ఎల్అండ్టీ, హెచ్సీఎల్ టెక్, ఐసీఐసీఐ బ్యాంక్, ఇన్ఫోసిస్, యాక్సిస్ బ్యాంక్, సన్ఫార్మా, విప్రో, ఐటీసీ, ఎస్బీఐ, బజాజ్ ఫిన్సర్వ్, రిలయన్స్ షేర్లు లాభపడ్డాయి. భారతీ ఎయిర్టెల్, హెచ్యూఎల్, ఇండస్ఇండ్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ, బజాజ్ఫైనాన్స్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, పవర్గ్రిడ్, అల్ట్రాటెక్ సిమెంట్స్ అత్యధికంగా నష్టపోయిన షేర్ల జాబితాలో ఉన్నాయి.
మార్కెట్లోని ఇతర సంగతులు..
☞ సోనీతో కుదిరిన విలీన ఒప్పందానికి సీసీఐ ఆమోదం తెలిపిన నేపథ్యంలో ‘జీ ఎంటర్టైన్మెంట్’ షేర్లు గురువారం రాణించాయి. ఇంట్రాడేలో ఆరు శాతం మేర లాభపడ్డ షేరు ధర చివరకు 4.59 శాతం లాభంతో రూ.280.50 వద్ద స్థిరపడింది.
☞ అమెరికాలో సెప్టెంబరు నెలలో క్లాస్8 ట్రక్కులకు భారీ ఆర్డర్లు లభించిన నేపథ్యంలో భారత్ ఫోర్జ్ షేర్లు ఇంట్రాడేలో 8 శాతం వరకు లాభపడ్డాయి. చివరకు 7.91 శాతం లాభపడి రూ.762.95 వద్ద ముగిసింది.
☞ సవరించిన ఎమర్జెన్సీ క్రెడిట్లైన్ గ్యారంటీ స్కీమ్లో భాగంగా ప్రముఖ విమానయాన సంస్థ స్పైస్జెట్కు రూ.1000 కోట్లు అందనున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో కంపెనీ షేరు ఈరోజు 8.06 శాతం లాభపడి రూ.41.55 వద్ద స్థిరపడింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మహిళా ఆవిష్కర్తలు పెరగాలి
మనదేశంలో మహిళా ఆవిష్కర్తల సంఖ్య తక్కువగా ఉండటం ఆందోళన కలిగిస్తోందని, ఈ అంశంపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ అన్నారు. -
వరుస లాభాలకు విరామం
సూచీల అయిదు రోజుల లాభాల ర్యాలీకి కళ్లెం పడింది. మిశ్రమ అంతర్జాతీయ సంకేతాల నేపథ్యంలో బ్యాంకింగ్, ఫైనాన్స్ షేర్లలో మదుపర్లు లాభాలు స్వీకరించారు. -
2047 నాటికి ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తెలంగాణ
తెలంగాణ 2047 నాటికి ఒక ట్రిలియన్ డాలర్ల (రూ.85 లక్షల కోట్ల) ఆర్థిక వ్యవస్థగా మారేందుకు భారత పరిశ్రమల సమాఖ్య(సీఐఐ) తన వంతు పాత్ర పోషిస్తుందని సీఐఐ తెలంగాణ ఛైర్మన్, భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సాయి డి ప్రసాద్ అన్నారు. -
హార్లిక్స్ ‘హెల్త్ డ్రింక్’ కాదు
హిందుస్థాన్ యునిలీవర్(హెచ్యూఎల్) తన బ్రాండ్ హార్లిక్స్ లేబుల్పై కీలక మార్పులు చేసింది. గతంలో ‘హెల్త్ ఫుడ్ డ్రింక్స్’ కేటగిరిలో ఉన్న హార్లిక్స్ను ‘ఫంక్షనల్ న్యూట్రిషనల్ డ్రింక్స్’ కేటగిరిలోకి మార్చింది. -
రిలయన్స్కు రేటింగ్ సంస్థల ‘జై’
2024 మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి బలమైన ఆర్థిక ఫలితాలను ప్రకటించడంతో రిలయన్స్ ఇండస్ట్రీస్కు అంతర్జాతీయ రేటింగ్ సంస్థలు ఎస్ అండ్ పీ, ఫిచ్ జై కొట్టాయి. -
భారత జీడీపీ వృద్ధి 6.6 శాతం
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2024-25)లో భారత జీడీపీ వృద్ధి 6.6 శాతంగా నమోదుకావొచ్చని డెలాయిట్ ఇండియా అంచనా వేసింది. -
మారుతీకి విక్రయాల జోష్
జనవరి-మార్చి త్రైమాసికంలో మారుతీ సుజుకీ ఇండియా నికర లాభం 47.8 శాతం పెరిగి రూ.3,877.70 కోట్లుగా నమోదైంది. -
హెచ్సీఎల్ టెక్ లాభం రూ.3,986 కోట్లు
దేశంలో మూడో అతిపెద్ద ఐటీ సంస్థ హెచ్సీఎల్ టెక్ జనవరి- మార్చి త్రైమాసికంలో రూ.3,986 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. ఏడాది క్రితం ఇదే త్రైమాసికంలో కంపెనీ లాభం రూ.3,983 కోట్లుగా ఉంది. -
పూర్తి స్థాయి బ్యాంకులుగా మారేందుకు ఎస్ఎఫ్బీల నుంచి దరఖాస్తుల ఆహ్వానం
పూర్తి స్థాయి బ్యాంకులుగా మారేందుకు నిర్దేశిత అర్హతలను కలిగి ఉన్న స్మాల్ ఫైనాన్స్ బ్యాంకుల (ఎస్ఎఫ్బీ) నుంచి దరఖాస్తులను ఆహ్వానించినట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తెలిపింది. -
సంక్షిప్త వార్తలు(6)
అపోలో హాస్పిటల్స్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ (ఏహెచ్ఈఎల్) అనుబంధ సంస్థ అపోలో హెల్త్కో లిమిటెడ్(అపోలో 24/7)కు రూ.2,475 కోట్ల ఈక్విటీ పెట్టుబడులు వచ్చాయి. -
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
Flipkart: ఫ్లిప్కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ తేదీలను ప్రకటించింది. మే 3 నుంచి 9 వరకు ఈ సేల్ అందుబాటులో ఉండనుంది.
తాజా వార్తలు (Latest News)
-
పేరుకే పోలీసులు.. పుత్రరత్నం సేవలో బానిసలు
-
నాడు తండ్రులు నేడు వారసులు.. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆసక్తికరంగా ఎన్నికల పోరు
-
వైకాపా ప్రభుత్వ విలేజీ క్లినిక్.. కాలేదు క్లిక్
-
రెండు కిలోమీటర్లకే రూ.9 వ్యత్యాసమా..!
-
ఇచ్చేది మెతుకంత.. చిందరవందరే బతుకంతా!!
-
క్రీడలపై గ‘లీజు’ పెత్తనం.. జగన్ జమానాలో అంతా వ్యాపారమే