పోలీసుల దెబ్బలు తాళలేకే..
ఓ దినసరి కూలీ అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. కాగా పోలీసుల తీవ్రంగా కొట్టడంతోనే తన సహచరుడు మరణించినట్లు అతడు ఆరోపిస్తున్నాడు. దీంతో పోలీసులు..
ఆరోపించిన మృతుడి సహచరుడు
ముంబయి: ఓ దినసరి కూలీ అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. కాగా పోలీసుల తీవ్రంగా కొట్టడంతోనే అతను మరణించినట్లు అతని స్నేహితుడు ఆరోపించాడు. దీంతో పోలీసులు అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మృతుడి సహచరుడి వివరాల ప్రకారం.. ముంబయిలోని డోంగ్రి ప్రాంతానికి చెందిన దినసరి కూలీ సాగిర్ జమిల్ ఖాన్ శనివారం రాత్రి నల్ బజార్ ప్రాంతంలో తోపుడు బండిలో ఓ ఫ్రిజ్ను డెలివరీ చేసేందుకు వెళ్లాడు. తిరిగి వస్తుండగా పూల్వాలీ గల్లీలో నాకాబందీలో ఉన్న పోలీసులు అడ్డగించి లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించాడనే కారణంతో తల, చేతులు, వీపుపై తీవ్రంగా కొట్టినట్లు ఖాన్ తనతో తెలిపినట్లు అతడు విలేకర్లతో వెల్లడించాడు. రాత్రి భోజనం చేసే సమయంలో ఖాన్ అకస్మాత్తుగా కిందపడిపోయాడని, వెంటనే ఆసుపత్రికి తరలించగా అప్పటికే అతడు మృతిచెందినట్లు వైద్యులు వెల్లడించారని వాపోయాడు.
కాగా ఈ విషయంపై జోన్-1 డిప్యూటీ కమిషనర్ పంగ్రామ్సింగ్ నిశాందార్ స్పందించారు. జమిల్ ఖాన్ గుండె సంబంధిత వ్యాధితో మృతిచెందినట్లు తెలిపారు. అతడి శరీరంపై ఎలాంటి గాయాలు లేనట్లు వెల్లడించారు. పోలీసులు నాకాబందీ ఉన్న ప్రాంతానికి, మృతుడు వెళ్లిన ప్రాంతానికి చాలా దూరం ఉన్నట్లు సీసీ టీవీ ఫుటేజీ ఆధారంగా గుర్తించినట్లు వెల్లడించారు. నివేదికలను వైద్య పరీక్షలకు పంపించి, మృతదేహాన్ని కుటుంబీకులకు అప్పగించనున్నట్లు ఆయన స్పష్టం చేశారు.
గత నెలలోనూ ముంబయి పోలీసులపై ఈ తరహా ఆరోపణలే వచ్చాయి. నెహ్రూనగర్ ప్రాంతంలో లాక్డౌన్ ఉల్లంఘించాడనే కారణంతో పోలీసులు రాజు వేలు దేవేంద్ర అనే వ్యక్తిని తీవ్రంగా కొట్టడంతో అతడు మరణించినట్లు మృతుడి బంధువులు ఆరోపించారు. అయితే ఈ ఆరోపణలను పోలీసులు ఖండించారు. సదరు వ్యక్తి ఆ ప్రాంతంలోని ఓ ఇంట్లో దొంగతనానికి పాల్పడుతుండగా స్థానికులు బంధించి కొట్టారని, అందుకే ఆ వ్యక్తి మరణించినట్లు పేర్కొన్నారు. ఈ కేసులో ఎనిమిది మంది స్థానికులపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పిఠాపురంలో రూ.80లక్షల విలువైన మద్యం పట్టివేత
సార్వత్రిక ఎన్నికల వేళ తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో మద్యం ఏరులై పారుతోంది. -
అలెన్ హెర్బల్ కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం
రంగారెడ్డి జిల్లా నందిగామ మండలంలోని అలెన్ హెర్బల్ కంపెనీలో శుక్రవారం సాయంత్రం భారీ అగ్ని ప్రమాదం జరిగింది. -
ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుల బెయిల్ పిటిషన్లపై తీర్పు
రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో ముగ్గురు నిందితులకు బెయిల్ ఇచ్చేందుకు నాంపల్లి కోర్టు నిరాకరించింది. -
బాలుడి పొట్టలోకి గాలికొట్టిన ఆకతాయి
ఓ ఆకతాయి వికృత చేష్టలకు గురైన బాలుడు తీవ్ర అస్వస్థతతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. పోలీసుల కథనం.. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం అనికేపల్లికి చెందిన బాలుడు(12) బుధవారం సాయంత్రం తోటి పిల్లలతో కలిసి వాలీబాల్ ఆడుతుండగా బంతిలో గాలి తగ్గింది. -
ఉపాధి లేక ఇద్దరు నేత కార్మికుల ఆత్మహత్య
రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉపాధి లేక ఇద్దరు నేత కార్మికులు ఆత్మహత్య చేసుకున్న ఘటన గురువారం చోటుచేసుకుంది. -
ఆగి ఉన్న లారీని ఢీకొని.. కారుకు మంటలు
ఆగి ఉన్న లారీని వెనక నుంచి ఢీకొనడంతో కారులో మంటలు వ్యాపించి యువ వ్యాపారి సజీవ దహనమయ్యాడు. -
పుట్టెడు దుఃఖం మిగిల్చిన పుట్టెంట్రుకల వేడుక
బావ, బావమరుదుల కుటుంబాల్లోని పది మంది పుట్టెంట్రుకల వేడుక కోసం ఆనందంగా బయల్దేరారు. రోడ్డు ప్రమాదం మధ్యలోనే వారి సంతోషాన్ని చిదిమేసింది. -
విద్యుదాఘాతంతో కౌలు రైతు మృతి
పొలంలో తెగిపడిన విద్యుత్ తీగ తగిలి కౌలు రైతు అక్కడికక్కడే మృతిచెందిన ఘటన జగిత్యాల జిల్లాలో గురువారం ఉదయం చోటు చేసుకుంది. -
రోడ్డు ప్రమాదాల్లో ఐదుగురి దుర్మరణం
కుమురం భీం, నిజామాబాద్ జిల్లాల్లో గురువారం రాత్రి జరిగిన రెండు ప్రమాదాల్లో ఐదుగురు మృతిచెందారు. మొత్తం 17 మంది గాయపడ్డారు. -
ఐదుగురు ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్య
రాష్ట్రంలోని వేర్వేరు జిల్లాలకు చెందిన ఐదుగురు ఇంటర్ విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. -
హోటల్లో భారీ అగ్నిప్రమాదం.. ఆరుగురి సజీవ దహనం
బిహార్ రాజధాని పట్నాలో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. స్థానిక రైల్వేస్టేషన్ సమీపంలోని ఓ హోటల్లో భారీ ఎత్తున మంటలు చెలరేగి ఆరుగురు సజీవ దహనమయ్యారు. -
45 కిలోమీటర్లు.. 1400 సీసీ కెమెరాల జల్లెడ
అర్ధరాత్రి తర్వాత మహిళపై సామూహిక అత్యాచారం.. ఆపై హత్య.. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులకు సీసీ కెమెరాల్లో ఇద్దరూ పరారయ్యే అస్పష్ట చిత్రాలు తప్ప ఒక్క ఆధారం లభించలేదు. -
సల్మాన్ ఇంటివద్ద కాల్పులు.. పంజాబ్లో మరో ఇద్దరు నిందితుల అరెస్టు
బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ఇంటి ముందు జరిగిన కాల్పుల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. -
పోలీసుస్టేషన్ ఆవరణలోనే తెదేపా కార్యకర్తపై దాడి
పోలీసు స్టేషన్ ఆవరణలో వైకాపా నాయకులు హల్చల్ చేశారు. పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం పొందుగల గ్రామానికి చెందిన కొందరు వైకాపా నాయకులు తెదేపా కార్యకర్త యూసఫ్పై స్టేషన్ ఆవరణలోనే దాడి చేశారు. -
వైకాపా నాయకుడి బార్లో.. రూ.1.30 కోట్ల మద్యం స్వాధీనం
శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా అల్లూరులో సెబ్ అధికారులు భారీగా మద్యం స్వాధీనం చేసుకున్నారు. -
గులకరాయి కేసులో నిందితుడిని కస్టడీకి తీసుకున్న పోలీసులు
గులకరాయి కేసులో నిందితుడు సతీష్కుమార్ను పోలీసులు తమ కస్టడీకి తీసుకున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
టిబెట్ అంశంపై వారితో మాత్రమే చర్చిస్తాం : చైనా
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ పరీక్షలు.. 2025 నుంచే!
-
పిఠాపురంలో రూ.80లక్షల విలువైన మద్యం పట్టివేత
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బైక్పై స్టంట్లు.. ‘స్పైడర్ మ్యాన్’ను అరెస్ట్ చేసిన పోలీసులు!
-
మాల్దీవుల జలాల్లోకి.. మళ్లీ చైనా పరిశోధక నౌక