Mass Suicide: ఒకే ఇంట్లో ఏడుగురి మృతి.. సామూహిక ఆత్మహత్యలుగా అనుమానం!
ఒకే ఇంట్లో ఏడుగురు కుటుంబ సభ్యులు విగతజీవులై కనిపించారు. గుజరాత్లో వెలుగుచూసిన ఈ ఘటనను పోలీసులు సామూహిక ఆత్మహత్యగా అనుమానిస్తున్నారు.
గాంధీనగర్: గుజరాత్ (Gujarat)లోని సూరత్లో దిగ్భ్రాంతికర ఘటన వెలుగుచూసింది. ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు సభ్యులు అనుమానాస్పద స్థితిలో ఇంట్లో మృతదేహాలై కనిపించారు. ఈ ఘటనను పోలీసులు సామూహిక ఆత్మహత్యలు (Mass Suicide)గా అనుమానిస్తున్నారు. మృతుల్లో ముగ్గురు చిన్నారులు ఉండటం గమనార్హం. ఆత్మహత్యకు ముందు రాసినట్లు భావిస్తోన్న ఓ లేఖను ఘటనాస్థలం నుంచి స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఆర్థిక లావాదేవీలే కారణమని అందులో ప్రస్తావించినట్లు తెలిపారు.
పోలీసుల వివరాల ప్రకారం.. మనీశ్ సోలంకీ (37) అనే వ్యక్తి తన భార్య, ముగ్గురు పిల్లలు, తల్లిదండ్రులతో కలిసి సూరత్లోని ఓ అపార్ట్మెంట్లో నివసిస్తున్నాడు. శనివారం వారందరూ ఇంట్లో విగతజీవులై కనిపించారు. మనీశ్ ఉరేసుకోగా.. మిగతా ఆరుగురు గుర్తుతెలియని విషం తాగి మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. మృతి చెందిన చిన్నారుల్లో మనీశ్ కుమారుడు (6), ఇద్దరు కుమార్తె (10, 13)లు ఉన్నారు. ఘటనాస్థలంలో విషపదార్థంతో కూడిన ఓ సీసాను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ మేరకు సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని.. పోస్ట్మార్టం నిమిత్తం మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు.
దిల్లీలో దారుణం.. ఇంట్లోకి చొరబడి యువతిపై కాల్పులు
ఆర్థిక లావాదేవీలే ఈ ఘటనకు కారణమై ఉంటుందని పోలీసులు తెలిపారు. ఈమేరకు సూసైడ్ నోట్ లభ్యమైందని, దానిని పరిశీలిస్తున్నట్లు చెప్పారు. కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. మనీశ్ తొలుత తన కుటుంబ సభ్యులకు విషం ఇచ్చి, ఆ తర్వాత తాను ఆత్మహత్యకు పాల్పడి ఉండొచ్చని సూరత్ మేయర్ నిరంజన్ అనుమానం వ్యక్తం చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఏటీఎం చోరీకి యత్నం.. షార్ట్ సర్క్యూట్తో నగదు దగ్ధం
సూర్యాపేట జిల్లా కోదాడ మండలం గుడిబండలోని ఓ ఏటీఎంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా రూ.8 లక్షల నగదు దగ్ధం అయ్యింది. -
జీవితంపై విరక్తి.. ఇద్దరు పిల్లలతో కలిసి తల్లి ఆత్మహత్య
ఇద్దరు పిల్లలతో కలిసి తల్లి ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన వైఎస్సార్ జిల్లా చెన్నూరు మండలంలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. -
ఛత్తీస్గఢ్లో ఘోర రోడ్డు ప్రమాదం: 9 మంది మృతి, 23 మందికి గాయాలు
ఛత్తీస్గఢ్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బెమెతరా జిల్లాలో ఆగి ఉన్న లారీని మినీ వ్యాను ఢీకొంది. -
కోనసీమ జిల్లాలో రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి
కోనసీమ జిల్లా అమలాపురం గ్రామీణ మండలం భట్నవిల్లి వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. -
8 నెలలు మోసగించారు.. రూ.7 కోట్లు కొట్టేశారు
తనకొక స్వామీజీ తెలుసని.. విదేశాల్లో ఉన్న శిష్యులు ఆయనకు విరాళాలు పంపిస్తారని.. పన్నుల కోసం ముందుగా పెట్టుబడి పెడితే 30శాతం వాటా పొందవచ్చని నమ్మించి ఓ ఘరానా ముఠా ఏకంగా రూ.7.18కోట్లు కాజేసింది. -
అత్యాచారం చేసి.. కాల్చిన ఇనుప రాడ్డుతో ముఖంపై పేరు రాసి..
ఉత్తర్ప్రదేశ్లోని లఖీంపుర్ ఖేరీలో దారుణం చోటుచేసుకుంది. ఓ 17 ఏళ్ల బాలికను మూడు రోజుల పాటు బంధించి అత్యాచారం చేసిన ఘటన తాజాగా వెలుగుచూసింది. -
కృష్ణా జిల్లాలో రూ.80లక్షల మద్యం పట్టివేత
ఎన్నికల్లో పంపిణీ చేసేందుకు కృష్ణా జిల్లా గన్నవరం మండలం మెట్లపల్లిలో హనుమాన్జంక్షన్ సర్కిల్ పరిధిలోని ఆత్కూరు స్టేషన్ శివారులో నిల్వ ఉంచిన 58,080 క్వార్టర్ల మద్యం సీసాలను పోలీసులు పట్టుకున్నారు. -
వైకాపా నాయకుడి పశువుల పాకలో భారీగా మద్యం సీసాలు లభ్యం
వైకాపా నాయకుడి పశువుల పాకలో భారీగా గోవా మద్యం సీసాలు పట్టుబడిన సంఘటన ప్రకాశం జిల్లా చీమకుర్తి మండలం యర్రగుడిపాడులో ఆదివారం చోటుచేసుకుంది. -
మహదేవ్ బెట్టింగ్ యాప్ కేసు.. బాలీవుడ్ నటుడు సాహిల్ ఖాన్ అరెస్ట్
మహదేవ్ బెట్టింగ్ యాప్ కుంభకోణం కేసులో బాలీవుడ్ నటుడు, ఫిట్నెస్ ఇన్ఫ్లుయెన్సర్ సాహిల్ ఖాన్ను ముంబయి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
పాక్ పడవ నుంచి రూ.600 కోట్ల విలువైన మాదకద్రవ్యాల స్వాధీనం
గుజరాత్ తీరానికి సమీపంలో పాకిస్థాన్కు చెందిన పడవ నుంచి 86 కేజీల బరువున్న 78 పొట్లాల మాదకద్రవ్యాలను భారతీయ కోస్టుగార్డు స్వాధీనం చేసుకున్నట్లు తీర రక్షక దళ సంస్థ ఆదివారం తెలిపింది. -
జమ్మూకశ్మీర్లో కాల్పులు.. గ్రామ రక్షక భటుడి మృతి
జమ్మూకశ్మీర్లోని ఉధంపుర్ జిల్లాలో మారుమూల గ్రామమైన పనారాలో కాల్పులు కలకలం సృష్టించాయి. -
12 మంది కల్తీ విత్తన విక్రేతలపై క్రిమినల్ కేసులు
రైతులకు కల్తీ విత్తనాలు విక్రయించిన 12మందిని గుర్తించి క్రిమినల్ కేసులు నమోదు చేసినట్లు వ్యవసాయ శాఖ తెలిపింది. -
ట్రేడ్ లైసెన్సుల పేరిట వ్యాపారులకు బురిడీ
మీ వ్యాపార ట్రేడ్ లైసెన్సులు రెన్యువల్ చేసుకోవాలంటూ పలు హోటళ్లు, రెస్టారెంట్లు, ఆసుపత్రి నిర్వాహకుల నుంచి డబ్బులు వసూలు చేసిన అంతర్రాష్ట్ర సైబర్ మోసగాడిని గద్వాల పోలీసులు అరెస్టు చేసి రిమాండుకు పంపారు.
తాజా వార్తలు (Latest News)
-
బెయిల్ కోసం ట్రయల్ కోర్టుకు ఎందుకు వెళ్లలేదు?
-
ఏటీఎం చోరీకి యత్నం.. షార్ట్ సర్క్యూట్తో నగదు దగ్ధం
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
యూపీఐ వచ్చినా క్యాషే కింగ్.. పెరిగిన ఏటీఎం విత్డ్రాలు!
-
ఎన్నికల్లో వాడే ‘సిరా’ చుక్క ఎందుకు చెరిగిపోదు.. ఆసక్తికర విషయాలు
-
వ్యక్తుల ప్రయోజనాల కోసం సుప్రీంకోర్టుకు రాష్ర్ట ప్రభుత్వమా ?