Hyderabad News: హాష్ ఆయిల్ కీలక సూత్రధారి లక్ష్మీపతి అరెస్టు
నగరంలో డ్రగ్స్కు బానిసై బీటెక్ విద్యార్థి మృతి చెందిన కేసులో డ్రగ్స్ విక్రయిస్తున్న ప్రేమ్ ఉపాధ్యాయ్ అనే వ్యక్తికి హాష్ ఆయిల్ (గంజాయి నుంచి తీసిన ఆయిల్) సరఫరా చేస్తున్న కీలక సూత్రధారి లక్ష్మీపతిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
హైదరాబాద్: డ్రగ్స్ కేసుల దర్యాప్తును పోలీసులు వేగవంతం చేశారు. నగరంలో డ్రగ్స్కు బానిసై ఇటీవల బీటెక్ విద్యార్థి మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ కేసులో డ్రగ్స్ విక్రేత ప్రేమ్ ఉపాధ్యాయ్కి హాష్ ఆయిల్ (గంజాయి నుంచి తీసిన నూనె) సరఫరా చేసిన కీలక సూత్రధారి లక్ష్మీపతిని పోలీసులు ఎట్టకేలకు అదుపులోకి తీసుకున్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు చెందిన లక్ష్మీపతిని హైదరాబాద్ నార్కోటిక్ నియంత్రణ విభాగం పోలీసులు రెండు రోజుల క్రితం అదుపులోకి తీసుకున్నారు. బీటెక్ విద్యార్థికి మాదకద్రవ్యాలు సరఫరా చేసిన ప్రేమ్ ఉపాధ్యాయ్తో పాటు ముగ్గురు వినియోగదారులను వారం క్రితం అరెస్టు చేశారు. అప్పటి నుంచి పరారీలో ఉన్న లక్ష్మీపతి కోసం పోలీసులు బృందాలుగా ఏర్పడి గాలించారు. వైజాగ్, విజయవాడ, బెంగళూరు, గోవాకు బృందాలుగా వెళ్లి గాలించారు. హాష్ ఆయిల్ ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు? ఎవరెవరికి సరఫరా చేస్తున్నారనే విషయాలను నార్కోటిక్ విభాగం పోలీసులు సేకరిస్తున్నారు.
లక్ష్మీపతి బీటెక్ చదువుతున్న సమయంలో గంజాయికి బానిసయ్యాడు. ఆ తర్వాత గంజాయి విక్రయించడం మొదలు పెట్టాడు. సాఫ్ట్వేర్ ఇంజినీర్లకు హాష్ ఆయిల్ సరఫరా చేయడం ప్రారంభించాడు. దాదాపు 100 మంది వరకు లక్ష్మీపతి నుంచి హాష్ ఆయిల్ కొనుగోలు చేసినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. ఐసో ప్రొపైల్ ఆల్కహాల్లో గంజాయి మొగ్గలను మరిగించి దాని ద్వారా వచ్చే ద్రావణాన్ని లక్ష్మీపతి విక్రయిస్తున్నాడు. లీటర్ హాష్ ఆయిల్ను రూ. 6 లక్షల వరకు విక్రయిస్తున్నాడు. 10 మి.లీటర్లను చిన్న సీసాల్లో నింపి వాటిని వినియోగదారులకు చేరవేస్తున్నాడు. నగరంలోని మాదాపూర్, కొండాపూర్, నార్సింగి ప్రాంతాల్లో గదులు అద్దెకు తీసుకొని.. అక్కడ పార్టీలు ఏర్పాటు చేసి సాఫ్ట్వేర్ ఉద్యోగులను ఆహ్వానిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. సామాజిక మాధ్యమాల ద్వారా గ్రూపులు ఏర్పాటు చేసి మాదక ద్రవ్యాల సరఫరాకు సంబంధించిన సమాచారాన్ని లక్ష్మీపతి చేరవేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం లక్ష్మీపతికి హాష్ ఆయిల్ సరఫరా చేస్తున్న ముఠాను గుర్తించేందుకు నార్కోటిక్ నియంత్రణ విభాగం పోలీసులు ప్రయత్నిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బాలుడి పొట్టలోకి గాలికొట్టిన ఆకతాయి
ఓ ఆకతాయి వికృత చేష్టలకు గురైన బాలుడు తీవ్ర అస్వస్థతతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. పోలీసుల కథనం.. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం అనికేపల్లికి చెందిన బాలుడు(12) బుధవారం సాయంత్రం తోటి పిల్లలతో కలిసి వాలీబాల్ ఆడుతుండగా బంతిలో గాలి తగ్గింది. -
ఉపాధి లేక ఇద్దరు నేత కార్మికుల ఆత్మహత్య
రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉపాధి లేక ఇద్దరు నేత కార్మికులు ఆత్మహత్య చేసుకున్న ఘటన గురువారం చోటుచేసుకుంది. -
ఆగి ఉన్న లారీని ఢీకొని.. కారుకు మంటలు
ఆగి ఉన్న లారీని వెనక నుంచి ఢీకొనడంతో కారులో మంటలు వ్యాపించి యువ వ్యాపారి సజీవ దహనమయ్యాడు. -
పుట్టెడు దుఃఖం మిగిల్చిన పుట్టెంట్రుకల వేడుక
బావ, బావమరుదుల కుటుంబాల్లోని పది మంది పుట్టెంట్రుకల వేడుక కోసం ఆనందంగా బయల్దేరారు. రోడ్డు ప్రమాదం మధ్యలోనే వారి సంతోషాన్ని చిదిమేసింది. -
విద్యుదాఘాతంతో కౌలు రైతు మృతి
పొలంలో తెగిపడిన విద్యుత్ తీగ తగిలి కౌలు రైతు అక్కడికక్కడే మృతిచెందిన ఘటన జగిత్యాల జిల్లాలో గురువారం ఉదయం చోటు చేసుకుంది. -
రోడ్డు ప్రమాదాల్లో ఐదుగురి దుర్మరణం
కుమురం భీం, నిజామాబాద్ జిల్లాల్లో గురువారం రాత్రి జరిగిన రెండు ప్రమాదాల్లో ఐదుగురు మృతిచెందారు. మొత్తం 17 మంది గాయపడ్డారు. -
ఐదుగురు ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్య
రాష్ట్రంలోని వేర్వేరు జిల్లాలకు చెందిన ఐదుగురు ఇంటర్ విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. -
హోటల్లో భారీ అగ్నిప్రమాదం.. ఆరుగురి సజీవ దహనం
బిహార్ రాజధాని పట్నాలో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. స్థానిక రైల్వేస్టేషన్ సమీపంలోని ఓ హోటల్లో భారీ ఎత్తున మంటలు చెలరేగి ఆరుగురు సజీవ దహనమయ్యారు. -
45 కిలోమీటర్లు.. 1400 సీసీ కెమెరాల జల్లెడ
అర్ధరాత్రి తర్వాత మహిళపై సామూహిక అత్యాచారం.. ఆపై హత్య.. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులకు సీసీ కెమెరాల్లో ఇద్దరూ పరారయ్యే అస్పష్ట చిత్రాలు తప్ప ఒక్క ఆధారం లభించలేదు. -
సల్మాన్ ఇంటివద్ద కాల్పులు.. పంజాబ్లో మరో ఇద్దరు నిందితుల అరెస్టు
బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ఇంటి ముందు జరిగిన కాల్పుల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. -
పోలీసుస్టేషన్ ఆవరణలోనే తెదేపా కార్యకర్తపై దాడి
పోలీసు స్టేషన్ ఆవరణలో వైకాపా నాయకులు హల్చల్ చేశారు. పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం పొందుగల గ్రామానికి చెందిన కొందరు వైకాపా నాయకులు తెదేపా కార్యకర్త యూసఫ్పై స్టేషన్ ఆవరణలోనే దాడి చేశారు. -
వైకాపా నాయకుడి బార్లో.. రూ.1.30 కోట్ల మద్యం స్వాధీనం
శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా అల్లూరులో సెబ్ అధికారులు భారీగా మద్యం స్వాధీనం చేసుకున్నారు. -
గులకరాయి కేసులో నిందితుడిని కస్టడీకి తీసుకున్న పోలీసులు
గులకరాయి కేసులో నిందితుడు సతీష్కుమార్ను పోలీసులు తమ కస్టడీకి తీసుకున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
రవి కిషన్కు ఊరట.. డీఎన్ఏ టెస్టుకు కోర్టు నిరాకరణ
-
ప్రపంచకప్నకు టీమ్ ఇండియా... రోహిత్, విరాట్కి కాకుండా అతనికే ఎక్కువ ఓట్లు!
-
శ్రుతిహాసన్ అతడికి బ్రేకప్ చెప్పేశారా..?
-
ఎయిర్ గెశ్చర్స్తో రియల్మీ నుంచి బడ్జెట్ కొత్త ఫోన్
-
రివ్యూ: రత్నం.. విశాల్ నటించిన యాక్షన్ డ్రామా మెప్పించిందా?
-
డీజీసీఏ కొత్త రూల్.. విమాన టికెట్ల ధరలు తగ్గుతాయా?