Crime News: షాకింగ్‌! ఆసుపత్రిలో శిశువును ఎత్తుకెళ్లిన శునకాలు.. ఆపై విషాదం!

హరియాణాలోని పానిపట్‌లో ఒళ్లు గగుర్పాటుకు గురిచేసే ఘటన జరిగింది. ప్రసూతి ఆసుపత్రిలోకి దూరిన శునకాలు.......

Published : 29 Jun 2022 02:48 IST

చండీగఢ్‌: హరియాణాలోని పానిపట్‌లో ఒళ్లు గగుర్పాటుకు గురిచేసే ఘటన జరిగింది. ప్రసూతి ఆసుపత్రిలోకి ప్రవేశించిన శునకాలు.. బెడ్‌పై ఉన్న మూడు నెలల శిశువును ఎత్తుకెళ్లాయి. కాగా ఆ శిశువు తీవ్ర గాయాలతో మృతి చెందింది. పానిపట్‌లోని ఓ ప్రైవేటు ప్రసూతి ఆసుపత్రిలో షబ్నం అనే మహిళ మూడు రోజుల క్రితం శిశువుకు జన్మనిచ్చింది. అయితే సోమవారం రాత్రి అందరూ నిద్రిస్తుండగా.. ఆసుపత్రిలోకి ప్రవేశించిన కొన్ని శునకాలు ఆ తల్లి పక్కన ఉన్న శిశువును నోటకరుచుకొని వెళ్లాయి. ఆ సమయంలో తల్లి షబ్నం సహా ఇద్దరు బంధువులు నిద్రలో ఉన్నారు.

రాత్రి 2.15గంటల సమయంలో తల్లి లేచి చూడగా బిడ్డ కనిపించలేదు. విషయాన్ని వెంటనే ఆసుపత్రి యాజమాన్యానికి తెలియజేశారు. ఆపై ఆసుపత్రి సిబ్బంది, శిశువు బంధువులు చుట్టుపక్కల ప్రాంతంలో వెతికారు. అయితే హాస్పిటల్‌ సమీపంలో ఉన్న ఓ ప్రాంతంలో ఓ కుక్క శిశువును నోట కరుచుకొని ఉండటాన్ని గుర్తించారు. వెంటనే శిశువును ఆసుపత్రికి తీసుకురాగా.. అప్పటికే గాయాలతో మృతిచెందినట్లు వైద్యులు తేల్చారు. ఆసుపత్రి యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగానే ఈ దారుణం జరిగిందని బాధిత కుటుంబం పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని