Andhra News: అమెరికాలో శ్రీకాకుళం యువకుడి మృతి

ఉన్న ఊరిలో ఉపాధి దొరకలేదు. బతుకు దెరువు కోసం విదేశాలకు వెళ్లారు. అక్కడ సంపాదించిన డబ్బుతో అప్పులు తీర్చాలని భావించిన ఆ యువకుడు విధుల్లో చేరిన 3 రోజులకే ప్రమాదవశాత్తూ మృతి చెందారు.

Updated : 27 Jan 2023 09:18 IST

ఉద్యోగంలో చేరిన 3 రోజులకే ప్రమాదం

సంతబొమ్మాళి, న్యూస్‌టుడే: ఉన్న ఊరిలో ఉపాధి దొరకలేదు. బతుకు దెరువు కోసం విదేశాలకు వెళ్లారు. అక్కడ సంపాదించిన డబ్బుతో అప్పులు తీర్చాలని భావించిన ఆ యువకుడు విధుల్లో చేరిన 3 రోజులకే ప్రమాదవశాత్తూ మృతి చెందారు. కుటుంబ సభ్యులు, స్థానికుల వివరాల మేరకు.. శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలంలోని ఎం.సున్నాపల్లి గ్రామానికి చెందిన టి.రవికుమార్‌ (35) నౌకలో పని చేసేందుకు మరో 10 మందితో కలిసి ఈనెల 17న అమెరికాకు వెళ్లారు. 3 రోజులకిందట సీమన్‌గా ఉద్యోగంలోచేరారు. బుధవారం సాయంత్రం విధులు నిర్వహిస్తుండగా ప్రమాదవశాత్తూ కంటెయినర్‌పై నుంచి జారిపడి రవికుమార్‌ అక్కడికక్కడే మృతి చెందారు. గురువారం మధ్యాహ్నం 2 గంటలకు కంపెనీ ప్రతినిధులు బాధిత కుటుంబ సభ్యులకు సమాచారమిచ్చారు. ఆయనకు భార్య శ్రావణి, ఇద్దరు కుమార్తెలున్నారు. మృత దేహాన్ని స్వదేశానికి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని