అంబులెన్స్లో వెళ్తూ ఎస్సై ఆత్మహత్య!
దేశ రాజధాని నగరంలో ఓ ఎస్సై ఆత్మహత్య ఘటన కలకలం రేపింది. సీఏటీఎస్ (సెంట్రలైజ్డ్ యాక్సిడెంట్ అండ్ ట్రూమా సర్వీసెస్) అంబులెన్స్లో ఆస్పత్రికి వెళ్తుండగా ఉరి వేసుకున్నట్టు సమాచారం. .....
మూడు ఆస్పత్రుల్లో చేర్చుకునేందుకు నిరాకరణ
దిల్లీ: దేశ రాజధాని నగరంలో ఓ ఎస్సై ఆత్మహత్య ఘటన కలకలం రేపింది. సీఏటీఎస్ (సెంట్రలైజ్డ్ యాక్సిడెంట్ అండ్ ట్రౌమా సర్వీసెస్) అంబులెన్స్లో ఆస్పత్రికి వెళ్తుండగా ఉరి వేసుకున్నట్టు సమాచారం. ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న రాజ్వీర్ సింగ్ (39)ను మూడు ఆస్పత్రుల్లో చేర్పించుకొనేందుకు నిరాకరించడంతో చివరకు అదే అంబులెన్స్లో ఐహెచ్బీఎస్ ఆస్పత్రికి తరలిస్తుండగా ఈ ఘటన జరిగినట్టు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళ్తే.. రాజ్వీర్ శుక్రవారం అంబులెన్స్ను ద్వారకాలోని తన నివాసం వద్దకు పిలిచారు. అయితే, ఆయన్ను చేర్పించుకొనేందుకు మూడు ఆస్పత్రులు నిరాకరించడంతో తీవ్ర ఆందోళనకు గురయ్యారు. దీంతో సీఏటీఎస్ సిబ్బంది ఆయన్ను శాంతింపజేసి ఐహెచ్బీఎస్ ఆస్పత్రికి తరలిస్తుండగా అంబులెన్స్లోనే ఆత్మహత్య చేసుకున్నట్టు సీనియర్ పోలీస్ అధికారి ఒకరు వెల్లడించారు.
డీసీపీ ఆర్పీ మీనా మాట్లాడుతూ.. ఈ ఘటనపై నిన్న మధ్యాహ్నం 3గంటలకు పోలీసులకు సమాచారం అందిందని చెప్పారు. ఆస్పత్రికి తరలిస్తుండగా అంబులెన్స్లో వస్త్రంతో ఉరివేసుకున్నట్టు గుర్తించినట్టు చెప్పారు. గత ఐదు రోజుల నుంచి సెలవులో ఉన్నారన్నారు. ఈ ఘటనపై తదుపరి దర్యాప్తు జరుగుతోందని, లభ్యమైన ఆధారాలను బట్టి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని డీసీపీ తెలిపారు. రాజ్వీర్ సింగ్ ద్వారకాలోని తన కుటుంబంతో కలిసి ఓ అపార్ట్మెంట్లో ఉంటున్నారు. ఆయనకు తల్లిదండ్రులు, భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. అసలు ఆ ఎస్సై ఏ సమస్యతో ఆస్పత్రికి వెళ్లారు? తొలుత మూడు ఆస్పత్రులకు వెళ్లినా చేర్చుకొనేందుకు అక్కడి వైద్యులు ఎందుకు నిరాకరించారు? ఆత్మహత్యకు దారితీసిన పరిస్థితులేంటనే ప్రశ్నలకు సమాధానాలు విచారణలో తేలే అవకాశం ఉంది.
ఇదీ చదవండి..
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బాలుడి పొట్టలోకి గాలికొట్టిన ఆకతాయి
ఓ ఆకతాయి వికృత చేష్టలకు గురైన బాలుడు తీవ్ర అస్వస్థతతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. పోలీసుల కథనం.. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం అనికేపల్లికి చెందిన బాలుడు(12) బుధవారం సాయంత్రం తోటి పిల్లలతో కలిసి వాలీబాల్ ఆడుతుండగా బంతిలో గాలి తగ్గింది. -
ఉపాధి లేక ఇద్దరు నేత కార్మికుల ఆత్మహత్య
రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉపాధి లేక ఇద్దరు నేత కార్మికులు ఆత్మహత్య చేసుకున్న ఘటన గురువారం చోటుచేసుకుంది. -
ఆగి ఉన్న లారీని ఢీకొని.. కారుకు మంటలు
ఆగి ఉన్న లారీని వెనక నుంచి ఢీకొనడంతో కారులో మంటలు వ్యాపించి యువ వ్యాపారి సజీవ దహనమయ్యాడు. -
పుట్టెడు దుఃఖం మిగిల్చిన పుట్టెంట్రుకల వేడుక
బావ, బావమరుదుల కుటుంబాల్లోని పది మంది పుట్టెంట్రుకల వేడుక కోసం ఆనందంగా బయల్దేరారు. రోడ్డు ప్రమాదం మధ్యలోనే వారి సంతోషాన్ని చిదిమేసింది. -
విద్యుదాఘాతంతో కౌలు రైతు మృతి
పొలంలో తెగిపడిన విద్యుత్ తీగ తగిలి కౌలు రైతు అక్కడికక్కడే మృతిచెందిన ఘటన జగిత్యాల జిల్లాలో గురువారం ఉదయం చోటు చేసుకుంది. -
రోడ్డు ప్రమాదాల్లో ఐదుగురి దుర్మరణం
కుమురం భీం, నిజామాబాద్ జిల్లాల్లో గురువారం రాత్రి జరిగిన రెండు ప్రమాదాల్లో ఐదుగురు మృతిచెందారు. మొత్తం 17 మంది గాయపడ్డారు. -
ఐదుగురు ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్య
రాష్ట్రంలోని వేర్వేరు జిల్లాలకు చెందిన ఐదుగురు ఇంటర్ విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. -
హోటల్లో భారీ అగ్నిప్రమాదం.. ఆరుగురి సజీవ దహనం
బిహార్ రాజధాని పట్నాలో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. స్థానిక రైల్వేస్టేషన్ సమీపంలోని ఓ హోటల్లో భారీ ఎత్తున మంటలు చెలరేగి ఆరుగురు సజీవ దహనమయ్యారు. -
45 కిలోమీటర్లు.. 1400 సీసీ కెమెరాల జల్లెడ
అర్ధరాత్రి తర్వాత మహిళపై సామూహిక అత్యాచారం.. ఆపై హత్య.. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులకు సీసీ కెమెరాల్లో ఇద్దరూ పరారయ్యే అస్పష్ట చిత్రాలు తప్ప ఒక్క ఆధారం లభించలేదు. -
సల్మాన్ ఇంటివద్ద కాల్పులు.. పంజాబ్లో మరో ఇద్దరు నిందితుల అరెస్టు
బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ఇంటి ముందు జరిగిన కాల్పుల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. -
పోలీసుస్టేషన్ ఆవరణలోనే తెదేపా కార్యకర్తపై దాడి
పోలీసు స్టేషన్ ఆవరణలో వైకాపా నాయకులు హల్చల్ చేశారు. పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం పొందుగల గ్రామానికి చెందిన కొందరు వైకాపా నాయకులు తెదేపా కార్యకర్త యూసఫ్పై స్టేషన్ ఆవరణలోనే దాడి చేశారు. -
వైకాపా నాయకుడి బార్లో.. రూ.1.30 కోట్ల మద్యం స్వాధీనం
శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా అల్లూరులో సెబ్ అధికారులు భారీగా మద్యం స్వాధీనం చేసుకున్నారు. -
గులకరాయి కేసులో నిందితుడిని కస్టడీకి తీసుకున్న పోలీసులు
గులకరాయి కేసులో నిందితుడు సతీష్కుమార్ను పోలీసులు తమ కస్టడీకి తీసుకున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
విజయ్ ‘ఫ్యామిలీ స్టార్’ ఓటీటీలోకి వచ్చేసింది.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
రమణదీక్షితులుపై కేసులో 41ఏ నోటీసు నిబంధనను పాటించండి: పోలీసులకు హైకోర్టు ఆదేశం
-
వైకాపా వెన్నులో వణుకు.. చెమటలు పట్టిస్తున్న పూతలపట్టు కాంగ్రెస్ అభ్యర్థి
-
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
-
టీఎస్బీపాస్తోనే అనుమతులు.. డీపీఎంఎస్ విధానం పూర్తిగా నిలుపుదల
-
కొండయ్య.. లెక్కే వేరు