Crime news: అశ్లీల చిత్రాలు చూస్తున్నాడని.. కుమారుడికి విషమిచ్చి చంపేశాడు!
ఫోన్లో అశ్లీల చిత్రాలు చూస్తున్నాడన్న కారణంతో ఓ తండ్రి కన్న కుమారుడికే విషమిచ్చి చంపేశాడు. ఈ ఘటన మహారాష్ట్రలోని సోలాపుర్లో జరిగింది.
సోలాపుర్: మొబైల్లో అశ్లీల చిత్రాలు (Blue flims) చూస్తున్నాడని తన 14 ఏళ్ల కుమారుడికి విషమిచ్చి చంపేశాడో తండ్రి. గుట్టుచప్పుడు కాకుండా మృతదేహాన్ని ఇంటికి సమీపంలోని మురికి కాల్వలో పడేశాడు. ఈ ఘటన మహారాష్ట్రలోని (Maharashtra) సోలాపుర్ జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. నిందితుడు విజయ్ బట్టు.. టైలర్గా పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అతడి కొడుకు విశాల్ దగ్గర్లోని పాఠశాలలో చదువుతున్నాడు. రోజూ స్కూల్కు ఫోన్ తీసుకెళ్లి అక్కడ అశ్లీల చిత్రాలు చూసేవాడు. దీనిపై ఉపాధ్యాయులు కూడా పలుమార్లు తండ్రికి ఫిర్యాదు చేశారు. దీంతో విసుగెత్తిపోయి.. ఆహారంలో విషం కలిపి చంపేశాడు.
ఈ సంగతి అతడి భార్యకు కూడా తెలియదు. తమ కుమారుడు కనిపించడం లేదంటూ జనవరి 13న దంపతులిద్దరూ కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేపట్టగా.. ఇంటికి దగ్గర్లోని ఓ మురికి కాల్వలో మృతదేహం లభ్యమైంది. తమకు లభించిన ఆధారాలకు, మృతుడి తండ్రి చెప్పిన వివరాలకు పొంతన లేకపోవడంతో పోలీసులకు అనుమానం వచ్చింది. ఎలాగైనా దొరికిపోతానని గ్రహించిన విజయ్.. తొలుత జరిగిన విషయాన్ని జనవరి 28న తన భార్యకు చెప్పేశాడు. ఆ తర్వాత పోలీస్ స్టేషన్కు వెళ్లి నేరాన్ని అంగీకరించాడు. దీంతో అతడిపై హత్యకేసు నమోదు చేసిన పోలీసులు తాజాగా కోర్టు ఎదుట ప్రవేశపెట్టగా.. న్యాయమూర్తి రెండు రోజుల కస్టడీకి అనుమతించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
8 నెలలు మోసగించారు.. రూ.7 కోట్లు కొట్టేశారు
తనకొక స్వామీజీ తెలుసని.. విదేశాల్లో ఉన్న శిష్యులు ఆయనకు విరాళాలు పంపిస్తారని.. పన్నుల కోసం ముందుగా పెట్టుబడి పెడితే 30శాతం వాటా పొందవచ్చని నమ్మించి ఓ ఘరానా ముఠా ఏకంగా రూ.7.18కోట్లు కాజేసింది. -
అత్యాచారం చేసి.. కాల్చిన ఇనుప రాడ్డుతో ముఖంపై పేరు రాసి..
ఉత్తర్ప్రదేశ్లోని లఖీంపుర్ ఖేరీలో దారుణం చోటుచేసుకుంది. ఓ 17 ఏళ్ల బాలికను మూడు రోజుల పాటు బంధించి అత్యాచారం చేసిన ఘటన తాజాగా వెలుగుచూసింది. -
కృష్ణా జిల్లాలో రూ.80లక్షల మద్యం పట్టివేత
ఎన్నికల్లో పంపిణీ చేసేందుకు కృష్ణా జిల్లా గన్నవరం మండలం మెట్లపల్లిలో హనుమాన్జంక్షన్ సర్కిల్ పరిధిలోని ఆత్కూరు స్టేషన్ శివారులో నిల్వ ఉంచిన 58,080 క్వార్టర్ల మద్యం సీసాలను పోలీసులు పట్టుకున్నారు. -
వైకాపా నాయకుడి పశువుల పాకలో భారీగా మద్యం సీసాలు లభ్యం
వైకాపా నాయకుడి పశువుల పాకలో భారీగా గోవా మద్యం సీసాలు పట్టుబడిన సంఘటన ప్రకాశం జిల్లా చీమకుర్తి మండలం యర్రగుడిపాడులో ఆదివారం చోటుచేసుకుంది. -
మహదేవ్ బెట్టింగ్ యాప్ కేసు.. బాలీవుడ్ నటుడు సాహిల్ ఖాన్ అరెస్ట్
మహదేవ్ బెట్టింగ్ యాప్ కుంభకోణం కేసులో బాలీవుడ్ నటుడు, ఫిట్నెస్ ఇన్ఫ్లుయెన్సర్ సాహిల్ ఖాన్ను ముంబయి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
పాక్ పడవ నుంచి రూ.600 కోట్ల విలువైన మాదకద్రవ్యాల స్వాధీనం
గుజరాత్ తీరానికి సమీపంలో పాకిస్థాన్కు చెందిన పడవ నుంచి 86 కేజీల బరువున్న 78 పొట్లాల మాదకద్రవ్యాలను భారతీయ కోస్టుగార్డు స్వాధీనం చేసుకున్నట్లు తీర రక్షక దళ సంస్థ ఆదివారం తెలిపింది. -
జమ్మూకశ్మీర్లో కాల్పులు.. గ్రామ రక్షక భటుడి మృతి
జమ్మూకశ్మీర్లోని ఉధంపుర్ జిల్లాలో మారుమూల గ్రామమైన పనారాలో కాల్పులు కలకలం సృష్టించాయి. -
12 మంది కల్తీ విత్తన విక్రేతలపై క్రిమినల్ కేసులు
రైతులకు కల్తీ విత్తనాలు విక్రయించిన 12మందిని గుర్తించి క్రిమినల్ కేసులు నమోదు చేసినట్లు వ్యవసాయ శాఖ తెలిపింది. -
ట్రేడ్ లైసెన్సుల పేరిట వ్యాపారులకు బురిడీ
మీ వ్యాపార ట్రేడ్ లైసెన్సులు రెన్యువల్ చేసుకోవాలంటూ పలు హోటళ్లు, రెస్టారెంట్లు, ఆసుపత్రి నిర్వాహకుల నుంచి డబ్బులు వసూలు చేసిన అంతర్రాష్ట్ర సైబర్ మోసగాడిని గద్వాల పోలీసులు అరెస్టు చేసి రిమాండుకు పంపారు.