Asifabad: వార్ద నదిలో గల్లంతైన నలుగురి యువకుల మృతి

వార్ద నదిలో సోమవారం ఉదయం గల్లంతైన నలుగురు యువకులు మృతి చెందారు. విస్త్రృత గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు, స్థానికులు వారి మృతదేహాలను వెలికి తీశారు.

Published : 25 Mar 2024 18:13 IST

ఆసిఫాబాద్‌: వార్ద నదిలో సోమవారం ఉదయం గల్లంతైన నలుగురు యువకులు మృతి చెందారు. విస్త్రృత గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు, స్థానికులు వారి మృతదేహాలను వెలికి తీశారు. మృతులను నదీమాబాద్‌కు చెందిన సంతోష్‌ (25), కమలాకర్‌ (24), ప్రవీణ్‌ (23), సాయి (23)గా గుర్తించారు. ఆసిఫాబాద్‌ జిల్లా కౌటాల మండలం తాటిపల్లి వద్ద నదిలో నలుగురు యువకులు గల్లంతైన సంగతి తెలిసిందే. హోలీ ఆడిన తర్వాత నదిలో స్నానానికి వెళ్లి ప్రమాదం బారిన పడ్డారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని