ఆ కేసులో సాక్ష్యం ఖరీదు రూ.7.5 కోట్లు
మహారాష్ట్రలో హత్యకు గురైన అభ్యుదయవాది నరేంద్ర దబోల్కర్ కేసులో ఉపయోగించిన ఆయుధాన్ని థానే సమీపంలోని సముద్రంలో 40 అడుగుల లోతు నుంచి వెలికితీసినట్లు సీబీఐ అధికారులు.....
ముంబయి: మహారాష్ట్రలో హత్యకు గురైన హేతువాది నరేంద్ర దభోల్కర్ కేసులో ఉపయోగించిన ఆయుధాన్ని థానే సమీపంలోని సముద్రంలోని ఇసుక పొరల్లో 40 అడుగుల లోతు నుంచి వెలికితీసినట్లు సీబీఐ అధికారులు వెల్లడించారు. ఇందుకోసం సుమారుగా రూ.7.5 కోట్లు ఖర్చుచేసినట్లు తెలిపారు. ఈ మొత్తాన్ని మహారాష్ట్ర, కర్ణాటక ప్రభుత్వాలు భరించనున్నాయి. నరేంద్ర దభోల్కర్ సహా హేతువాదులు గోవింద్ పన్సారే, ఎమ్ ఎమ్ కలబురిగి, గౌరీ లంకేశ్లు ఒకే రీతిలో హత్యలకు గురైన విషయం తెలిసిందే. వీరిలో దభోల్కర్ కేసును సీబీఐ విచారిస్తుండగా, పన్సారే, కలబురిగి, గౌరీ లంకేశ్ కేసులను కర్ణాటక పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దభోల్కర్ కేసులో అరెస్టయిన శరద్ కలాస్కర్ అనే షూటర్ హత్యకు ఉపయోగించిన ఆయుధాలను సముద్రంలోకి విసిరేసినట్లు తెలపడంతో సీబీఐ అధికారులు వాటిని వెలికితీసే ప్రక్రియను ప్రారంభించారు.
ఇందుకోసం దుబాయ్ కేంద్రంగా పనిచేస్తున్న ఎన్విటెక్ మెరైన్ కన్సల్టెంట్స్ అనే సంస్థ సహాయం తీసుకున్నారు. దీనిగాను ఆ సంస్థకు రూ.7.5 కోట్లు చెల్లించనున్నారు. ఇందులో భాగంగా ఎన్విటెక్ సంస్థ సౌండ్ నావిగేషన్, రేంజింగ్ సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో సముద్రం లోపల ఉన్న తుపాకీని గుర్తించి, క్రేన్ సహాయంతో ఇసుక పైపొరను తొలగించారు. తర్వాత ఉక్రెయిన్కు చెందిన నిపుణులైన డైవర్లు సముద్రంలో 40 అడుగుల లోతులోకి దిగి తుపాకీని బయటకు తీశారని అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఆ తుపాకీ హత్య కేసులో కీలక సాక్ష్యంగా మారనుంది. దాన్ని మరిన్ని పరీక్షల కోసం పంపనున్నారు. వాటి ఫలితాల ఆధారంగా అది దభోల్కర్ హత్యలో ఉపయోగించిందా లేదా అనే విషయం నిర్ధారణ కానుందని సీబీఐ అధికారి ఒకరు తెలిపారు. అంతే కాకుండా మిగిలిన వారి హత్యకు ఉపయోగించిన ఆయుధాలను కూడా నిందితుడు సముద్రంలో విసిరేసినట్లు తెలపడంతో వాటిని కూడా వెలికితీసేందుకు అధికారులు సిద్ధమయ్యారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పిఠాపురంలో రూ.80లక్షల విలువైన మద్యం పట్టివేత
సార్వత్రిక ఎన్నికల వేళ తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో మద్యం ఏరులై పారుతోంది. -
అలెన్ హెర్బల్ కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం
రంగారెడ్డి జిల్లా నందిగామ మండలంలోని అలెన్ హెర్బల్ కంపెనీలో శుక్రవారం సాయంత్రం భారీ అగ్ని ప్రమాదం జరిగింది. -
ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుల బెయిల్ పిటిషన్లపై తీర్పు
రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో ముగ్గురు నిందితులకు బెయిల్ ఇచ్చేందుకు నాంపల్లి కోర్టు నిరాకరించింది. -
బాలుడి పొట్టలోకి గాలికొట్టిన ఆకతాయి
ఓ ఆకతాయి వికృత చేష్టలకు గురైన బాలుడు తీవ్ర అస్వస్థతతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. పోలీసుల కథనం.. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం అనికేపల్లికి చెందిన బాలుడు(12) బుధవారం సాయంత్రం తోటి పిల్లలతో కలిసి వాలీబాల్ ఆడుతుండగా బంతిలో గాలి తగ్గింది. -
ఉపాధి లేక ఇద్దరు నేత కార్మికుల ఆత్మహత్య
రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉపాధి లేక ఇద్దరు నేత కార్మికులు ఆత్మహత్య చేసుకున్న ఘటన గురువారం చోటుచేసుకుంది. -
ఆగి ఉన్న లారీని ఢీకొని.. కారుకు మంటలు
ఆగి ఉన్న లారీని వెనక నుంచి ఢీకొనడంతో కారులో మంటలు వ్యాపించి యువ వ్యాపారి సజీవ దహనమయ్యాడు. -
పుట్టెడు దుఃఖం మిగిల్చిన పుట్టెంట్రుకల వేడుక
బావ, బావమరుదుల కుటుంబాల్లోని పది మంది పుట్టెంట్రుకల వేడుక కోసం ఆనందంగా బయల్దేరారు. రోడ్డు ప్రమాదం మధ్యలోనే వారి సంతోషాన్ని చిదిమేసింది. -
విద్యుదాఘాతంతో కౌలు రైతు మృతి
పొలంలో తెగిపడిన విద్యుత్ తీగ తగిలి కౌలు రైతు అక్కడికక్కడే మృతిచెందిన ఘటన జగిత్యాల జిల్లాలో గురువారం ఉదయం చోటు చేసుకుంది. -
రోడ్డు ప్రమాదాల్లో ఐదుగురి దుర్మరణం
కుమురం భీం, నిజామాబాద్ జిల్లాల్లో గురువారం రాత్రి జరిగిన రెండు ప్రమాదాల్లో ఐదుగురు మృతిచెందారు. మొత్తం 17 మంది గాయపడ్డారు. -
ఐదుగురు ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్య
రాష్ట్రంలోని వేర్వేరు జిల్లాలకు చెందిన ఐదుగురు ఇంటర్ విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. -
హోటల్లో భారీ అగ్నిప్రమాదం.. ఆరుగురి సజీవ దహనం
బిహార్ రాజధాని పట్నాలో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. స్థానిక రైల్వేస్టేషన్ సమీపంలోని ఓ హోటల్లో భారీ ఎత్తున మంటలు చెలరేగి ఆరుగురు సజీవ దహనమయ్యారు. -
45 కిలోమీటర్లు.. 1400 సీసీ కెమెరాల జల్లెడ
అర్ధరాత్రి తర్వాత మహిళపై సామూహిక అత్యాచారం.. ఆపై హత్య.. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులకు సీసీ కెమెరాల్లో ఇద్దరూ పరారయ్యే అస్పష్ట చిత్రాలు తప్ప ఒక్క ఆధారం లభించలేదు. -
సల్మాన్ ఇంటివద్ద కాల్పులు.. పంజాబ్లో మరో ఇద్దరు నిందితుల అరెస్టు
బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ఇంటి ముందు జరిగిన కాల్పుల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. -
పోలీసుస్టేషన్ ఆవరణలోనే తెదేపా కార్యకర్తపై దాడి
పోలీసు స్టేషన్ ఆవరణలో వైకాపా నాయకులు హల్చల్ చేశారు. పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం పొందుగల గ్రామానికి చెందిన కొందరు వైకాపా నాయకులు తెదేపా కార్యకర్త యూసఫ్పై స్టేషన్ ఆవరణలోనే దాడి చేశారు. -
వైకాపా నాయకుడి బార్లో.. రూ.1.30 కోట్ల మద్యం స్వాధీనం
శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా అల్లూరులో సెబ్ అధికారులు భారీగా మద్యం స్వాధీనం చేసుకున్నారు. -
గులకరాయి కేసులో నిందితుడిని కస్టడీకి తీసుకున్న పోలీసులు
గులకరాయి కేసులో నిందితుడు సతీష్కుమార్ను పోలీసులు తమ కస్టడీకి తీసుకున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
టిబెట్ అంశంపై వారితో మాత్రమే చర్చిస్తాం : చైనా
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
పిఠాపురంలో రూ.80లక్షల విలువైన మద్యం పట్టివేత
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బైక్పై స్టంట్లు.. ‘స్పైడర్ మ్యాన్’ను అరెస్ట్ చేసిన పోలీసులు!
-
మాల్దీవుల జలాల్లోకి.. మళ్లీ చైనా పరిశోధక నౌక