Suicide: ఒకే కుటుంబంలో ఏడుగురి ఆత్మహత్య

గుజరాత్‌లోని సూరత్‌లో శనివారం ఘోర సంఘటన చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు ఇంట్లో విగతజీవులై కనిపించారు.

Updated : 29 Oct 2023 06:57 IST

గుజరాత్‌లోని సూరత్‌లో ఘటన

సూరత్‌: గుజరాత్‌లోని సూరత్‌లో శనివారం ఘోర సంఘటన చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు ఇంట్లో విగతజీవులై కనిపించారు. వారు సామూహిక ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు. మృతుల్లో ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కాంట్రాక్టర్‌గా పనిచేసే మనీశ్‌ సోలంకి(37), అతడి తల్లిదండ్రులు, భార్య, ఆరేళ్ల కుమారుడు, 10, 13 ఏళ్ల వయసున్న ఇద్దరు కుమార్తెలు వారి ఇంట్లో ప్రాణం పోయిన స్థితిలో కనిపించారు. మనీశ్‌ సోలంకి మృతదేహం ఉరితాడుకు వేలాడుతుండగా, మిగిలిన వారి మృతదేహాలు మంచం, నేలపైన పడి ఉన్నాయి. ఇంట్లో విషం సీసా, ఆత్మహత్య లేఖను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కొందరికి అప్పుగా ఇచ్చిన సొమ్మును తిరిగి చెల్లించలేదని, ఆర్థిక సమస్యలతోనే తాము చనిపోతున్నామని అందులో పేర్కొన్నట్లు పోలీసులు వెల్లడించారు. సోలంకి ముందుగా తన కుటుంబ సభ్యులతో విషం తాగించి, ఆ తర్వాత ఉరి వేసుకుని ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని