గోదాంలో అగ్నిప్రమాదం.. 9 మంది మృతి

గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో తొమ్మిది మంది మృతిచెందగా.. మరో ఎనిమిది మందికి గాయాలయ్యాయి. వస్త్ర గోదాంలో మంటలు........

Published : 05 Nov 2020 01:23 IST

అహ్మదాబాద్‌: గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో తొమ్మిది మంది మృతిచెందగా.. మరో ఎనిమిది మందికి గాయాలయ్యాయి. వస్త్ర గోదాంలో మంటలు చెలరేగి పేలుళ్లు సంభవించినట్టు  అధికారులు వెల్లడించారు. ఈ పేలుళ్ల తీవ్రతకు భవనం పైకప్పు కుప్పకూలింది. దీంతో శిథిలాల కింద చిక్కుకున్న 14 మందిని అగ్నిమాపక సిబ్బంది రక్షించారు. అహ్మదాబాద్‌లోని పారిశ్రామికవాడ పిరానా- పిప్లాజ్‌లో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. 26 అగ్నిమాపక బృందాలు అక్కడికి చేరుకొని మంటలు అదుపుచేస్తున్నాయి. క్షతగాత్రులను సమీపంలోని ఎల్జీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్టు అధికారులు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని