Stock Market: లాభాల్లో ముగిసిన మార్కెట్ సూచీలు.. 17,050 ఎగువకు నిఫ్టీ
Stock Market: సెన్సెక్స్ (Sensex) 346.37 పాయింట్ల లాభంతో 57,960.09 దగ్గర స్థిరపడింది. నిఫ్టీ (Nifty) 16,977.30 దగ్గర ప్రారంభమై ఇంట్రాడేలో 17,126.15 దగ్గర గరిష్ఠాన్ని, 16,940.60 కనిష్ఠాన్ని తాకింది. చివరకు 129.00 పాయింట్లు నష్టపోయి 17,080.70 దగ్గర ముగిసింది.
ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్ (Stock Market) సూచీలు బుధవారం లాభాలతో ముగిశాయి. ఉదయం సానుకూలంగా ట్రేడింగ్ ప్రారంభించిన మార్కెట్లు చివరి అరగంట వరకు పరిమిత శ్రేణిలో కదలాడాయి. ఆఖర్లో వచ్చిన కొనుగోళ్ల అండతో భారీగా పుంజుకొని ఇంట్రాడే గరిష్ఠాల వద్ద ట్రేడింగ్ను ముగించాయి. నేడు వీక్లీతో పాటు మార్చి నెల కాంట్రాక్టుల గడువు ముగిసిన నేపథ్యంలో సూచీలు చాలా వరకు పరిమిత శ్రేణిలో ట్రేడయ్యాయి. ఆఖర్లో దిగ్గజ కంపెనీల షేర్లలో వచ్చిన ర్యాలీ మార్కెట్లకు దన్నుగా నిలిచింది. అలాగే అంతర్జాతీయ మార్కెట్లలోని సానుకూల సంకేతాలు కూడా మార్కెట్లకు కలిసొచ్చాయి. అలీబాబా గ్రూప్ షేర్లు రాణించడంతో ఈరోజు ఆసియా సూచీలు లాభాల్లో ముగిశాయి. శ్రీరామ నవమి సందర్భంగా గురువారం మార్కెట్లకు సెలవు.
★ ఉదయం సెన్సెక్స్ (Sensex) 57,572.08 దగ్గర లాభాలతో ప్రారంభమైంది. ఇంట్రాడేలో 58,124.20- 57,524.32 మధ్య ట్రేడైంది. చివరకు 346.37 పాయింట్ల లాభంతో 57,960.09 దగ్గర స్థిరపడింది. నిఫ్టీ (Nifty) 16,977.30 దగ్గర ప్రారంభమై ఇంట్రాడేలో 17,126.15 దగ్గర గరిష్ఠాన్ని, 16,940.60 కనిష్ఠాన్ని తాకింది. చివరకు 129 పాయింట్లు నష్టపోయి 17,080.70 దగ్గర ముగిసింది. మార్కెట్లు ముగిసే సమయానికి డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ 18 పైసలు పతనమై 82.34 దగ్గర నిలిచింది.
★ సెన్సెక్స్ (Sensex)30 సూచీలో హెచ్సీఎల్ టెక్, హెచ్యూఎల్, ఇండస్ఇండ్ బ్యాంక్, బజాజ్ ఫిన్సర్వ్, టాటా మోటార్స్, బజాజ్ ఫైనాన్స్, ఎంఅండ్ఎం, అల్ట్రాటెక్ సిమెంట్స్, ఎస్బీఐ, కొటాక్ మహీంద్రా షేర్లు లాభపడ్డ జాబితాలో ఉన్నాయి. భారతీ ఎయిర్టెల్, రిలయన్స్, ఏషియన్ పెయింట్స్, ఐసీఐసీఐ బ్యాంక్ షేర్లు మాత్రమే నష్టపోయాయి.
మార్కెట్లోని మరిన్ని సంగతులు..
☛ భారతీ ఎయిర్టెల్ షేరు గత రెండు రోజుల్లో 3 శాతం నష్టపోయి దాదాపు ఆరు నెలల కనిష్ఠానికి చేరువైంది. రిలయన్స్ జియోకు పోటీగా ఇటీవల ఎయిర్టెల్ తక్కువ ధరకే అపరిమిత 5జీ డేటా ప్లాన్లను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. దీంతో కంపెనీ లాభదాయకతపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేశారు. చివరకు కంపెనీ షేరు 0.46 శాతం నష్టంతో రూ.745 దగ్గర ముగిసింది.
☛ హిందూస్థాన్ జింక్ నాలుగో మధ్యంత డివిడెండ్ చెల్లింపులకు విధించిన రికార్డు గడువు నేటితో ముగిసింది. దీంతో కంపనీ షేరు ఈరోజు 8.96 శాతం నష్టపోయి రూ.299.35 వద్ద స్థిరపడింది.
☛ జీ ఎంటర్టైన్మెంట్పై ఇండస్ఇండ్ బ్యాంక్ ప్రతిపాదించిన దివాలా పరిష్కార ప్రణాళిక వివాదం ఓ కొలిక్కి వచ్చింది. దీంతో జీ షేరు ఈరోజు 3.07 శాతం పుంజుకొని రూ.215.20 దగ్గర ముగిసింది.
☛ ఎస్ఎంఎల్ ఇసుజు లిమిటెడ్ తమ వాహన ధరల్ని ఏప్రిల్ 1 నుంచి పెంచనున్నట్లు ప్రకటించింది. దీంతో కంపెనీ షేరు ఈరోజు 2.38 శాతం పుంజుకొని రూ.705.50 దగ్గర స్థిరపడింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మహిళా ఆవిష్కర్తలు పెరగాలి
మనదేశంలో మహిళా ఆవిష్కర్తల సంఖ్య తక్కువగా ఉండటం ఆందోళన కలిగిస్తోందని, ఈ అంశంపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ అన్నారు. -
వరుస లాభాలకు విరామం
సూచీల అయిదు రోజుల లాభాల ర్యాలీకి కళ్లెం పడింది. మిశ్రమ అంతర్జాతీయ సంకేతాల నేపథ్యంలో బ్యాంకింగ్, ఫైనాన్స్ షేర్లలో మదుపర్లు లాభాలు స్వీకరించారు. -
2047 నాటికి ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తెలంగాణ
తెలంగాణ 2047 నాటికి ఒక ట్రిలియన్ డాలర్ల (రూ.85 లక్షల కోట్ల) ఆర్థిక వ్యవస్థగా మారేందుకు భారత పరిశ్రమల సమాఖ్య(సీఐఐ) తన వంతు పాత్ర పోషిస్తుందని సీఐఐ తెలంగాణ ఛైర్మన్, భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సాయి డి ప్రసాద్ అన్నారు. -
హార్లిక్స్ ‘హెల్త్ డ్రింక్’ కాదు
హిందుస్థాన్ యునిలీవర్(హెచ్యూఎల్) తన బ్రాండ్ హార్లిక్స్ లేబుల్పై కీలక మార్పులు చేసింది. గతంలో ‘హెల్త్ ఫుడ్ డ్రింక్స్’ కేటగిరిలో ఉన్న హార్లిక్స్ను ‘ఫంక్షనల్ న్యూట్రిషనల్ డ్రింక్స్’ కేటగిరిలోకి మార్చింది. -
రిలయన్స్కు రేటింగ్ సంస్థల ‘జై’
2024 మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి బలమైన ఆర్థిక ఫలితాలను ప్రకటించడంతో రిలయన్స్ ఇండస్ట్రీస్కు అంతర్జాతీయ రేటింగ్ సంస్థలు ఎస్ అండ్ పీ, ఫిచ్ జై కొట్టాయి. -
భారత జీడీపీ వృద్ధి 6.6 శాతం
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2024-25)లో భారత జీడీపీ వృద్ధి 6.6 శాతంగా నమోదుకావొచ్చని డెలాయిట్ ఇండియా అంచనా వేసింది. -
మారుతీకి విక్రయాల జోష్
జనవరి-మార్చి త్రైమాసికంలో మారుతీ సుజుకీ ఇండియా నికర లాభం 47.8 శాతం పెరిగి రూ.3,877.70 కోట్లుగా నమోదైంది. -
హెచ్సీఎల్ టెక్ లాభం రూ.3,986 కోట్లు
దేశంలో మూడో అతిపెద్ద ఐటీ సంస్థ హెచ్సీఎల్ టెక్ జనవరి- మార్చి త్రైమాసికంలో రూ.3,986 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. ఏడాది క్రితం ఇదే త్రైమాసికంలో కంపెనీ లాభం రూ.3,983 కోట్లుగా ఉంది. -
పూర్తి స్థాయి బ్యాంకులుగా మారేందుకు ఎస్ఎఫ్బీల నుంచి దరఖాస్తుల ఆహ్వానం
పూర్తి స్థాయి బ్యాంకులుగా మారేందుకు నిర్దేశిత అర్హతలను కలిగి ఉన్న స్మాల్ ఫైనాన్స్ బ్యాంకుల (ఎస్ఎఫ్బీ) నుంచి దరఖాస్తులను ఆహ్వానించినట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తెలిపింది. -
సంక్షిప్త వార్తలు(6)
అపోలో హాస్పిటల్స్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ (ఏహెచ్ఈఎల్) అనుబంధ సంస్థ అపోలో హెల్త్కో లిమిటెడ్(అపోలో 24/7)కు రూ.2,475 కోట్ల ఈక్విటీ పెట్టుబడులు వచ్చాయి. -
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
Flipkart: ఫ్లిప్కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ తేదీలను ప్రకటించింది. మే 3 నుంచి 9 వరకు ఈ సేల్ అందుబాటులో ఉండనుంది.