Telangana News: సింహయాజీ బెయిల్ పత్రాలు జారీ.. రేపు విడుదలయ్యే అవకాశం
ఎమ్మెల్యేలకు ఎర కేసులో నిందితుడిగా ఉన్న సింహయాజీకి బెయిల్ పత్రాలు జారీ అయ్యాయి. సింహయాజీ తరఫు న్యాయవాది నాంపల్లి ఏసీబీ ప్రత్యేక కోర్టులో రూ.6లక్షల పూచీకత్తుతో పాటు ఇద్దరి జామీను సమర్పించారు.
హైదరాబాద్: ఎమ్మెల్యేలకు ఎర కేసులో నిందితుడిగా ఉన్న సింహయాజీకి బెయిల్ పత్రాలు జారీ అయ్యాయి. ఆయన తరఫు న్యాయవాది నాంపల్లి ఏసీబీ ప్రత్యేక కోర్టులో రూ.6లక్షల పూచీకత్తుతో పాటు ఇద్దరి జామీను సమర్పించారు. దీంతో కోర్టు బెయిల్ పత్రాలు మంజూరు చేసింది. సింహయాజీ తరఫు న్యాయవాది ఈ పత్రాలను బుధవారం చంచల్గూడ జైలులో సమర్పించిన తర్వాత జైలు అధికారులు వాటిని పరిశీలించి ఆయన్ను విడుదల చేయనున్నారు. హైకోర్టు బెయిల్ మంజూరు చేసిన 6రోజుల తర్వాత సింహయాజీ జైలు నుంచి విడుదల కానున్నారు. ఒక్కొక్కరికీ రూ.6క్షల పూచీకత్తుతో పాటు, ఇద్దరు జామీను సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది. దీంతో పూచీకత్తు, జామీను సమర్పించడంలో ఆలస్యమై సింహయాజీ విడుదల కాలేకపోయారు. ఇదే కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న రామచంద్రభారతి, నందకుమార్లకు సైతం హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయితే, ఇద్దరిపైనా బంజారాహిల్స్ పీఎస్లో వేర్వేరు కేసులు నమోదయ్యాయి. ఈకేసులు ఉండటంతో ఇద్దరూ చంచల్గూడ జైల్లోనే ఉండాల్సి వచ్చింది.
మొయినాబాద్ పోలీసులు జారీ చేసిన మెమోను కొట్టివేసి కోర్టు
అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 8 ప్రకారం నమోదు చేసిన కేసులను శాంతిభద్రతల విభాగం పోలీసులు కానీ, సిట్ అధికారులు దర్యాప్తు చేసే అధికారం లేదని నాంపల్లి ఏసీబీ ప్రత్యేక కోర్టు తెలిపింది. ఎమ్మెల్యేలకు ఎర కేసులో మెయినాబాద్ పోలీసులు అదనంగా నలుగురు నిందితులను చేరుస్తూ జారీ చేసిన మెమోను ఈ కారణంగా తిరస్కరిస్తున్నట్టు ఏసీబీ ప్రత్యేక కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. అవినీతి నిరోధకశాఖకు మాత్రమే ఈ సెక్షన్ కింద నమోదైన కేసును దర్యాప్తు చేసే అధికారం ఉంటుందని కోర్టు తెలిపింది.
బీఎల్ సంతోష్, తుషార్, జగ్గు స్వామి, శ్రీనివాస్లను నిందితులుగా చేరుస్తూ మెయినాబాద్ పోలీసులు గత నెల 22న ఏసీబీ ప్రత్యేక కోర్టులో మెమో దాఖలు చేశారు. దీనిపై ఈనెల 2న వాదనలు జరిగాయి. నిందితులు బీఎల్ సంతోష్తో పాటు తుషార్, జగ్గుస్వామితోనూ మంతనాలు జరిపారని పోలీసుల తరఫు న్యాయవాది వాదించారు. ఈమేరకు కొన్ని ఫొటోలను సైతం కోర్టుకు సమర్పించారు. కేవలం ఫొటోలు దిగినంత మాత్రాన రామచంద్రభారతికి, బీఎల్ సంతోష్కి సంబంధం ఉన్నట్టు కాదని, కేసుతో నలుగురికీ ఎలాంటి సంబంధం లేదని పిటిషనర్ల తరఫు న్యాయవాది వాదించారు. ఇరువైపులా వాదనలు విన్న న్యాయస్థానం మొయినాబాద్ పోలీసులు దాఖలు చేసిన మెమోను కొట్టివేసింది. ఏసీబీ ప్రత్యేక కోర్టు ఇచ్చిన తీర్పుపై పోలీసులు న్యాయనిపుణుల సలహా తీసుకుంటున్నారు. ఈ తీర్పును హైకోర్టులో సవాల్ చేసే యోచనలో ఉన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బాలుడి పొట్టలోకి గాలికొట్టిన ఆకతాయి
ఓ ఆకతాయి వికృత చేష్టలకు గురైన బాలుడు తీవ్ర అస్వస్థతతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. పోలీసుల కథనం.. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం అనికేపల్లికి చెందిన బాలుడు(12) బుధవారం సాయంత్రం తోటి పిల్లలతో కలిసి వాలీబాల్ ఆడుతుండగా బంతిలో గాలి తగ్గింది. -
ఉపాధి లేక ఇద్దరు నేత కార్మికుల ఆత్మహత్య
రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉపాధి లేక ఇద్దరు నేత కార్మికులు ఆత్మహత్య చేసుకున్న ఘటన గురువారం చోటుచేసుకుంది. -
ఆగి ఉన్న లారీని ఢీకొని.. కారుకు మంటలు
ఆగి ఉన్న లారీని వెనక నుంచి ఢీకొనడంతో కారులో మంటలు వ్యాపించి యువ వ్యాపారి సజీవ దహనమయ్యాడు. -
పుట్టెడు దుఃఖం మిగిల్చిన పుట్టెంట్రుకల వేడుక
బావ, బావమరుదుల కుటుంబాల్లోని పది మంది పుట్టెంట్రుకల వేడుక కోసం ఆనందంగా బయల్దేరారు. రోడ్డు ప్రమాదం మధ్యలోనే వారి సంతోషాన్ని చిదిమేసింది. -
విద్యుదాఘాతంతో కౌలు రైతు మృతి
పొలంలో తెగిపడిన విద్యుత్ తీగ తగిలి కౌలు రైతు అక్కడికక్కడే మృతిచెందిన ఘటన జగిత్యాల జిల్లాలో గురువారం ఉదయం చోటు చేసుకుంది. -
రోడ్డు ప్రమాదాల్లో ఐదుగురి దుర్మరణం
కుమురం భీం, నిజామాబాద్ జిల్లాల్లో గురువారం రాత్రి జరిగిన రెండు ప్రమాదాల్లో ఐదుగురు మృతిచెందారు. మొత్తం 17 మంది గాయపడ్డారు. -
ఐదుగురు ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్య
రాష్ట్రంలోని వేర్వేరు జిల్లాలకు చెందిన ఐదుగురు ఇంటర్ విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. -
హోటల్లో భారీ అగ్నిప్రమాదం.. ఆరుగురి సజీవ దహనం
బిహార్ రాజధాని పట్నాలో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. స్థానిక రైల్వేస్టేషన్ సమీపంలోని ఓ హోటల్లో భారీ ఎత్తున మంటలు చెలరేగి ఆరుగురు సజీవ దహనమయ్యారు. -
45 కిలోమీటర్లు.. 1400 సీసీ కెమెరాల జల్లెడ
అర్ధరాత్రి తర్వాత మహిళపై సామూహిక అత్యాచారం.. ఆపై హత్య.. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులకు సీసీ కెమెరాల్లో ఇద్దరూ పరారయ్యే అస్పష్ట చిత్రాలు తప్ప ఒక్క ఆధారం లభించలేదు. -
సల్మాన్ ఇంటివద్ద కాల్పులు.. పంజాబ్లో మరో ఇద్దరు నిందితుల అరెస్టు
బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ఇంటి ముందు జరిగిన కాల్పుల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. -
పోలీసుస్టేషన్ ఆవరణలోనే తెదేపా కార్యకర్తపై దాడి
పోలీసు స్టేషన్ ఆవరణలో వైకాపా నాయకులు హల్చల్ చేశారు. పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం పొందుగల గ్రామానికి చెందిన కొందరు వైకాపా నాయకులు తెదేపా కార్యకర్త యూసఫ్పై స్టేషన్ ఆవరణలోనే దాడి చేశారు. -
వైకాపా నాయకుడి బార్లో.. రూ.1.30 కోట్ల మద్యం స్వాధీనం
శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా అల్లూరులో సెబ్ అధికారులు భారీగా మద్యం స్వాధీనం చేసుకున్నారు. -
గులకరాయి కేసులో నిందితుడిని కస్టడీకి తీసుకున్న పోలీసులు
గులకరాయి కేసులో నిందితుడు సతీష్కుమార్ను పోలీసులు తమ కస్టడీకి తీసుకున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
రివ్యూ: రత్నం.. విశాల్ నటించిన యాక్షన్ డ్రామా మెప్పించిందా?
-
డీజీసీఏ కొత్త రూల్.. విమాన టికెట్ల ధరలు తగ్గుతాయా?
-
‘వీవీప్యాట్ల’పై సుప్రీం తీర్పు.. విపక్షాలకు గట్టి చెంపదెబ్బ: మోదీ
-
అవసరమైతే తప్ప బయటకు రావొద్దు: వాతావరణశాఖ
-
‘నోటా’కు ఎక్కువ ఓట్లు వస్తే..? ఈసీకి సుప్రీం కోర్టు నోటీసులు
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా