Crime News: అనుచరులతో కలిసి రౌడీషీటర్ వీరంగం..!

నిజామాబాద్‌లో అనుచరులతో కలిసి ఓ రౌడీ షీటర్ వీరంగం సృష్టించాడు. ఇర్ఫాన్‌ ఖాన్‌, ఇలియస్‌ అనే ఇద్దరు వ్యక్తులపై కర్రలు, రాళ్లతో దాడి చేశారు.

Published : 16 Feb 2022 12:47 IST

నిజామాబాద్‌: నిజామాబాద్‌లో అనుచరులతో కలిసి ఓ రౌడీ షీటర్ వీరంగం సృష్టించాడు. ఇర్ఫాన్‌ ఖాన్‌, ఇలియస్‌ అనే ఇద్దరు వ్యక్తులపై కర్రలు, రాళ్లతో దాడి చేశాడు. పట్టణ పరిధిలోని ఆటోనగర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. దాడికి పాల్పడినవారిని ఇబ్బు చావూస్‌, అతడి అనుచరులుగా గుర్తించారు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఓ హోటల్‌లో ఇర్ఫాన్‌ ఖాన్‌, ఇలియస్‌ ఉండగా.. అదే సమయంలో ఇబ్బు అక్కడికి వచ్చాడు. ఇర్ఫాన్‌, ఇలియస్‌లను పక్కకు జరగాలని ఇబ్బు చెప్పగా.. వారు పట్టించుకోలేదు. దీంతో వారి మధ్య గొడవ తలెత్తింది. వెంటనే ఇబ్బు తన అనుచరులను పిలిపించి ఇర్ఫాన్‌, ఇలియస్‌లపై దాడికి దిగారు. ఈ ఘర్షణలో ఇరువర్గాలవారికి తీవ్రంగా గాయాలయ్యాయి. గాయపడిన బాధితులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి ఆరుగురు నిందితులపై పోలీసులు కేసులు నమోదు చేశారు. వారిలో నలుగురిని ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు. మిగిలినవారి కోసం గాలిస్తున్నారు. ఇబ్బుపై గతంలోనే పలు పోలీస్‌స్టేషన్లలో రౌడీ షీట్‌ నమోదైంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని