కాపాడమంటే.. పోలీసులే కాటేశారు
న్యాయం కోసం పోలీసుస్టేషన్కు వచ్చిన తల్లి, కుమార్తెల పట్ల అనుచిత ప్రవర్తనకు పాల్పడిన ఘటనలో బాధ్యులైన పోలీసులపై ఉన్నతాధికారులు కొరడా ఝుళిపించారు. అరండల్పేట ఎస్సై, కానిస్టేబుళ్లను సస్పెండ్ చేయడంతోపాటు డీఎస్పీ, సీఐలకు ఛార్జి మెమోలు జారీ చేస్తూ గురువారం ఐజీ వినీత్బ్రిజ్లాల్, అర్బన్ ఎస్పీ పీహెచ్డీ రామకృష్ణలు ఉత్తర్వులు జారీ చేశారు.
ఎస్సై, కానిస్టేబుళ్ల సస్పెన్షన్
డీఎస్పీ, సీఐలకు ఛార్జి మెమోలు
గుంటూరు నేరవార్తలు, న్యూస్టుడే
న్యాయం కోసం పోలీసుస్టేషన్కు వచ్చిన తల్లి, కుమార్తెల పట్ల అనుచిత ప్రవర్తనకు పాల్పడిన ఘటనలో బాధ్యులైన పోలీసులపై ఉన్నతాధికారులు కొరడా ఝుళిపించారు. అరండల్పేట ఎస్సై, కానిస్టేబుళ్లను సస్పెండ్ చేయడంతోపాటు డీఎస్పీ, సీఐలకు ఛార్జి మెమోలు జారీ చేస్తూ గురువారం ఐజీ వినీత్బ్రిజ్లాల్, అర్బన్ ఎస్పీ పీహెచ్డీ రామకృష్ణలు ఉత్తర్వులు జారీ చేశారు.
పోలీసులు, బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం నగరానికి చెందిన 18 ఏళ్ల యువతికి నగరానికే చెందిన యువకుడు ప్రేమపేరుతో దగ్గరయ్యాడు. ఆ తర్వాత పెళ్లిచేసుకోనంటూ ముఖం చాటేశాడు. ఆ యువతి తండ్రి చనిపోయాడు. తల్లితో కలిసి నివసిస్తోంది. ప్రేమికుడు మోసగించడంతో తనకు న్యాయం చేయాలంటూ యువతి తన తల్లిని తీసుకొని అరండల్పేట పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఈక్రమంలో స్టేషన్ ఎస్సై బాలకృష్ణ ఆ యువతికి మాయమాటలు చెప్పి తాను న్యాయం చేస్తానంటూ నమ్మించాడు. గత నెల 31న ఆ యువతి ఇంటికి వెళ్లి అసభ్యంగా ప్రవర్తించాడని ఫిర్యాదు చేసింది. అదే పోలీసుస్టేషన్లో పనిచేస్తున్న కానిస్టేబుల్ రాము ఆ యువతి తల్లి పట్ల అసభ్యంగా మాట్లాడుతూ అనుచితంగా ప్రవర్తించారని వాపోయింది. ఈ ఘటనపై ఈనెల 27న తల్లీకుమార్తెలు అర్బన్ ఎస్పీ కార్యాలయం స్పందనలో ఫిర్యాదు చేశారు. ఈ ఘటనను అర్బన్ ఎస్పీ రామకృష్ణ సీరియస్గా తీసుకున్నారు.
డీఎస్పీ విచారణలో విస్తుగొలిపే వాస్తవాలు!: ఫిర్యాదుపై ప్రత్యేక దర్యాప్తు నిర్వహించాలని తూర్పు డీఎస్పీ కె.సుప్రజను అర్బన్ ఎస్పీ రామకృష్ణ ఆదేశించారు. వెంటనే డీఎస్పీ సదరు బాధిత యువతిని, ఆమె తల్లిని పిలిపించి లోతుగా దర్యాప్తు చేయగా విస్తుగొలిపే వాస్తవాలు వెలుగుచూశాయి. విశ్వసనీయ సమాచారం మేరకు సదరు ఎస్సై తాము ఇద్దరం ఒకే సామాజిక వర్గానికి చెందిన వాళ్లం...నీకు నేను న్యాయం చేస్తానంటూ నమ్మించాడని యువతి తెలిపింది. తన చరవాణి నంబర్ తీసుకొని వాట్సప్ ఛాటింగ్ చేశాడని పేర్కొంది. ఎస్సై పరిచయమైనప్పటి నుంచి అతను మాట్లాడిన సంభాషణలు, సందేశాలను భద్రపరచుకున్నట్లు తెలిపింది. ఓ రోజు తన తల్లిని కానిస్టేబుల్ లాడ్జికి వెళదామా అంటూ అడిగాడని చెప్పింది. డిసెంబర్ 31వ తేదీ రాత్రి ఎస్సై బాలకృష్ణ తన ఇంటికి వచ్చి అసభ్యంగా ప్రవర్తించాడని తెలిపినట్లు తెలిసింది. జరిగిన ఘటనపై అధికారులకు ఫిర్యాదు చేస్తానని భావించిన ఎస్సై తన చరవాణిలో భద్రపరచుకున్న అతని సంబాషణలు, ఛాటింగ్లను ఓ కానిస్టేబుల్ ద్వారా తొలగించాడని వాపోయింది. అప్పటికి తాను కొన్ని వాట్సప్ సందేశాలను వేరే ఫోల్డర్లో భద్రపరచుకున్నానని వాటిని డీఎస్పీకి చూపించినట్లు తెలిసింది.
రాజీ కుదుర్చే యత్నం!: యువతి ఫిర్యాదుపై డీఎస్పీ సుప్రజ ప్రత్యేక దర్యాప్తు చేస్తున్న క్రమంలో ఆరోపణలు ఎదుర్కొన్న పోలీసులు రాజీ కుదిర్చేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేసినట్లు తెలిసింది. ఫిర్యాదు వెనక్కి తీసుకోవాలని, తాము ఎలాంటి తప్పు చేయలేదని ప్రత్యేక దర్యాప్తు అధికారి ముందు చెప్పాలని, అందుకు తగిన ప్రతిఫలం ముట్టచెబుతామంటూ బాధిత యువతితో బేరాలు సాగించినట్లు తెలిసింది. అదే పోలీసుస్టేషన్లో పనిచేస్తున్న ఓ కానిస్టేబుల్ మధ్యవర్తిత్వం వహించినట్లు సమాచారం. బాధితురాలితో రాజీకి యత్నిస్తున్నారనే అంశాలను డీఎస్పీ పసిగట్టి ఎస్పీ దృష్టికి తీసుకు వెళ్లారు. ప్రత్యేక అధికారిగా డీఎస్పీ సుప్రజ నిష్పక్షపాతంగా దర్యాప్తు చేసి నివేదికలను గుంటూరు రేంజ్ ఐజీ వినీత్బ్రిజ్లాల్కు, అర్బన్ ఎస్పీ రామకృష్ణకు అందజేశారు.
మహిళల పట్ల అనుచితంగా ప్రవర్తిస్తే ఉపేక్షించం
యువతి, ఆమె తల్లి పట్ల అనుచితంగా ప్రవర్తించినట్లు ప్రాథమిక విచారణలో తేలడంతో ఎస్సై జి.బాలకృష్ణ, కానిస్టేబుల్ సీహెచ్ రాములను సస్పెండ్ చేశాం. ఈ కేసు విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన పశ్చిమ డీఎస్పీ బీవీ రామారావు, అరండల్పేట సీఐ బి. శ్రీనివాసరావులకు ఛార్జి మెమోలు ఇచ్చాం. చట్టవిరుద్ధమైన పనులు చేసిన కానిస్టేబుల్ హనుమంతురావును అర్బన్ ఎస్పీ రామకృష్ణ సస్పెండ్ చేశారు. పోలీసుశాఖలోని వాళ్లు అవినీతికి పాల్పడినా, మహిళల పట్ల అనుచితంగా ప్రవర్తించినా ఉపేక్షించం. వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటాం.
యువకుడిపై కేసు నమోదు
ఈ యువతిని ప్రేమపేరుతో మోసగించిన నగరానికి చెందిన డేవిడ్పై అరండల్పేట పోలీసులు కేసు నమోదు చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మైనింగ్ సొమ్ము మింగేశారు
గనులశాఖలో ఇంటి దొంగలు రూ.5 కోట్ల సొమ్మును దారి మళ్లించి, వాడేసుకున్నారు. లీజుల ఈ-వేలంలో పాల్గొన్న వారికి... సెక్యూరిటీ డిపాజిట్ను వెనక్కి ఇవ్వకుండా వేరొక ఖాతాలో జమ చేయించి, వాడేసుకున్నట్లు తెలిసింది. -
ఆన్లైన్ జూదంలో అప్పులపాలు.. సాఫ్ట్వేర్ ఇంజినీరు ఆత్మహత్మ
ఆన్లైన్ గేములతో డబ్బులు కోల్పోయిన ఓ యువ సాఫ్ట్వేరు ఇంజినీరు మనోవేదనతో బలవన్మరణానికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. -
కల్వకుర్తి ఎమ్మెల్యే కారును ఢీ కొట్టిన ద్విచక్రవాహనం
కల్వకుర్తి కాంగ్రెస్ ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి ప్రయాణిస్తున్న కారును.. ద్విచక్ర వాహనం ఢీకొన్న ఘటనలో ఇద్దరు యువకులు మృతి చెందారు. ఎమ్మెల్యేకు స్వల్ప గాయాలయ్యాయి. -
వేసవి సెలవుల్లో విషాదం... క్రికెట్ బాల్ తగిలి బాలుడి మృతి
వేసవి సెలవుల్లో క్రికెట్ ఆడుతుండగా బంతి మర్మావయవాలకు తగలడంతో 11 ఏళ్ల బాలుడు ప్రాణాలు కోల్పోయిన ఘటన పుణెలోని లోహెగావ్ ప్రాంతంలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. లోహెగావ్కు చెందిన శంభు కాళిదాస్ ఖాండ్వే అలియాస్ శౌర్య తన స్నేహితులతో కలిసి క్రికెట్ ఆడటానికి వెళ్లాడు. -
షెల్ కంపెనీలు.. షేర్ల పేరిట మోసాలు
భారతీయుల్ని లక్ష్యంగా చేసుకొని దుబాయ్ కేంద్రంగా సైబర్ నేరాలకు పాల్పడుతున్న ముఠా గుట్టును హైదరాబాద్ పోలీసులు రట్టు చేశారు. స్టాక్ మార్కెట్లో పెట్టుబడులకు సంబంధించి సలహాలిస్తామంటూ దేశవ్యాప్తంగా 507 నేరాలకు పాల్పడిన ముఠాకు చెందిన ఇద్దరిని అరెస్ట్ చేశారు. -
ఆస్ట్రేలియాలో కత్తితో దాడి.. హరియాణా యువకుడి మృతి
ఆస్ట్రేలియాలో కత్తిపోటుకు గురై భారత్కు చెందిన ఎంటెక్ విద్యార్థి నవజీత్ సంధు (22) మృతిచెందాడు. ఇతడు హరియాణాలోని కర్నాల్ ప్రాంతానికి చెందినవాడు. మెల్బోర్న్లో శనివారం రాత్రి జరిగిన ఈ ఘటనలో మరో విద్యార్థి తీవ్రంగా గాయపడ్డాడు. -
గడ్చిరోలిలో మావోయిస్టుల కుట్ర భగ్నం
లోక్సభ ఎన్నికల సమయంలో మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో మావోయిస్టులు ఐఈడీ పేలుళ్లకు కుట్ర పన్నగా దానిని భగ్నం చేసినట్లు పోలీసులు సోమవారం తెలిపారు. వారి వివరాల ప్రకారం.. స్థానిక తిపగడ్ ప్రాంతంలో మావోయిస్టులు పలు పేలుడు పదార్థాలను అమర్చినట్లు పోలీసులకు ఆదివారం సమాచారం అందింది. -
సముద్రంలో చిక్కుకుని ఐదుగురు వైద్య విద్యార్థుల మృతి
సముద్రంలో చిక్కుకుని ఐదుగురు వైద్య విద్యార్థులు మృతి చెందిన విషాద ఘటన తమిళనాడు రాష్ట్రంలోని లేమూర్లో చోటుచేసుకుంది. -
బంతి అనుకొని బాంబును తన్నిన బాలుడు
పశ్చిమబెంగాల్లో ఆడుకొంటున్న పిల్లలు బంతి అనుకొని నాటుబాంబును కాలితో తన్నగా.. అది కాస్తా పేలి 11 ఏళ్ల బాలుడు మరణించాడు. మరో ఇద్దరు బాలురకు గాయలయ్యాయి. -
నీట్ బాగా రాయలేదని విద్యార్థి ఆత్మహత్య
నీట్ బాగా రాయలేదని ఓ విద్యార్థి ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని గలియాబాయి తండాలో చోటు చేసుకుంది. -
ఇంటర్లో తప్పడంతో కుమార్తె ఆత్మహత్యాయత్నం.. ఆమె చనిపోతుందనే బాధతో తండ్రి బలవన్మరణం
ఇంటర్లో ఫెయిలయ్యానన్న బాధతో కుమార్తె ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా..ఆమె బతుకుతుందో లేదోనన్న ఆవేదనతో తండ్రి బలవన్మరణానికి పాల్పడిన ఘటన హనుమకొండ జిల్లా నడికూడ మండలం రామకృష్ణాపూర్లో సోమవారం జరిగింది. -
విదేశీ నేరస్థులకు బ్యాంకు ఖాతాల విక్రయం
-
ప్రైవేట్ పార్ట్కు బాల్ తగలడంతో బాలుడి మృతి
క్రికెట్ ఆడుతుండగా బాల్ ప్రైవేట్ పార్ట్కు తగలడంతో ఓ బాలుడు మృతి చెందాడు.
తాజా వార్తలు (Latest News)
-
రోహిత్ శర్మను వరల్డ్ కప్ ట్రోఫీతో చూడాలని ఉంది: యువరాజ్ సింగ్
-
బెయిలిస్తే.. సీఎం విధులు నిర్వర్తించొద్దు: కేజ్రీవాల్ కేసులో సుప్రీం
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
ఆ లెక్కలు నాకు తెలియదు.. అతడు మా జట్టులో ఉండటం అదృష్టం: హార్దిక్ పాండ్య
-
సిద్ధార్థ్ వల్లే ప్రేమపై నమ్మకం పెరిగింది: అదితి రావ్
-
ఇజ్రాయెల్ ఆధీనంలో రఫా క్రాసింగ్