TATA Steel: కరోనా మృతుల కుటుంబాలకు వేతనం

కొవిడ్‌ మహమ్మారి విలయతాండవం చేస్తూ అనేక మంది ప్రాణాల్ని హరిస్తున్న నేపథ్యంలో టాటా స్టీల్‌ తన ఔదార్యాన్ని చాటుకుంది. తమ సంస్థలో కరోనా బారిన పడి మరణించిన ఉద్యోగుల..........

Updated : 25 May 2021 13:46 IST

ఉద్యోగుల కుటుంబాలకు బాసట

జంషేడ్‌పూర్‌: కొవిడ్‌ మహమ్మారి విలయతాండవం చేస్తూ అనేక మంది ప్రాణాల్ని హరిస్తున్న నేపథ్యంలో టాటా స్టీల్‌ తన ఔదార్యాన్ని చాటుకుంది. తమ సంస్థలో కరోనా బారిన పడి మరణించిన ఉద్యోగుల కుటుంబాలకు సామాజిక భద్రతను కల్పించేందుకు ముందుకు వచ్చింది. చనిపోయిన ఉద్యోగి కుటుంబానికి.. ఆ ఉద్యోగి రిటైర్మెంట్‌ వయసు వచ్చే వరకు ప్రతి నెలా ఆర్థిక సహకారం అందించాలని నిర్ణయించింది. ఉద్యోగి తన చివరి నెల వేతన రూపంలో తీసుకున్న మొత్తాన్ని ఆ కుటుంబీకులకు ప్రతి నెలా అందించనున్నట్లు ప్రకటించింది. సామాజిక మాధ్యమాల్లో విడుదల చేసిన ఓ ప్రకటన ద్వారా టాటా స్టీల్ కంపెనీ ఈ నిర్ణ‌యాన్ని వెల్లడించింది. 

ఇక కంపెనీలో ప‌నిచేస్తూ కరోనా బారిన పడి మరణించిన ఫ్రంట్‌లైన్ వ‌ర్క‌ర్ల పిల్ల‌ల గ్రాడ్యుయేషన్‌ చ‌దువుల‌ వరకు కంపెనీయే మొత్తం ఖర్చును భ‌రించ‌నున్న‌ది. నెల వేతనం అందించడంతో పాటు ఫ్రంట్‌లైన్ వర్కర్ల కుటుంబాలకు ఈ అదనపు సాయం కల్పించనున్నట్లు ప్రకటించారు. జంషేడ్‌పూర్‌ కేంద్రంగా పనిచేస్తున్న టాటా స్టీల్‌ ఔదార్యంపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఆన్‌లైన్‌ వేదికగా నెటిజన్లు టాటా సంస్థ, సంస్థ గౌరవ ఛైర్మన్‌ రతన్‌ టాటాను ప్రశంసిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని