తెదేపా అభిమాని ఆత్మహత్యాయత్నం
చంపుతామని వైకాపా నేతలు బెదిరిస్తున్నారంటూ ఎన్టీఆర్ జిల్లా చందర్లపాడు మండలం కాండ్రపాడుకు చెందిన తెదేపా అభిమాని దండా అవినాష్రెడ్డి (20) పురుగుల మందు తాగి మంగళవారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు.
వైకాపా నేతల వేధింపులే కారణమని ఆరోపణ
చందర్లపాడు, నందిగామ, న్యూస్టుడే: చంపుతామని వైకాపా నేతలు బెదిరిస్తున్నారంటూ ఎన్టీఆర్ జిల్లా చందర్లపాడు మండలం కాండ్రపాడుకు చెందిన తెదేపా అభిమాని దండా అవినాష్రెడ్డి (20) పురుగుల మందు తాగి మంగళవారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. కుటుంబీకులు ఆయన్ని నందిగామకు, అక్కడినుంచి విజయవాడ ప్రభుత్వ వైద్యశాలకు తీసుకెళ్లారు. ఆత్మహత్యాయత్నానికి ముందు అవినాష్రెడ్డి సెల్ఫీ వీడియో చేసి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశారు. వీడియోలో పేర్కొన్న వివరాలివి. ‘నేను తెదేపా అభిమానిని. ఇటీవల శ్రీరామనవమి వేడుకల్లో తెదేపా బ్యానర్ కట్టా. గ్రామానికి చెందిన వైకాపా నాయకుడు కొండా కృష్ణారెడ్డి తన అనుచరులను పంపించి తీసేయమనగా తొలగించా. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా బ్యానర్ కట్టి పది మందిమి కలిసి వేడుకలు నిర్వహించాం. ఆ కార్యక్రమం నిర్వహించాననే అక్కసుతో నాపై ప్రతీకారం తీర్చుకోవాలని ఉపాధి పథకం క్షేత్ర సహాయకుడు ముకుందారెడ్డితో పాటు కృష్ణారెడ్డి, చౌడారెడ్డి, గోపీనాయక్, సుబ్బయ్య వచ్చి నన్ను, మా బావను కొట్టారు. దానిపై చందర్లపాడు పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేస్తే ఎస్సై ఫిర్యాదు వెనక్కి తీసుకోవాలన్నారు. లేకపోతే నీపై ఎస్టీ కేసు పెడతామని, రౌడీషీట్ తెరుస్తామని బెదిరించారు. ఈ నెల 4న రాత్రి చందర్లపాడు వెళ్తుంటే.. ముకుందారెడ్డి ఆపి బెదిరించాడు. పార్టీలో తిరిగినందుకు నిన్ను చంపినా వెనుక ఎవరూ రారు.. మీ తెదేపా నాయకులు అసలు రారు. మాకు ఎమ్మెల్యే ఉన్నారని బెదిరించాడు. దీనిపై మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య చర్యలు తీసుకోవాలి’ అని వీడియోలో కోరారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బాలుడి పొట్టలోకి గాలికొట్టిన ఆకతాయి
ఓ ఆకతాయి వికృత చేష్టలకు గురైన బాలుడు తీవ్ర అస్వస్థతతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. పోలీసుల కథనం.. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం అనికేపల్లికి చెందిన బాలుడు(12) బుధవారం సాయంత్రం తోటి పిల్లలతో కలిసి వాలీబాల్ ఆడుతుండగా బంతిలో గాలి తగ్గింది. -
ఉపాధి లేక ఇద్దరు నేత కార్మికుల ఆత్మహత్య
రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉపాధి లేక ఇద్దరు నేత కార్మికులు ఆత్మహత్య చేసుకున్న ఘటన గురువారం చోటుచేసుకుంది. -
ఆగి ఉన్న లారీని ఢీకొని.. కారుకు మంటలు
ఆగి ఉన్న లారీని వెనక నుంచి ఢీకొనడంతో కారులో మంటలు వ్యాపించి యువ వ్యాపారి సజీవ దహనమయ్యాడు. -
పుట్టెడు దుఃఖం మిగిల్చిన పుట్టెంట్రుకల వేడుక
బావ, బావమరుదుల కుటుంబాల్లోని పది మంది పుట్టెంట్రుకల వేడుక కోసం ఆనందంగా బయల్దేరారు. రోడ్డు ప్రమాదం మధ్యలోనే వారి సంతోషాన్ని చిదిమేసింది. -
విద్యుదాఘాతంతో కౌలు రైతు మృతి
పొలంలో తెగిపడిన విద్యుత్ తీగ తగిలి కౌలు రైతు అక్కడికక్కడే మృతిచెందిన ఘటన జగిత్యాల జిల్లాలో గురువారం ఉదయం చోటు చేసుకుంది. -
రోడ్డు ప్రమాదాల్లో ఐదుగురి దుర్మరణం
కుమురం భీం, నిజామాబాద్ జిల్లాల్లో గురువారం రాత్రి జరిగిన రెండు ప్రమాదాల్లో ఐదుగురు మృతిచెందారు. మొత్తం 17 మంది గాయపడ్డారు. -
ఐదుగురు ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్య
రాష్ట్రంలోని వేర్వేరు జిల్లాలకు చెందిన ఐదుగురు ఇంటర్ విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. -
హోటల్లో భారీ అగ్నిప్రమాదం.. ఆరుగురి సజీవ దహనం
బిహార్ రాజధాని పట్నాలో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. స్థానిక రైల్వేస్టేషన్ సమీపంలోని ఓ హోటల్లో భారీ ఎత్తున మంటలు చెలరేగి ఆరుగురు సజీవ దహనమయ్యారు. -
45 కిలోమీటర్లు.. 1400 సీసీ కెమెరాల జల్లెడ
అర్ధరాత్రి తర్వాత మహిళపై సామూహిక అత్యాచారం.. ఆపై హత్య.. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులకు సీసీ కెమెరాల్లో ఇద్దరూ పరారయ్యే అస్పష్ట చిత్రాలు తప్ప ఒక్క ఆధారం లభించలేదు. -
సల్మాన్ ఇంటివద్ద కాల్పులు.. పంజాబ్లో మరో ఇద్దరు నిందితుల అరెస్టు
బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ఇంటి ముందు జరిగిన కాల్పుల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. -
పోలీసుస్టేషన్ ఆవరణలోనే తెదేపా కార్యకర్తపై దాడి
పోలీసు స్టేషన్ ఆవరణలో వైకాపా నాయకులు హల్చల్ చేశారు. పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం పొందుగల గ్రామానికి చెందిన కొందరు వైకాపా నాయకులు తెదేపా కార్యకర్త యూసఫ్పై స్టేషన్ ఆవరణలోనే దాడి చేశారు. -
వైకాపా నాయకుడి బార్లో.. రూ.1.30 కోట్ల మద్యం స్వాధీనం
శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా అల్లూరులో సెబ్ అధికారులు భారీగా మద్యం స్వాధీనం చేసుకున్నారు. -
గులకరాయి కేసులో నిందితుడిని కస్టడీకి తీసుకున్న పోలీసులు
గులకరాయి కేసులో నిందితుడు సతీష్కుమార్ను పోలీసులు తమ కస్టడీకి తీసుకున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ప్రపంచకప్నకు టీమ్ ఇండియా... రోహిత్, విరాట్కి కాకుండా అతనికే ఎక్కువ ఓట్లు!
-
శ్రుతిహాసన్ అతడికి బ్రేకప్ చెప్పేశారా..?
-
ఎయిర్ గెశ్చర్స్తో రియల్మీ నుంచి బడ్జెట్ కొత్త ఫోన్
-
రివ్యూ: రత్నం.. విశాల్ నటించిన యాక్షన్ డ్రామా మెప్పించిందా?
-
డీజీసీఏ కొత్త రూల్.. విమాన టికెట్ల ధరలు తగ్గుతాయా?
-
‘వీవీప్యాట్ల’పై సుప్రీం తీర్పు.. విపక్షాలకు గట్టి చెంపదెబ్బ: మోదీ