Shraddha Murder: శ్రద్ధా వాకర్ హత్య.. ఐదు రకాల ఆయుధాలతో నరికేశాడు
స్నేహితుడిని కలిసేందుకు వెళ్లిందన్న కోపంతోనే కాల్సెంటర్ ఉద్యోగిని శ్రద్ధా వాకర్ను ఆమె సహభాగస్వామి హత్య చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ మేరకు 6,629 పేజీల అభియోగ పత్రాన్ని సాకేత్ కోర్టుకు సమర్పించారు.
దిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కాల్సెంటర్ ఉద్యోగి శ్రద్ధా వాకర్ (Shraddha Walkar) హత్య కేసులో దిల్లీ (Delhi) పోలీసులు మంగళవారం ఛార్జిషీట్ దాఖలు చేశారు. స్నేహితుడ్ని కలవడానికి వెళ్లిందనే కోపంతోనే నిందితుడు ఆఫ్తాబ్ పూనావాలా (Aaftab Poonawala) ఆమెను హత్య చేసినట్లు ఛార్జిషీట్లో పేర్కొన్నారు. ఈ మేరకు 6,629 పేజీల అభియోగ పత్రాన్ని సాకేత్ కోర్టుకు సమర్పించారు. దాదాపు 150 మంది సాక్షుల నుంచి సేకరించిన వివరాలను పేర్కొన్నారు. శ్రద్ధా వాకర్ హత్యకు నిందితుడు ఐదు రకాల పదునైన ఆయుధాలను వినియోగించాడని, హత్య చేసిన తర్వాత రంపంతో మృతదేహాన్ని ముక్కలుగా కోసి గురుగ్రామ్, దక్షిణ దిల్లీలోని డంపింగ్ యార్డు ప్రాంతాల్లో విసిరేశాడని పోలీసులు ఛార్జిషీట్లో తెలిపారు.
‘‘ ఆమె స్నేహితుడ్ని కలవడానికి వెళ్లడం నిందితుడికి నచ్చలేదు. ఆ విషయాన్ని అతడు జీర్ణించుకోలేకపోయాడు. దీంతో ఆగ్రహానికి గురై శ్రద్ధా వాకర్ను హత్య చేశాడు’’ అని అదనపు పోలీస్ కమిషనర్ మీను చౌదరి తెలిపారు. ఈ కేసును ఛేదించడానికి తొమ్మిది ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. దర్యాప్తులో భాగంగా సాక్ష్యాల కోసం కొన్ని బృందాలను హరియాణా, హిమాచల్ ప్రదేశ్, మహారాష్ట్రకు కూడా పంపించామన్నారు. శ్రద్ధా వాకర్ శరీర భాగాలను గుర్తించేందుకు చాలా సమయం పట్టిందని, దీనికోసం అధునాతన సాంకేతికతను వినియోగించామన్నారు. శ్రద్ధాను ఆమె సహజీవన భాగస్వామి ఆఫ్తాబ్ దారుణంగా చంపి, మృతదేహాన్ని రంపంతో ముక్కలుగా కోసి శరీర భాగాలను దిల్లీ చుట్టుపక్కల పడేసిన ఘటన సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ కేసులో పోలీసులు ఇప్పటికే కీలక ఆధారాలను స్వాధీనం చేసుకున్నారు. ఫోరెన్సిక్, ఎలక్ట్రానిక్ ఆధారాలు, వంద మంది సాక్షుల వాంగ్మూలాలను నమోదు చేశారు. నిందితుడు ఆఫ్తాబ్ నేరాంగీకార వాంగ్మూలం, నార్కో పరీక్షల నివేదికను జత చేసి ఈ ఛార్జిషీట్ను న్యాయస్థానానికి సమర్పించారు.
కొలిక్కి వచ్చినట్లేనా..?
ఈ హత్య కేసులో విచారణ ఓ కొలిక్కి వచ్చినట్లే కన్పిస్తోంది. ఆఫ్తాబ్ నుంచి సేకరించిన సమాచారం మేరకు పోలీసులు దక్షిణ దిల్లీలోని పలు చోట్ల నుంచి ఇప్పటికే 13 మానవ ఎముకలను స్వాధీనం చేసుకున్నారు. వాటి డీఎన్ఏ శ్రద్ధా తండ్రి డీఎన్ఏతో సరిపోలింది. దీంతో శ్రద్ధా హత్యకు గురైందన్న విషయాన్ని పోలీసులు నిర్ధారించారు. తానే ఈ నేరానికి పాల్పడినట్లు నిందితుడు ఇప్పటికే అంగీకరించాడు. దీంతో ఈ కేసులో కోర్టు తీర్పు ఎలా ఇవ్వనుందనేది ఆసక్తికరంగా మారింది. మరోవైపు, నిందితుడు ఆఫ్తాబ్ జ్యుడీషియల్ కస్టడీ నేటితో ముగియడంతో పోలీసులు అతడిని కోర్టు ఎదుట హాజరుపర్చారు. అయితే అతడి కస్టడీని న్యాయస్థానం ఫిబ్రవరి 7వ తేదీ వరకు పొడిగించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బాలుడి పొట్టలోకి గాలికొట్టిన ఆకతాయి
ఓ ఆకతాయి వికృత చేష్టలకు గురైన బాలుడు తీవ్ర అస్వస్థతతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. పోలీసుల కథనం.. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం అనికేపల్లికి చెందిన బాలుడు(12) బుధవారం సాయంత్రం తోటి పిల్లలతో కలిసి వాలీబాల్ ఆడుతుండగా బంతిలో గాలి తగ్గింది. -
ఉపాధి లేక ఇద్దరు నేత కార్మికుల ఆత్మహత్య
రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉపాధి లేక ఇద్దరు నేత కార్మికులు ఆత్మహత్య చేసుకున్న ఘటన గురువారం చోటుచేసుకుంది. -
ఆగి ఉన్న లారీని ఢీకొని.. కారుకు మంటలు
ఆగి ఉన్న లారీని వెనక నుంచి ఢీకొనడంతో కారులో మంటలు వ్యాపించి యువ వ్యాపారి సజీవ దహనమయ్యాడు. -
పుట్టెడు దుఃఖం మిగిల్చిన పుట్టెంట్రుకల వేడుక
బావ, బావమరుదుల కుటుంబాల్లోని పది మంది పుట్టెంట్రుకల వేడుక కోసం ఆనందంగా బయల్దేరారు. రోడ్డు ప్రమాదం మధ్యలోనే వారి సంతోషాన్ని చిదిమేసింది. -
విద్యుదాఘాతంతో కౌలు రైతు మృతి
పొలంలో తెగిపడిన విద్యుత్ తీగ తగిలి కౌలు రైతు అక్కడికక్కడే మృతిచెందిన ఘటన జగిత్యాల జిల్లాలో గురువారం ఉదయం చోటు చేసుకుంది. -
రోడ్డు ప్రమాదాల్లో ఐదుగురి దుర్మరణం
కుమురం భీం, నిజామాబాద్ జిల్లాల్లో గురువారం రాత్రి జరిగిన రెండు ప్రమాదాల్లో ఐదుగురు మృతిచెందారు. మొత్తం 17 మంది గాయపడ్డారు. -
ఐదుగురు ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్య
రాష్ట్రంలోని వేర్వేరు జిల్లాలకు చెందిన ఐదుగురు ఇంటర్ విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. -
హోటల్లో భారీ అగ్నిప్రమాదం.. ఆరుగురి సజీవ దహనం
బిహార్ రాజధాని పట్నాలో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. స్థానిక రైల్వేస్టేషన్ సమీపంలోని ఓ హోటల్లో భారీ ఎత్తున మంటలు చెలరేగి ఆరుగురు సజీవ దహనమయ్యారు. -
45 కిలోమీటర్లు.. 1400 సీసీ కెమెరాల జల్లెడ
అర్ధరాత్రి తర్వాత మహిళపై సామూహిక అత్యాచారం.. ఆపై హత్య.. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులకు సీసీ కెమెరాల్లో ఇద్దరూ పరారయ్యే అస్పష్ట చిత్రాలు తప్ప ఒక్క ఆధారం లభించలేదు. -
సల్మాన్ ఇంటివద్ద కాల్పులు.. పంజాబ్లో మరో ఇద్దరు నిందితుల అరెస్టు
బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ఇంటి ముందు జరిగిన కాల్పుల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. -
పోలీసుస్టేషన్ ఆవరణలోనే తెదేపా కార్యకర్తపై దాడి
పోలీసు స్టేషన్ ఆవరణలో వైకాపా నాయకులు హల్చల్ చేశారు. పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం పొందుగల గ్రామానికి చెందిన కొందరు వైకాపా నాయకులు తెదేపా కార్యకర్త యూసఫ్పై స్టేషన్ ఆవరణలోనే దాడి చేశారు. -
వైకాపా నాయకుడి బార్లో.. రూ.1.30 కోట్ల మద్యం స్వాధీనం
శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా అల్లూరులో సెబ్ అధికారులు భారీగా మద్యం స్వాధీనం చేసుకున్నారు. -
గులకరాయి కేసులో నిందితుడిని కస్టడీకి తీసుకున్న పోలీసులు
గులకరాయి కేసులో నిందితుడు సతీష్కుమార్ను పోలీసులు తమ కస్టడీకి తీసుకున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
‘వీవీప్యాట్ల’పై సుప్రీం తీర్పు.. విపక్షాలకు గట్టి చెంపదెబ్బ: మోదీ
-
అవసరమైతే తప్ప బయటకు రావొద్దు: వాతావరణశాఖ
-
‘నోటా’కు ఎక్కువ ఓట్లు వస్తే..? ఈసీకి సుప్రీం కోర్టు నోటీసులు
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా
-
ఐపీఓకు స్విగ్గీ రెడీ.. సెబీ రహస్య మార్గంలో దరఖాస్తు
-
ఆ సమయంలో అతడు ఒక్క బౌండరీ కొట్టలేదు : విరాట్ స్ట్రైక్రేట్పై గావస్కర్