Stock Market: లాభాల్లో ముగిసిన మార్కెట్ సూచీలు.. 17,050 ఎగువకు నిఫ్టీ
Stock Market: సెన్సెక్స్ (Sensex) 346.37 పాయింట్ల లాభంతో 57,960.09 దగ్గర స్థిరపడింది. నిఫ్టీ (Nifty) 16,977.30 దగ్గర ప్రారంభమై ఇంట్రాడేలో 17,126.15 దగ్గర గరిష్ఠాన్ని, 16,940.60 కనిష్ఠాన్ని తాకింది. చివరకు 129.00 పాయింట్లు నష్టపోయి 17,080.70 దగ్గర ముగిసింది.
ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్ (Stock Market) సూచీలు బుధవారం లాభాలతో ముగిశాయి. ఉదయం సానుకూలంగా ట్రేడింగ్ ప్రారంభించిన మార్కెట్లు చివరి అరగంట వరకు పరిమిత శ్రేణిలో కదలాడాయి. ఆఖర్లో వచ్చిన కొనుగోళ్ల అండతో భారీగా పుంజుకొని ఇంట్రాడే గరిష్ఠాల వద్ద ట్రేడింగ్ను ముగించాయి. నేడు వీక్లీతో పాటు మార్చి నెల కాంట్రాక్టుల గడువు ముగిసిన నేపథ్యంలో సూచీలు చాలా వరకు పరిమిత శ్రేణిలో ట్రేడయ్యాయి. ఆఖర్లో దిగ్గజ కంపెనీల షేర్లలో వచ్చిన ర్యాలీ మార్కెట్లకు దన్నుగా నిలిచింది. అలాగే అంతర్జాతీయ మార్కెట్లలోని సానుకూల సంకేతాలు కూడా మార్కెట్లకు కలిసొచ్చాయి. అలీబాబా గ్రూప్ షేర్లు రాణించడంతో ఈరోజు ఆసియా సూచీలు లాభాల్లో ముగిశాయి. శ్రీరామ నవమి సందర్భంగా గురువారం మార్కెట్లకు సెలవు.
★ ఉదయం సెన్సెక్స్ (Sensex) 57,572.08 దగ్గర లాభాలతో ప్రారంభమైంది. ఇంట్రాడేలో 58,124.20- 57,524.32 మధ్య ట్రేడైంది. చివరకు 346.37 పాయింట్ల లాభంతో 57,960.09 దగ్గర స్థిరపడింది. నిఫ్టీ (Nifty) 16,977.30 దగ్గర ప్రారంభమై ఇంట్రాడేలో 17,126.15 దగ్గర గరిష్ఠాన్ని, 16,940.60 కనిష్ఠాన్ని తాకింది. చివరకు 129 పాయింట్లు నష్టపోయి 17,080.70 దగ్గర ముగిసింది. మార్కెట్లు ముగిసే సమయానికి డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ 18 పైసలు పతనమై 82.34 దగ్గర నిలిచింది.
★ సెన్సెక్స్ (Sensex)30 సూచీలో హెచ్సీఎల్ టెక్, హెచ్యూఎల్, ఇండస్ఇండ్ బ్యాంక్, బజాజ్ ఫిన్సర్వ్, టాటా మోటార్స్, బజాజ్ ఫైనాన్స్, ఎంఅండ్ఎం, అల్ట్రాటెక్ సిమెంట్స్, ఎస్బీఐ, కొటాక్ మహీంద్రా షేర్లు లాభపడ్డ జాబితాలో ఉన్నాయి. భారతీ ఎయిర్టెల్, రిలయన్స్, ఏషియన్ పెయింట్స్, ఐసీఐసీఐ బ్యాంక్ షేర్లు మాత్రమే నష్టపోయాయి.
మార్కెట్లోని మరిన్ని సంగతులు..
☛ భారతీ ఎయిర్టెల్ షేరు గత రెండు రోజుల్లో 3 శాతం నష్టపోయి దాదాపు ఆరు నెలల కనిష్ఠానికి చేరువైంది. రిలయన్స్ జియోకు పోటీగా ఇటీవల ఎయిర్టెల్ తక్కువ ధరకే అపరిమిత 5జీ డేటా ప్లాన్లను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. దీంతో కంపెనీ లాభదాయకతపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేశారు. చివరకు కంపెనీ షేరు 0.46 శాతం నష్టంతో రూ.745 దగ్గర ముగిసింది.
☛ హిందూస్థాన్ జింక్ నాలుగో మధ్యంత డివిడెండ్ చెల్లింపులకు విధించిన రికార్డు గడువు నేటితో ముగిసింది. దీంతో కంపనీ షేరు ఈరోజు 8.96 శాతం నష్టపోయి రూ.299.35 వద్ద స్థిరపడింది.
☛ జీ ఎంటర్టైన్మెంట్పై ఇండస్ఇండ్ బ్యాంక్ ప్రతిపాదించిన దివాలా పరిష్కార ప్రణాళిక వివాదం ఓ కొలిక్కి వచ్చింది. దీంతో జీ షేరు ఈరోజు 3.07 శాతం పుంజుకొని రూ.215.20 దగ్గర ముగిసింది.
☛ ఎస్ఎంఎల్ ఇసుజు లిమిటెడ్ తమ వాహన ధరల్ని ఏప్రిల్ 1 నుంచి పెంచనున్నట్లు ప్రకటించింది. దీంతో కంపెనీ షేరు ఈరోజు 2.38 శాతం పుంజుకొని రూ.705.50 దగ్గర స్థిరపడింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
2024-25లోనూ ఐటీ నియామకాలు అంతంతే
ఐటీ రంగం ఆకర్షణీయ వృద్ధి బాట పట్టేందుకు ఇంకా సమయం పట్టే అవకాశం ఉందనే అంచనాలు వెలువడుతున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంతో పోల్చితే, వచ్చే ఆర్థిక సంవత్సరంలో మెరుగైన పరిస్థితి ఉంటుందనే అంశమే కాస్త ఊరట కలిగిస్తోంది. -
దీర్ఘకాలంలో చిన్న, మధ్య షేర్లు బలంగానే
చిన్న, మధ్య స్థాయి షేర్ల విలువలు మరీ అధిక స్థాయికి చేరాయని మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ చేసిన వ్యాఖ్యలతో ఈ షేర్లు గత 3 వారాల్లో భారీగా కుదేలయ్యాయి. -
ఆఫీసుకు వస్తేనే పదోన్నతులు
కార్యాలయాలకు రాకపోతే పదోన్నతులు ఇవ్వబోమని తమ ఉద్యోగులకు స్పష్టం చేస్తూ ల్యాప్ట్యాప్ల తయారీ కంపెనీ డెల్ లేఖ పంపినట్లు తెలుస్తోంది. -
రూ.1991కే ఫ్లై91 ప్రయాణం
ఫ్లై91 సంస్థ సోమవారం తన విమాన సర్వీసులను ప్రారంభించింది. మొదటి విమానం గోవా మనోహర్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బెంగళూరు కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయానికి ఉదయం గం.7.55కు బయలుదేరి వెళ్లింది. -
ప్రాంగణ నియామకాల్లో మహిళల వాటా 5% పెరిగింది: హైర్ ప్రో
అంతక్రితం ఏడాదితో పోలిస్తే, 2022-23 ప్రాంగణ నియామకాల్లో మహిళల వాటా 5% పెరిగినట్లు ఏఐ పవర్డ్ రిక్రూట్మెంట్ ఆటోమేషన్ సంస్థ హైర్ ప్రో నివేదిక వెల్లడించింది. -
అంకురాలకు విలువే సర్వస్వం కాదు
పారదర్శకత, నైతిక ప్రవర్తన కోసం స్వీయ నియంత్రణ విధానాన్ని దేశీయ అంకుర సంస్థలు అవలంబించాలని జీ20లో భారత తరపు ప్రధాన ప్రతినిధి (షెర్పా) అమితాబ్ కాంత్ తెలిపారు. -
మదుపర్ల అప్రమత్తత
ఆద్యంతం ఒడుదొడుకుల మధ్య సాగిన ట్రేడింగ్లో సూచీలు స్వల్ప లాభాల్లో ముగిశాయి. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల నిర్ణయం వెలువడనున్నందున, మదుపర్లు అప్రమత్తత పాటించారు. -
బీమా రంగంలోకి రూ.54,000 కోట్ల ఎఫ్డీఐ
గత తొమ్మిదేళ్లలో బీమా రంగం రూ.54,000 కోట్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్డీఐ)ను ఆకర్షించిందని ఆర్థిక సేవల కార్యదర్శి వివేక్ జోషి తెలిపారు. -
బెంగళూరు- లక్షద్వీప్ విమాన సర్వీసు: ఇండిగో
లక్షద్వీప్కు విమాన సదుపాయాన్ని విస్తరించడంలో భాగంగా ఈనెల 31 నుంచి బెంగళూరు- అగత్తి మధ్య నేరుగా విమాన సర్వీసులను నడుపుతున్నట్లు ఇండిగో సోమవారం వెల్లడించింది. -
మనవడికి రూ.240 కోట్ల ఇన్ఫోసిస్ షేర్లు
ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు ఎన్ఆర్ నారాయణమూర్తి, తన మనవడు ఏకాగ్రహ్ రోహన్ మూర్తికి భారీ బహుమతి ఇచ్చారు. -
సంక్షిప్త వార్తలు
ఈ వేసవిలో ఎయిరిండియా ఎక్స్ప్రెస్ అంతర్జాతీయ విమాన సర్వీసులను 20 శాతానికి పైగా పెంచనుంది. దేశ, విదేశీ మార్గాల్లో రోజువారీ 360కి పైగా విమాన సర్వీసులను నడపబోతోంది. -
WhatsApp: వాట్సప్ పేమెంట్స్ ఇక మరింత సులువుగా.. ఇక చాట్ లిస్ట్లోనే
WhatsApp payments: వాట్సప్లో పేమెంట్స్ ఇక మరింత సులువు కానుంది. చాట్ లిస్ట్లోనే ఇకపై క్యూఆర్ కోడ్ స్కానర్ కనిపించనుంది.
తాజా వార్తలు (Latest News)
-
ఉపరాష్ట్రపతి కావొచ్చనే ఉద్దేశంతో తమిళిసై రాజీనామా: మంత్రి అనితా రాధాకృష్ణన్
-
ఉత్తర కోస్తాలో రేపు భారీ వర్షాలు
-
AP News: తెలుగు రాద్దామనుకుంటే.. హిందీ ప్రశ్నపత్రం వచ్చింది
-
బస్సుల్లేక బాధలు.. తికమకలో మరో కేంద్రానికి విద్యార్థిని
-
cVIGIL: మీరు గానీ విజిలేస్తే.. మడతెట్టేస్తారు!
-
Proddatur: ఇద్దరు వైకాపా నేతలపై కేసులు.. ప్రొద్దుటూరులో చీరల పంపిణీ వ్యవహారంపై చర్యలు