Adilabad: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పిడుగుల వాన
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పిడుగులు బీభత్సం సృష్టించాయి. వీటి కారణంగా శుక్రవారం ముగ్గురు మృతిచెందగా..
ముగ్గురి మృతి, ములుగు జిల్లాలో మరొకరు మృత్యువాత
ఈదురుగాలులకు విద్యుత్తు తీగ మీద పడి ఓ యువ రైతు..
వాగులో పడి మరో మహిళ దుర్మరణం
జైనథ్, వాంకిడి, మంగపేట, చెన్నూరు, బేల, బోథ్, న్యూస్టుడే: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పిడుగులు బీభత్సం సృష్టించాయి. వీటి కారణంగా శుక్రవారం ముగ్గురు మృతిచెందగా.. ఇతర ఘటనల్లో మరో ఇద్దరు మృతిచెందారు. ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలం గూడకు చెందిన యాసిం(38) భార్య అప్సానాతో కలిసి పొలం నుంచి ఇంటికెళ్లేందుకు ఎడ్లబండి కడుతుండగా పిడుగుపడింది. ఈ ఘటనలో యాసిం, జత ఎడ్లు అక్కడికక్కడే మృతిచెందగా.. భార్యకు తీవ్ర గాయాలయ్యాయి. కుమురం భీం జిల్లా వాంకిడి మండలం కెడెగాంకు చెందిన భార్యాభర్తలు గెడాం పద్మ(22), టుల్లి పొలం పనుల్లో ఉండగా వర్షం పడటంతో చెట్టు కిందకు వెళ్లారు. చెట్టుపై పిడుగుపడటంతో పద్మ అక్కడికక్కడే మృతిచెందగా.. భర్త అస్వస్థతకు గురయ్యారు. మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం రొయ్యలపల్లికి చెందిన కౌలు రైతు రావుల రవీందర్(28) పత్తి చేనులో కలుపు తీస్తుండగా పిడుగుపడింది. ములుగు జిల్లా మంగపేట మండలం కొత్తూరు-మొట్లగూడెం పంచాయతీ పరిధి బొమ్మాయిగూడెంకు చెందిన ఈసం పవన్కల్యాణ్(24) గురువారం రాత్రి తన మొక్కజొన్న పంటకు కాపలాగా వెళ్లారు. భారీ వర్షం పడటంతో ఇంటికి తిరిగెళ్తుండగా పిడుగుపాటుకు గురై మృతిచెందారు.
ఆదిలాబాద్ జిల్లా బేల మండలం మశాల(బి) పంచాయతీ మోహన్రావుగూడకు చెందిన మడావి కుశ్వంత్రావు తలయిగూడ సమీపంలోని తన పొలం నుంచి భార్య సంగీతతో కలిసి ఎడ్లబండిపై ఇంటికి వెళ్తుండగా పిడుగుపడింది. ఈ ఘటనలో రైతుకు తీవ్ర గాయాలవగా.. ఒక ఎద్దు చనిపోయింది. ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలం పొచ్చరకు చెందిన యువ రైతు కొమ్ము రాము(27) పత్తి పంటకు పురుగు మందు పిచికారీ చేస్తుండగా ఈదురుగాలులు వీచాయి. ఈ క్రమంలో విద్యుత్తు స్తంభంపై ఉన్న ఇన్సులేటర్ విరిగిపోయి తీగలు తెగి ఆయనపై పడటంతో అక్కడికక్కడే ప్రాణాలొదిలారు. ఇదే మండలానికి చెందిన బాలాపూర్లో ఆలయానికి వెళ్లిన ఏడుగురు గ్రామస్థులు ఎడ్లబండిపై తిరిగొస్తుండగా వర్షానికి ఎడ్లు జారి వాగులో పడ్డాయి. ప్రవాహానికి అంతా కొట్టుకుపోతుండగా గ్రామస్థులు ఆరుగురిని కాపాడారు. బాలాపూర్కు చెందిన రావుత్ రుక్మిణీబాయి(60) మాత్రం బయటకు రాలేక చనిపోయారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బస్సులో చెలరేగిన మంటలు.. 8 మంది సజీవ దహనం
హరియాణా నూహ్లోని కేఎంపీ ఎక్స్ప్రెస్ వేపై ప్రమాదం చోటు చేసుకుంది. -
ఈ నెల 27న వివాహం.. పెళ్లి వస్త్రాల కోసం వెళ్లి తిరిగి వస్తుండగా రోడ్డు ప్రమాదం
అనంతపురం జిల్లాలో శనివారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. -
ఆస్తి కోసం తల్లి, ఇద్దరు కుమార్తెల హత్య
ఖమ్మం జిల్లాలోని తల్లాడ మండలం గోపాలపేటలో దారుణం చోటు చేసుకుంది. -
బెంబేలెత్తిస్తున్న ‘ఎస్బీఐ’ సందేశం
స్మార్ట్ఫోన్ వినియోగం పెరిగింది. డిజిటల్ లావాదేవీలు ఎక్కువయ్యాయి. ఈ క్రమంలో సైబర్ మోసాలు పెరిగాయి. అందరినీ బురిడీ కొట్టించేలా ఫోన్కాల్స్ చేయడం, లాటరీ తగిలిందనో, తక్కువ ధరలో బ్రాండెడ్ వస్తువులనో.. ఏదో ఒక సందేశం పంపి నకిలీ లింకులు చేరవేస్తూ ఆకర్షితులైనవారి ఖాతా నుంచి డబ్బులు ఖాళీ చేస్తున్నారు. -
గూఢచర్యం కేసులో ప్రధాన నిందితుడి గుర్తింపు
సైనిక స్థావరాలకు సంబంధించిన గూఢచర్యం కేసులో మరో నిందితుడిని గుర్తించి అనుబంధ ఛార్జిషీట్లో చేర్చినట్లు ఎన్ఐఏ ఓ ప్రకటనలో తెలిపింది. -
పనికి వెళుతూ.. ప్రాణాలొదిలారు
ఉపాధి కోసం హైదరాబాద్కు వెళుతున్న భార్యాభర్తలు, వీరి కుమారుడు రోడ్డు ప్రమాదంలో ప్రాణాలొదిలారు. ఈ విషాద ఘటన సంగారెడ్డి జిల్లాలో శుక్రవారం జరిగింది. -
ఉన్నట్టుండి పెరిగిన జలపాతం.. బాలుడి మృతి
కుట్రాలం జలపాతంలో ఆకస్మికంగా వరద రావడంతో ఓ బాలుడు కొట్టుకుపోయి మృతి చెందాడు. -
మహిళను బెదిరించి రాత్రి నుంచి ఉదయం వరకు వీడియోకాల్
ఆర్కిటెక్ట్ అయిన మహిళకు రాత్రి వేళ ఫోన్ చేసిన దుండగుడు మాయమాటలతో బెదిరించాడు. అనంతరం వీడియో కాల్ చేసి ఉదయం వరకు పోలీసు కేసుల పేరుతో భయపెడుతూనే ఉన్నాడు. -
విమానాశ్రయంలో వైద్యుడి అరెస్టు
గుంటూరు జిల్లా వెంకటాపురానికి చెందిన డాక్టర్ లోకేశ్కుమార్ శుక్రవారం రాత్రి విమానాశ్రయంలోని వాహనాల పార్కింగ్ ప్రదేశంలో అనుమానాస్పదంగా కనిపించడంతో ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
సీశామ్ కలవరం!
‘‘ హైదరాబాద్లో ఓ వ్యక్తి ఫేస్బుక్ ఖాతా ద్వారా మైనర్ల అశ్లీల వీడియో(ఛైల్డ్ సెక్సువల్ అబ్యూజివ్ మెటీరియల్- సీశామ్) షేర్ అయ్యింది. -
పని ఒత్తిడి, విజిలెన్స్ విచారణ..ఎస్టీపీపీ అధికారి బలవన్మరణం
మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం పెగడపల్లిలోని ఎస్టీపీపీలో ఓ ఇంజినీరు ఆత్మహత్యకు పాల్పడటం కలకలం రేపింది. తోటి ఉద్యోగులు, పోలీసులు తెలిపిన సమాచారం ప్రకారం.. గోదావరిఖనికి చెందిన బూరుగడ్డ కిరీటి(37) ఎస్టీపీపీలో డిప్యూటీ సూపరింటెండెంట్ ఇంజినీరు(డీవైఎస్ఈ)గా ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్(ఓఅండ్ఎం)లో విధులు నిర్వర్తిస్తున్నారు. -
పోలీసులు కొట్టారని ఆటోడ్రైవర్ ఆత్మహత్య
నాగర్కర్నూల్ జిల్లా తెలకపల్లి మండల కేంద్రానికి చెందిన ఓ ఆటో డ్రైవర్ పోలీసులు కొట్టారని మనస్తాపానికి గురై శుక్రవారం ఆత్మహత్యకు పాల్పడ్డారు. -
తరగతి గది ఆవరణలో చిన్నారి మృతదేహం.. స్కూల్కు నిప్పంటించిన కుటుంబసభ్యులు
తప్పిపోయాడనుకున్న తమ మూడేళ్ల చిన్నారి మృతదేహం పాఠశాల తరగతి గది ఆవరణలో కనిపించడంతో తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు. -
మనీలాండరింగ్ కేసులో ఇరుక్కున్నారు.. రూ. 60లక్షలు చెల్లించండి!
సైబర్ నేరగాళ్లు రోజుకో కొత్త పంథాలో ప్రజలను బురిడీ కొట్టిస్తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో దాయాదుల పోరు చూడాలనుంది: కైఫ్
-
జగన్ విధానాలపై ప్రశ్నిస్తే.. వేధిస్తారా?: ఎన్ఆర్ఐ వైద్యుడు లోకేశ్
-
హైదరాబాద్లో భారీ వర్షం.. వనస్థలిపురం వద్ద భారీగా వరదనీరు
-
దేవాలయాల్లో లైబ్రరీలు..ఆసక్తికర సూచన చేసిన ఇస్రో ఛైర్మన్
-
50ఎంపీ సెల్ఫీ కెమెరాతో టెక్నో నుంచి రెండు కొత్త మొబైల్స్
-
పుతిన్, జిన్పింగ్ ఆలింగనంపై.. వైట్హౌస్ జోకులు