Crime: ‘మోసగాళ్లు’ తరహాలో నకిలీ కాల్ సెంటర్.. 12 మంది అరెస్టు!
మంచు విష్ణు, కాజల్, నవదీప్ ప్రధాన పాత్రలో నటించిన ‘మోసగాళ్లు’ చిత్రం చూశారా! అందులో వీరు ఒక నకిలీ కాల్ సెంటర్ ఏర్పాటు చేసి, అమెరికన్ రెవెన్యూ అధికారులుగా అమెరికన్లకు ఫోన్ చేసి ట్యాక్స్ కట్టాలని సూచిస్తుంటారు. వారి కట్టే డబ్బును గిఫ్ట్కార్డు రూపంలో తీసుకొని నగదుగా మార్చుతూ
దిల్లీ: మంచు విష్ణు, కాజల్, నవదీప్ ప్రధాన పాత్రలో నటించిన ‘మోసగాళ్లు’ చిత్రం చూశారా! అందులో వీరు ఒక నకిలీ కాల్ సెంటర్ ఏర్పాటు చేసి, అమెరికన్ రెవెన్యూ అధికారులుగా అమెరికన్లకు ఫోన్ చేసి ట్యాక్స్ కట్టాలని సూచిస్తుంటారు. వారు కట్టే డబ్బును గిఫ్ట్కార్డు రూపంలో తీసుకొని నగదుగా మార్చుతూ రూ. కోట్లకు పడగలెత్తుతారు. గతంలో జరిగిన ఒక సైబర్మోసం ఆధారంగా తెరకెక్కిందే ఈ చిత్రం. అయితే, మళ్లీ అదే తరహాలో దిల్లీలో కొందరు ఓ నకిలీ కాల్ సెంటర్ నిర్వహిస్తుండగా.. పోలీసులు దాడి చేసి నిర్వాహకులను అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళితే..
నైరుతీ దిల్లీలోని ఓ కాల్సెంటర్లో ఉద్యోగులు తమకు తాము ప్రముఖ ఆన్లైన్ షాపింగ్ సంస్థ అమెజాన్ టెక్ సపోర్ట్ స్టాఫ్గా పరిచయం చేసుకొని అమెరికా, కెనడాలో ఉండే ప్రజల నుంచి భారీ మొత్తంలో డబ్బులు వసూళ్లు చేస్తున్నారు. మొదట అక్కడి ప్రజల్లో కొందర్ని లక్ష్యంగా చేసుకొని వారి అమెజాన్ అకౌంట్ హ్యాక్కు గురైనట్లు లేదా వ్యక్తిగత సమాచారానికి ప్రమాదం పొంచి ఉందని తెలిపే విధంగా ఒక సమాచారాన్ని పంపిస్తారు. ఈ సమస్య పరిష్కారం కావాలంటే కాల్ చేయాలంటూ ఒక నంబర్ ఇస్తున్నారు. కంగారుపడి కాల్ చేసిన వారితో అమెజాన్ టెక్ సపోర్టు స్టాఫ్లా మాట్లాడుతూ.. సమస్యను పరిష్కరించడానికి కొంత మొత్తం ఖర్చు అవుతుందని చెబుతారు. కస్టమర్ డబ్బులు చెల్లించడానికి సిద్ధపడితే.. ఆ మొత్తాన్ని గిఫ్ట్కార్డు రూపంలో ఇవ్వాలని కోరుతారు. అలా వచ్చిన గిఫ్ట్కార్డులను అమెరికా, కెనడాలో ఉన్న వారి మనుషులతో నగదు రూపంలోకి మార్చుకుంటారు.
గత కొన్నాళ్లుగా ఈ కాల్ సెంటర్ విదేశీయులను మోసం చేస్తూ భారీగా డబ్బులు సంపాదిస్తోంది. ఈ విషయం తెలియడంతో జులై 31న పోలీసులు కాల్ సెంటర్పై దాడి చేశారు. అక్కడ పనిచేస్తున్న 12 మందిని పోలీసులు అరెస్టు చేశారు. 19 కంప్యూటర్లు, 13 మొబైల్ ఫోన్లు, ఇంటర్నెట్ రూటర్లు.. సాఫ్ట్వేర్ ఇతర వస్తువుల్ని స్వాధీనం చేసుకున్నారు. తాజాగా ఈ ఘటనకు సంబంధించిన వివరాలను పోలీసులు మీడియాకి వెల్లడించారు. ఇదే కాదు.. కొన్ని రోజుల కిందట.. మరో నకిలీ కాల్సెంటర్పై దాడి చేసి నిర్వాహకులను అరెస్టు చేశారు. అమెరికన్ అధికారులుగా అక్కడి పౌరులకు కాల్స్ చేసి.. వారి సోషల్ సెక్యురిటీ నంబర్ను రద్దు చేస్తామని చెప్పి రూ. కోట్లు దండుకున్నారు. గత కొంత కాలంగా దిల్లీలో ఇలాంటి నకిలీ కాల్సెంటర్లు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. పోలీసులు ఎప్పటికప్పుడు వాటిపై దాడులు చేస్తూ వారి గుట్టును రట్టు చేస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బాలుడి పొట్టలోకి గాలికొట్టిన ఆకతాయి
ఓ ఆకతాయి వికృత చేష్టలకు గురైన బాలుడు తీవ్ర అస్వస్థతతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. పోలీసుల కథనం.. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం అనికేపల్లికి చెందిన బాలుడు(12) బుధవారం సాయంత్రం తోటి పిల్లలతో కలిసి వాలీబాల్ ఆడుతుండగా బంతిలో గాలి తగ్గింది. -
ఉపాధి లేక ఇద్దరు నేత కార్మికుల ఆత్మహత్య
రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉపాధి లేక ఇద్దరు నేత కార్మికులు ఆత్మహత్య చేసుకున్న ఘటన గురువారం చోటుచేసుకుంది. -
ఆగి ఉన్న లారీని ఢీకొని.. కారుకు మంటలు
ఆగి ఉన్న లారీని వెనక నుంచి ఢీకొనడంతో కారులో మంటలు వ్యాపించి యువ వ్యాపారి సజీవ దహనమయ్యాడు. -
పుట్టెడు దుఃఖం మిగిల్చిన పుట్టెంట్రుకల వేడుక
బావ, బావమరుదుల కుటుంబాల్లోని పది మంది పుట్టెంట్రుకల వేడుక కోసం ఆనందంగా బయల్దేరారు. రోడ్డు ప్రమాదం మధ్యలోనే వారి సంతోషాన్ని చిదిమేసింది. -
విద్యుదాఘాతంతో కౌలు రైతు మృతి
పొలంలో తెగిపడిన విద్యుత్ తీగ తగిలి కౌలు రైతు అక్కడికక్కడే మృతిచెందిన ఘటన జగిత్యాల జిల్లాలో గురువారం ఉదయం చోటు చేసుకుంది. -
రోడ్డు ప్రమాదాల్లో ఐదుగురి దుర్మరణం
కుమురం భీం, నిజామాబాద్ జిల్లాల్లో గురువారం రాత్రి జరిగిన రెండు ప్రమాదాల్లో ఐదుగురు మృతిచెందారు. మొత్తం 17 మంది గాయపడ్డారు. -
ఐదుగురు ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్య
రాష్ట్రంలోని వేర్వేరు జిల్లాలకు చెందిన ఐదుగురు ఇంటర్ విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. -
హోటల్లో భారీ అగ్నిప్రమాదం.. ఆరుగురి సజీవ దహనం
బిహార్ రాజధాని పట్నాలో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. స్థానిక రైల్వేస్టేషన్ సమీపంలోని ఓ హోటల్లో భారీ ఎత్తున మంటలు చెలరేగి ఆరుగురు సజీవ దహనమయ్యారు. -
45 కిలోమీటర్లు.. 1400 సీసీ కెమెరాల జల్లెడ
అర్ధరాత్రి తర్వాత మహిళపై సామూహిక అత్యాచారం.. ఆపై హత్య.. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులకు సీసీ కెమెరాల్లో ఇద్దరూ పరారయ్యే అస్పష్ట చిత్రాలు తప్ప ఒక్క ఆధారం లభించలేదు. -
సల్మాన్ ఇంటివద్ద కాల్పులు.. పంజాబ్లో మరో ఇద్దరు నిందితుల అరెస్టు
బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ఇంటి ముందు జరిగిన కాల్పుల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. -
పోలీసుస్టేషన్ ఆవరణలోనే తెదేపా కార్యకర్తపై దాడి
పోలీసు స్టేషన్ ఆవరణలో వైకాపా నాయకులు హల్చల్ చేశారు. పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం పొందుగల గ్రామానికి చెందిన కొందరు వైకాపా నాయకులు తెదేపా కార్యకర్త యూసఫ్పై స్టేషన్ ఆవరణలోనే దాడి చేశారు. -
వైకాపా నాయకుడి బార్లో.. రూ.1.30 కోట్ల మద్యం స్వాధీనం
శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా అల్లూరులో సెబ్ అధికారులు భారీగా మద్యం స్వాధీనం చేసుకున్నారు. -
గులకరాయి కేసులో నిందితుడిని కస్టడీకి తీసుకున్న పోలీసులు
గులకరాయి కేసులో నిందితుడు సతీష్కుమార్ను పోలీసులు తమ కస్టడీకి తీసుకున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
‘వీవీప్యాట్ల’పై సుప్రీం తీర్పు.. విపక్షాలకు గట్టి చెంపదెబ్బ: మోదీ
-
‘నోటా’కు ఎక్కువ ఓట్లు వస్తే..? ఈసీకి సుప్రీం కోర్టు నోటీసులు
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా
-
ఐపీఓకు స్విగ్గీ రెడీ.. సెబీ రహస్య మార్గంలో దరఖాస్తు
-
ఆ సమయంలో అతడు ఒక్క బౌండరీ కొట్టలేదు : విరాట్ స్ట్రైక్రేట్పై గావస్కర్
-
అమెరికాలో గాజా అలజడి.. భారత సంతతి విద్యార్థిని అరెస్ట్