Crime news: క్లోరిన్ వాయువు లీక్.. ఒకరి మృతి; 13 మందికి అత్యవసర చికిత్స!
తమిళనాడులోని ఈరోడ్లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. చిత్తోడ్ ప్రాంతంలోని బ్లీచింగ్ పౌడర్ తయారీ కేంద్రంలో ద్రవరూప క్లోరిన్ లీకైంది. దీంతో ఆ కేంద్రంలోని 14 మంది స్పృహకోల్పోయారు...........
ఈరోడ్: తమిళనాడులోని ఈరోడ్లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. చిత్తోడ్ ప్రాంతంలోని బ్లీచింగ్ పౌడర్ తయారీ కేంద్రంలో ద్రవరూప క్లోరిన్ లీకైంది. దీంతో ఆ కేంద్రంలోని 14 మంది స్పృహకోల్పోయారు. ఈ ప్రమాదంలో కర్మాగారం యజమాని మృతి చెందగా.. 13మందిని ఆస్పత్రికి తరలించి అత్యవసర చికిత్స అందిస్తున్నారు. చిత్తోడ్ సమీపంలో బ్లీచింగ్ తయారు చేసే కర్మాగారంలో శనివారం రోజువారీ చర్యల్లో భాగంగా కార్మికులు పనుల్లో ఉండగా హఠాత్తుగా ఒక్కసారిగా ద్రవరూప క్లోరిన్ లీకైంది. దీంతో కర్మాగారం యజమాని దామోదరన్ సహా 14మంది కార్మికులు ఒకరి తర్వాత ఒకరు స్పృహ తప్పి పడిపోయారు. క్లోరిన్ వాయువు విషపూరితాల కారణంగా స్పృహ తప్పిన వారికి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఎదురైంది.
కర్మాగారం నుంచి బయటకు వచ్చి స్పృహతప్పి పడిపోయిన వారిని చూసిన సమీపంలోని స్థానికులు ఈరోడ్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఊపిరాడకపోవడంతో కర్మాగార యజమాని దామోదరన్ (47) మృతి చెందారు. సమీపంలోని భవానీ, చిత్తోడ్, ఈరోడ్ అగ్నిమాపక సిబ్బంది కవచ దుస్తులు ధరించి కర్మాగారంలోకి వెళ్లి క్లోరిన్ లీకేజీని అదుపు చేశారు. ముందు జాగ్రత్త చర్యగా సున్నం కలిపిన నీటిని కర్మాగారం వద్ద వెదజల్లారు. సమీపంలోని వర్క్షాప్ కార్మికులను కర్మాగారం నుంచి దూరంగా వెళ్లాలని సూచించారు. మృతుడు శ్రీధర్ కెమికల్స్ పేరుతో బ్లీచింగ్ పౌడర్ తయారీ కేంద్రాన్ని నడుపుతున్నారు. గ్యాస్ లీకేజీ ప్రాంతాన్ని జిల్లా కలెక్టర్ కృష్ణనున్ని పరిశీలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బాలుడి పొట్టలోకి గాలికొట్టిన ఆకతాయి
ఓ ఆకతాయి వికృత చేష్టలకు గురైన బాలుడు తీవ్ర అస్వస్థతతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. పోలీసుల కథనం.. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం అనికేపల్లికి చెందిన బాలుడు(12) బుధవారం సాయంత్రం తోటి పిల్లలతో కలిసి వాలీబాల్ ఆడుతుండగా బంతిలో గాలి తగ్గింది. -
ఉపాధి లేక ఇద్దరు నేత కార్మికుల ఆత్మహత్య
రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉపాధి లేక ఇద్దరు నేత కార్మికులు ఆత్మహత్య చేసుకున్న ఘటన గురువారం చోటుచేసుకుంది. -
ఆగి ఉన్న లారీని ఢీకొని.. కారుకు మంటలు
ఆగి ఉన్న లారీని వెనక నుంచి ఢీకొనడంతో కారులో మంటలు వ్యాపించి యువ వ్యాపారి సజీవ దహనమయ్యాడు. -
పుట్టెడు దుఃఖం మిగిల్చిన పుట్టెంట్రుకల వేడుక
బావ, బావమరుదుల కుటుంబాల్లోని పది మంది పుట్టెంట్రుకల వేడుక కోసం ఆనందంగా బయల్దేరారు. రోడ్డు ప్రమాదం మధ్యలోనే వారి సంతోషాన్ని చిదిమేసింది. -
విద్యుదాఘాతంతో కౌలు రైతు మృతి
పొలంలో తెగిపడిన విద్యుత్ తీగ తగిలి కౌలు రైతు అక్కడికక్కడే మృతిచెందిన ఘటన జగిత్యాల జిల్లాలో గురువారం ఉదయం చోటు చేసుకుంది. -
రోడ్డు ప్రమాదాల్లో ఐదుగురి దుర్మరణం
కుమురం భీం, నిజామాబాద్ జిల్లాల్లో గురువారం రాత్రి జరిగిన రెండు ప్రమాదాల్లో ఐదుగురు మృతిచెందారు. మొత్తం 17 మంది గాయపడ్డారు. -
ఐదుగురు ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్య
రాష్ట్రంలోని వేర్వేరు జిల్లాలకు చెందిన ఐదుగురు ఇంటర్ విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. -
హోటల్లో భారీ అగ్నిప్రమాదం.. ఆరుగురి సజీవ దహనం
బిహార్ రాజధాని పట్నాలో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. స్థానిక రైల్వేస్టేషన్ సమీపంలోని ఓ హోటల్లో భారీ ఎత్తున మంటలు చెలరేగి ఆరుగురు సజీవ దహనమయ్యారు. -
45 కిలోమీటర్లు.. 1400 సీసీ కెమెరాల జల్లెడ
అర్ధరాత్రి తర్వాత మహిళపై సామూహిక అత్యాచారం.. ఆపై హత్య.. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులకు సీసీ కెమెరాల్లో ఇద్దరూ పరారయ్యే అస్పష్ట చిత్రాలు తప్ప ఒక్క ఆధారం లభించలేదు. -
సల్మాన్ ఇంటివద్ద కాల్పులు.. పంజాబ్లో మరో ఇద్దరు నిందితుల అరెస్టు
బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ఇంటి ముందు జరిగిన కాల్పుల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. -
పోలీసుస్టేషన్ ఆవరణలోనే తెదేపా కార్యకర్తపై దాడి
పోలీసు స్టేషన్ ఆవరణలో వైకాపా నాయకులు హల్చల్ చేశారు. పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం పొందుగల గ్రామానికి చెందిన కొందరు వైకాపా నాయకులు తెదేపా కార్యకర్త యూసఫ్పై స్టేషన్ ఆవరణలోనే దాడి చేశారు. -
వైకాపా నాయకుడి బార్లో.. రూ.1.30 కోట్ల మద్యం స్వాధీనం
శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా అల్లూరులో సెబ్ అధికారులు భారీగా మద్యం స్వాధీనం చేసుకున్నారు. -
గులకరాయి కేసులో నిందితుడిని కస్టడీకి తీసుకున్న పోలీసులు
గులకరాయి కేసులో నిందితుడు సతీష్కుమార్ను పోలీసులు తమ కస్టడీకి తీసుకున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఆ సమయంలో అతడు ఒక్క బౌండరీ కొట్టలేదు : విరాట్ స్ట్రైక్రేట్పై గావస్కర్
-
అమెరికాలో గాజా అలజడి.. భారత సంతతి విద్యార్థిని అరెస్ట్
-
ఓటీటీలోకి యాక్షన్ థ్రిల్లర్ ‘యోధ’.. ప్రస్తుతానికి అద్దె ప్రాతిపదికన..
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
రేమండ్ వివాదం.. డైరెక్టర్గా నవాజ్ మోదీ తొలగింపు!
-
అలా చేయాలని చెబితే.. భారత్ నుంచి వెళ్లిపోతాం: వాట్సప్