Gold Robbery: ఆదిలాబాద్ పట్టణంలో భారీ చోరీ!

ఆదిలాబాద్ పట్టణంలోని ఓ ఇంట్లో సుమారు రూ.23లక్షల విలువైన నగలు, నగదును దుండగులు దోచుకున్నారు.

Updated : 15 Oct 2023 22:23 IST

ఎదులాపురం: ఆదిలాబాద్ పట్టణంలోని నారాయణ ఎన్‌క్లేవ్స్‌లో ఆదివారం రాత్రి భారీ చోరీ జరిగింది. దాదాపు రూ.23 లక్షల విలువైన నగలు, నగదును దుండగులు దోచుకెళ్లారు. కాలనీలో నివాసం ఉండే జి. కొమురయ్య ఆదివారం రాత్రి 7.50కి సమీపంలోని దుర్గామాత మండపానికి వెళ్లి అరగంటలో ఇంటికి తిరిగొచ్చారు. అంతలోపే దుండగులు ఇంటి తాళం పగలగొట్టి  రూ.11 లక్షల నగదు, 20 తులాల బంగారు ఆభరణాలు, 35 తులాల వెండి ఆభరణాలను దోచుకెళ్లారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని ఆధారాలు సేకరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని