అల్లాద్దీన్ దీపం పేరుతో రూ. 2.5 కోట్లకు టోకరా
అలాద్దీన్ దీపం పేరుతో ఓ వైద్యుడిని ఇద్దరు వ్యక్తులు మోసం చేసిన ఘటన ఉత్తరప్రదేశ్లోని మీరఠ్ జిల్లాలో జరిగింది. పోలీసుల కథనం మేరకు.. మన దేశానికి చెందిన లయీక్ ఖాన్ అనే వ్యక్తి లండన్ నుంచి తిరిగొచ్చి యూపీలో వైద్యుడిగా సేవలందిస్తున్నారు. మాయలు, మంత్రాలు, తాంత్రిక
యూపీలో మోసపోయిన వైద్యుడు
మేరఠ్: అల్లాదీన్ దీపం పేరుతో ఓ వైద్యుడిని ఇద్దరు వ్యక్తులు మోసం చేసిన ఘటన ఉత్తర్ప్రదేశ్లోని మేరఠ్ జిల్లాలో జరిగింది. పోలీసుల కథనం మేరకు.. మన దేశానికి చెందిన లయీక్ ఖాన్ అనే వ్యక్తి లండన్ నుంచి తిరిగొచ్చి యూపీలో వైద్యుడిగా సేవలందిస్తున్నారు. మాయలు, మంత్రాలు, తాంత్రిక శక్తుల పేరుతో ఇద్దరు వ్యక్తులు వైద్యుడికి దగ్గరయ్యారు. 2018 నుంచి ఈ వైద్యుడి దగ్గరికి ఓ మహిళ తన శస్త్రచికిత్సకు సంబంధించి తరచూ ఆరోగ్య పరీక్షలకు వస్తుండేవారు. ఆమె ద్వారా తాంత్రికుడి పేరుతో చలామణి అవుతున్న ఇస్లాముద్దీన్ అనే మరో వ్యక్తి కూడా వైద్యుడికి పరిచయం అయ్యాడు. తనకు తాంత్రిక శక్తులు ఉన్నట్లు అతను వైద్యుడిని నమ్మించాడు. తన వద్ద అలాద్దీన్ దీపం ఉందని.. దాని నుంచి బయటికి వచ్చే భూతం అద్భుతాలు చేస్తుంటుందని వైద్యుడికి వివరించారు. అప్పుడప్పుడు భూతం ఆకారాన్ని సైతం ఇస్లాముద్దిన్ వైద్యుడికి చూపించాడు.
ఈ దీపం దగ్గర ఉంటే కోటీశ్వరుడివి అవుతావని చెప్పి వైద్యుడికి దాన్ని రూ. 2.5 కోట్లకు విక్రయించాడు. ఈ డబ్బు మొత్తాన్ని వాయిదాల పద్ధతిలో చెల్లించిన వైద్యుడు ఆ దీపాన్ని తన ఇంటికి తీసుకెళ్తానని అడిగిన ప్రతిసారీ వాళ్లు అతడిని భయపెట్టేవాళ్లు. దీని నుంచి వచ్చే భూతం వల్ల చెడు జరుగుతుందని వైద్యుడిని చాలా సార్లు నమ్మించారు. దీంతో మోసపోయానని గ్రహించిన వైద్యుడు జిల్లా ఎస్పీని ఆశ్రయించాడు. ఇస్లాముద్దిన్ అతని స్నేహితుడిపై కేసు నమోదు చేసిన పోలీసులు వాళ్లిద్దరినీ అరెస్టు చేశారు. భూతం ఆకారంలో కనిపించిన వ్యక్తి వైద్యుని వద్దకు ఆరోగ్య పరీక్షలకు వచ్చే మహిళ భర్తగా గుర్తించారు. వాళ్లను సైతం అదుపులోకి తీసుకునే పనిలో ఉన్నట్లు పోలీసులు వివరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పది కిలోల బంగారం స్వాధీనం
ఎన్నికల వేళ విజయనగరం జిల్లాలో భారీగా బంగారం పట్టుబడింది. -
పిఠాపురంలో రూ.80లక్షల విలువైన మద్యం పట్టివేత
సార్వత్రిక ఎన్నికల వేళ తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో మద్యం ఏరులై పారుతోంది. -
అలెన్ హెర్బల్ కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం
రంగారెడ్డి జిల్లా నందిగామ మండలంలోని అలెన్ హెర్బల్ కంపెనీలో శుక్రవారం సాయంత్రం భారీ అగ్ని ప్రమాదం జరిగింది. -
ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుల బెయిల్ పిటిషన్లపై తీర్పు
రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో ముగ్గురు నిందితులకు బెయిల్ ఇచ్చేందుకు నాంపల్లి కోర్టు నిరాకరించింది. -
బాలుడి పొట్టలోకి గాలికొట్టిన ఆకతాయి
ఓ ఆకతాయి వికృత చేష్టలకు గురైన బాలుడు తీవ్ర అస్వస్థతతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. పోలీసుల కథనం.. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం అనికేపల్లికి చెందిన బాలుడు(12) బుధవారం సాయంత్రం తోటి పిల్లలతో కలిసి వాలీబాల్ ఆడుతుండగా బంతిలో గాలి తగ్గింది. -
ఉపాధి లేక ఇద్దరు నేత కార్మికుల ఆత్మహత్య
రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉపాధి లేక ఇద్దరు నేత కార్మికులు ఆత్మహత్య చేసుకున్న ఘటన గురువారం చోటుచేసుకుంది. -
ఆగి ఉన్న లారీని ఢీకొని.. కారుకు మంటలు
ఆగి ఉన్న లారీని వెనక నుంచి ఢీకొనడంతో కారులో మంటలు వ్యాపించి యువ వ్యాపారి సజీవ దహనమయ్యాడు. -
పుట్టెడు దుఃఖం మిగిల్చిన పుట్టెంట్రుకల వేడుక
బావ, బావమరుదుల కుటుంబాల్లోని పది మంది పుట్టెంట్రుకల వేడుక కోసం ఆనందంగా బయల్దేరారు. రోడ్డు ప్రమాదం మధ్యలోనే వారి సంతోషాన్ని చిదిమేసింది. -
విద్యుదాఘాతంతో కౌలు రైతు మృతి
పొలంలో తెగిపడిన విద్యుత్ తీగ తగిలి కౌలు రైతు అక్కడికక్కడే మృతిచెందిన ఘటన జగిత్యాల జిల్లాలో గురువారం ఉదయం చోటు చేసుకుంది. -
రోడ్డు ప్రమాదాల్లో ఐదుగురి దుర్మరణం
కుమురం భీం, నిజామాబాద్ జిల్లాల్లో గురువారం రాత్రి జరిగిన రెండు ప్రమాదాల్లో ఐదుగురు మృతిచెందారు. మొత్తం 17 మంది గాయపడ్డారు. -
ఐదుగురు ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్య
రాష్ట్రంలోని వేర్వేరు జిల్లాలకు చెందిన ఐదుగురు ఇంటర్ విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. -
హోటల్లో భారీ అగ్నిప్రమాదం.. ఆరుగురి సజీవ దహనం
బిహార్ రాజధాని పట్నాలో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. స్థానిక రైల్వేస్టేషన్ సమీపంలోని ఓ హోటల్లో భారీ ఎత్తున మంటలు చెలరేగి ఆరుగురు సజీవ దహనమయ్యారు. -
45 కిలోమీటర్లు.. 1400 సీసీ కెమెరాల జల్లెడ
అర్ధరాత్రి తర్వాత మహిళపై సామూహిక అత్యాచారం.. ఆపై హత్య.. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులకు సీసీ కెమెరాల్లో ఇద్దరూ పరారయ్యే అస్పష్ట చిత్రాలు తప్ప ఒక్క ఆధారం లభించలేదు. -
సల్మాన్ ఇంటివద్ద కాల్పులు.. పంజాబ్లో మరో ఇద్దరు నిందితుల అరెస్టు
బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ఇంటి ముందు జరిగిన కాల్పుల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. -
పోలీసుస్టేషన్ ఆవరణలోనే తెదేపా కార్యకర్తపై దాడి
పోలీసు స్టేషన్ ఆవరణలో వైకాపా నాయకులు హల్చల్ చేశారు. పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం పొందుగల గ్రామానికి చెందిన కొందరు వైకాపా నాయకులు తెదేపా కార్యకర్త యూసఫ్పై స్టేషన్ ఆవరణలోనే దాడి చేశారు. -
వైకాపా నాయకుడి బార్లో.. రూ.1.30 కోట్ల మద్యం స్వాధీనం
శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా అల్లూరులో సెబ్ అధికారులు భారీగా మద్యం స్వాధీనం చేసుకున్నారు. -
గులకరాయి కేసులో నిందితుడిని కస్టడీకి తీసుకున్న పోలీసులు
గులకరాయి కేసులో నిందితుడు సతీష్కుమార్ను పోలీసులు తమ కస్టడీకి తీసుకున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్
-
పది కిలోల బంగారం స్వాధీనం
-
భారత్ ఎన్నికల వేళ పాకిస్థాన్ అక్కసు.. ప్రసంగాల్లో వాళ్లపేరు లాగొద్దట!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
మహేశ్ బాబు, మమ్ముట్టి, షారుక్లతో సినిమా.. నెల్సన్ ప్లాన్ ఇదే..