ప్రేమజంట..కాసేపట్లో పెళ్లి..అంతలోనే విషాదం!
ఏడడుగులు నడిచి నూరేళ్ల జీవితం పంచుకోవాలని ఎన్నో కలలు కంటూ బయలుదేరిన ఓ ప్రేమ జంటను రోడ్డు ప్రమాదం విడదీసింది.
చౌటుప్పల్: ఏడడుగులు నడిచి నూరేళ్ల జీవితం పంచుకోవాలని ఎన్నో కలలు కంటూ బయలుదేరిన ఓ ప్రేమ జంటను రోడ్డు ప్రమాదం విడదీసింది. యువ జంట ఆశలను ఆవిరిచేసి విషాదం నింపింది. వివరాల్లోకి వెళితే... హైదరాబాద్ హయత్నగర్కు చెందిన నాగరాజు, శ్రీలత గత కొద్దిరోజులుగా ప్రేమించుకుంటున్నారు. ఇద్దరూ పెళ్లి చేసుకుని ఒక్కటవ్వాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో ఎన్నో ఆశలతో ద్విచక్రవాహనంపై నార్కట్పల్లి మండలంలోని చెరువుగట్టు దేవాలయానికి బయలుదేరారు. కాసేపట్లో గమ్యానికి చేరుకుంటామనగా.. కారు రూపంలో మృత్యువు కబలించింది. చౌటుప్పల్ జాతీయ రహదారి సిగ్నల్ వద్ద ఈ ఘటన జరిగింది. కొన్ని క్షణాల్లో గ్రీన్ సిగ్నల్ పడేందుకు సమయం సమీపిస్తుండటంతో యువజంట ఉన్న ద్విచక్రవాహనంతోపాటు ముందున్న లారీ, కార్లు నెమ్మదిగా ముందుకు కదిలాయి. అంతలోనే హైదరాబాద్ నుంచి విజయవాడవైపు వెళ్తున్న కారు అతివేగంతో దూసుకొచ్చి ముందున్న వాహనాలను బలంగా ఢీ కొట్టింది.
ఈ ప్రమాదంలో నాగరాజు, శ్రీలత ఉన్న ద్విచక్ర వాహనానికి మంటలు అంటుకున్నాయి. పెట్రోల్ లీకై మంటలు చెలరేగడంతో వాహనం పూర్తిగా కాలిపోయింది. ఈ ప్రమాదంలో గాయపడిన నాగరాజును ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలో మృతి చెందాడు. గాయపడిన యువతి శ్రీలతతో పాటు మరో వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కారు బ్రేకులు ఫెయిల్ కావడంతోనే ప్రమాదం జరిగిందని ప్రాథమికంగా భావిస్తుండగా.. సీసీటీవీ దృశ్యాలు చూస్తే మాత్రం కారు డ్రైవర్ నిర్లక్ష్యమే ఘటనకు కారణమన్న వాదనలు వినిపిస్తున్నాయి. అతివేగంగా ఢీ కొట్టిన తర్వాత కారు వేగం కొంచెం నెమ్మదించినట్లు సీసీ కెమెరా దృశ్యాల్లో స్పష్టంగా కనిపిస్తోంది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ టీవీ ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బాలుడి పొట్టలోకి గాలికొట్టిన ఆకతాయి
ఓ ఆకతాయి వికృత చేష్టలకు గురైన బాలుడు తీవ్ర అస్వస్థతతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. పోలీసుల కథనం.. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం అనికేపల్లికి చెందిన బాలుడు(12) బుధవారం సాయంత్రం తోటి పిల్లలతో కలిసి వాలీబాల్ ఆడుతుండగా బంతిలో గాలి తగ్గింది. -
ఉపాధి లేక ఇద్దరు నేత కార్మికుల ఆత్మహత్య
రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉపాధి లేక ఇద్దరు నేత కార్మికులు ఆత్మహత్య చేసుకున్న ఘటన గురువారం చోటుచేసుకుంది. -
ఆగి ఉన్న లారీని ఢీకొని.. కారుకు మంటలు
ఆగి ఉన్న లారీని వెనక నుంచి ఢీకొనడంతో కారులో మంటలు వ్యాపించి యువ వ్యాపారి సజీవ దహనమయ్యాడు. -
పుట్టెడు దుఃఖం మిగిల్చిన పుట్టెంట్రుకల వేడుక
బావ, బావమరుదుల కుటుంబాల్లోని పది మంది పుట్టెంట్రుకల వేడుక కోసం ఆనందంగా బయల్దేరారు. రోడ్డు ప్రమాదం మధ్యలోనే వారి సంతోషాన్ని చిదిమేసింది. -
విద్యుదాఘాతంతో కౌలు రైతు మృతి
పొలంలో తెగిపడిన విద్యుత్ తీగ తగిలి కౌలు రైతు అక్కడికక్కడే మృతిచెందిన ఘటన జగిత్యాల జిల్లాలో గురువారం ఉదయం చోటు చేసుకుంది. -
రోడ్డు ప్రమాదాల్లో ఐదుగురి దుర్మరణం
కుమురం భీం, నిజామాబాద్ జిల్లాల్లో గురువారం రాత్రి జరిగిన రెండు ప్రమాదాల్లో ఐదుగురు మృతిచెందారు. మొత్తం 17 మంది గాయపడ్డారు. -
ఐదుగురు ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్య
రాష్ట్రంలోని వేర్వేరు జిల్లాలకు చెందిన ఐదుగురు ఇంటర్ విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. -
హోటల్లో భారీ అగ్నిప్రమాదం.. ఆరుగురి సజీవ దహనం
బిహార్ రాజధాని పట్నాలో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. స్థానిక రైల్వేస్టేషన్ సమీపంలోని ఓ హోటల్లో భారీ ఎత్తున మంటలు చెలరేగి ఆరుగురు సజీవ దహనమయ్యారు. -
45 కిలోమీటర్లు.. 1400 సీసీ కెమెరాల జల్లెడ
అర్ధరాత్రి తర్వాత మహిళపై సామూహిక అత్యాచారం.. ఆపై హత్య.. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులకు సీసీ కెమెరాల్లో ఇద్దరూ పరారయ్యే అస్పష్ట చిత్రాలు తప్ప ఒక్క ఆధారం లభించలేదు. -
సల్మాన్ ఇంటివద్ద కాల్పులు.. పంజాబ్లో మరో ఇద్దరు నిందితుల అరెస్టు
బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ఇంటి ముందు జరిగిన కాల్పుల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. -
పోలీసుస్టేషన్ ఆవరణలోనే తెదేపా కార్యకర్తపై దాడి
పోలీసు స్టేషన్ ఆవరణలో వైకాపా నాయకులు హల్చల్ చేశారు. పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం పొందుగల గ్రామానికి చెందిన కొందరు వైకాపా నాయకులు తెదేపా కార్యకర్త యూసఫ్పై స్టేషన్ ఆవరణలోనే దాడి చేశారు. -
వైకాపా నాయకుడి బార్లో.. రూ.1.30 కోట్ల మద్యం స్వాధీనం
శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా అల్లూరులో సెబ్ అధికారులు భారీగా మద్యం స్వాధీనం చేసుకున్నారు. -
గులకరాయి కేసులో నిందితుడిని కస్టడీకి తీసుకున్న పోలీసులు
గులకరాయి కేసులో నిందితుడు సతీష్కుమార్ను పోలీసులు తమ కస్టడీకి తీసుకున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
‘వీవీప్యాట్ల’పై సుప్రీం తీర్పు.. విపక్షాలకు గట్టి చెంపదెబ్బ: మోదీ
-
అవసరమైతే తప్ప బయటకు రావొద్దు: వాతావరణశాఖ
-
‘నోటా’కు ఎక్కువ ఓట్లు వస్తే..? ఈసీకి సుప్రీం కోర్టు నోటీసులు
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా
-
ఐపీఓకు స్విగ్గీ రెడీ.. సెబీ రహస్య మార్గంలో దరఖాస్తు
-
ఆ సమయంలో అతడు ఒక్క బౌండరీ కొట్టలేదు : విరాట్ స్ట్రైక్రేట్పై గావస్కర్