Hyderabad: అంగట్లో అమ్మకానికి 16.8 కోట్ల మంది డేటా.. ఆరుగురి అరెస్టు
దేశవ్యాప్తంగా 16.8 కోట్ల మంది వ్యక్తుల వ్యక్తిగత డేటా చోరీ చేసి సైబర్ నేరగాళ్లకు అమ్ముతున్న ముఠాను సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసు వివరాలను సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర మీడియాకు వెల్లడించారు.
హైదరాబాద్: వ్యక్తిగత డేటా సేకరించి విక్రయిస్తున్న ముఠాను సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. దేశవ్యాప్తంగా 16.8కోట్ల మందికి సంబంధించిన డేటా చోరీ చేశారని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర తెలిపారు. పలు ఆన్లైన్ వెబ్సైట్ల నుంచి డేటాను చోరీ చేసి ఈ ముఠా సైబర్ నేరగాళ్లకు అమ్ముతున్నట్లు వెల్లడించారు. పాన్ ఇండియా ప్రభుత్వ ఉద్యోగులు, పలు బ్యాంకింగ్ క్రెడిట్ కార్డులు, పాన్ కార్డ్, పాలసీ బజార్ వంటి పేరున్న సంస్థల నుంచి డేటా చోరీ అయిందని చెప్పారు. ఈ మేరకు సైబరాబాద్ సీపీ మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు.
‘‘బీమా, రుణాల కోసం దరఖాస్తు చేసుకున్న వ్యక్తుల సమాచారం తస్కరించినట్లు గుర్తించాం. ఫేస్బుక్ యూజర్ల ఐడీ, పాస్వర్డ్లు, ఐటీ ఉద్యోగుల డేటాను సైతం చోరీ చేశారు. డిఫెన్స్, ఆర్మీ ఉద్యోగుల డేటా అంగట్లో అమ్మకానికి పెట్టారు. మహిళల వ్యక్తిగత డేటానూ సైబర్ నేరగాళ్లకు అమ్ముతున్నారు. ఇది దేశ భద్రతకు పెను ముప్పు. సైబరాబాద్ పరిధిలో ఆరుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నాం. ఈ వ్యవహారంలో బ్యాంక్ ఆఫ్ బరోడా క్రెడిట్ కార్డ్ జారీ చేసే ఓ ఏజెన్సీ ఉన్నట్లు గుర్తించాం. దీనికి సంబంధించి జస్ట్ డయల్ సంస్థపై కూడా కేసులు నమోదు చేస్తాం. గతంలో ఇలాంటి కేసులు మా దృష్టికి వచ్చాయి. వీరి వెనుక ఎవరున్నారు అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నాం. నిందితులను కస్టడీలోకి తీసుకుని విచారిస్తాం’’ అని సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర తెలిపారు.
కేసు విచారణకు ప్రత్యేక బృందం ఏర్పాటు..
దేశంలో కోట్ల మంది వ్యక్తిగత డేటా, మొబైల్ నెంబర్లు, సైనిక అధికారుల వ్యక్తిగత డేటా చౌర్యం.. ఈ అంశం ప్రస్తుతం కలకలం రేపుతోంది. అసలు ఎంతో ముఖ్యమైన సమాచారం ఎలా బయటకు వచ్చింది? దీని వెనుక ఎవరెవరున్నారు? సైబర్ నేరగాళ్లు ఏ మేరకు డాటా దుర్వినియోగం చేశారు? తదితర అంశాలపై ప్రస్తుతం సైబరాబాద్ పోలీసులు దృష్టి సారించారు. కేసు విచారణకు అంతర్గతంగా ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని సైబరాబాద్ పోలీసులు ఏర్పాటు చేశారు. జాయింట్ సీపీ కల్మేశ్వర్ ఆధ్వర్యంలో సిట్ పనిచేయనుంది.
బ్యాంకుల నుంచి లోన్ తీసుకోవాలన్నా, క్రెడిట్ కార్డు పొందాలన్నా కేవైసీ ఎంతో కీలకం. ఈ కేవైసీ ద్వారానే డేటా చోరీ అయినట్టు పోలీసులు చెబుతున్నారు. ఇటువంటి డేటా బ్యాంకింగ్, టెలికాం సంస్థలు బయటకు రాకుండా ఎంతో జాగ్రత్తగా ఉంచాలి. వారి నిర్లక్ష్యం కారణంగా వ్యక్తిగత సమాచారం చోరీ అవుతోందని పోలీసులు వివరించారు. చోరీ అయిన డేటా సైబర్ నేరగాళ్ల చేతిలో పడుతోంది. సదరు నేరగాళ్లు తస్కరించిన డేటాను నేరాలకు ఉపయోగిస్తున్నట్టు భావిస్తున్నారు. దీనివల్ల సైబర్ నేరాలు, ఇతర నేరాలు పెరగడంతో పాటు జాతీయ భద్రతకు కూడా ముప్పు ఎదురయ్యే అవకాశం ఉందని పోలీసు ఉన్నతాధికారులు చెబుతున్నారు.
డేటా తీసుకుంటున్నప్పుడు బ్యాంకింగ్, టెలికాం ఏ ఇతర సంస్థలైనా సరే దాన్ని భద్రతపరంగా పరిరక్షించాలి. ఆ బాధ్యత ఆయా సంస్థలదేనని సైబరాబాద్ పోలీసు కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర వివరించారు. డేటా ఏ విధంగా చోరీ అయింది ప్రధాన కారణమేంటి? అనే విషయాలపై సైబరాబాద్ పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. సైనిక అధికారుల వ్యక్తిగత సమాచారం ఏ విధంగా బయటకు వెళ్లిందనే విషయంలోనూ పోలీసులు ఆరా తీస్తున్నారు. వారి పేర్లు, ర్యాంకులు, ఇతర వివరాలు ఎలా ఈ ముఠాకు చిక్కాయనే విషయాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నారు. ఈ కేసులో మరింత లోతైన దర్యాప్తు అవసరం కాబట్టి అంతర్గతంగా సిట్ ఏర్పాటు చేసి విచారించనున్నారు. దీనిపై పూర్తిస్థాయిలో విచారణ జరిపితే మరిన్ని అంశాలు బయటపడే అవకాశం ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బాలుడి పొట్టలోకి గాలికొట్టిన ఆకతాయి
ఓ ఆకతాయి వికృత చేష్టలకు గురైన బాలుడు తీవ్ర అస్వస్థతతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. పోలీసుల కథనం.. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం అనికేపల్లికి చెందిన బాలుడు(12) బుధవారం సాయంత్రం తోటి పిల్లలతో కలిసి వాలీబాల్ ఆడుతుండగా బంతిలో గాలి తగ్గింది. -
ఉపాధి లేక ఇద్దరు నేత కార్మికుల ఆత్మహత్య
రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉపాధి లేక ఇద్దరు నేత కార్మికులు ఆత్మహత్య చేసుకున్న ఘటన గురువారం చోటుచేసుకుంది. -
ఆగి ఉన్న లారీని ఢీకొని.. కారుకు మంటలు
ఆగి ఉన్న లారీని వెనక నుంచి ఢీకొనడంతో కారులో మంటలు వ్యాపించి యువ వ్యాపారి సజీవ దహనమయ్యాడు. -
పుట్టెడు దుఃఖం మిగిల్చిన పుట్టెంట్రుకల వేడుక
బావ, బావమరుదుల కుటుంబాల్లోని పది మంది పుట్టెంట్రుకల వేడుక కోసం ఆనందంగా బయల్దేరారు. రోడ్డు ప్రమాదం మధ్యలోనే వారి సంతోషాన్ని చిదిమేసింది. -
విద్యుదాఘాతంతో కౌలు రైతు మృతి
పొలంలో తెగిపడిన విద్యుత్ తీగ తగిలి కౌలు రైతు అక్కడికక్కడే మృతిచెందిన ఘటన జగిత్యాల జిల్లాలో గురువారం ఉదయం చోటు చేసుకుంది. -
రోడ్డు ప్రమాదాల్లో ఐదుగురి దుర్మరణం
కుమురం భీం, నిజామాబాద్ జిల్లాల్లో గురువారం రాత్రి జరిగిన రెండు ప్రమాదాల్లో ఐదుగురు మృతిచెందారు. మొత్తం 17 మంది గాయపడ్డారు. -
ఐదుగురు ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్య
రాష్ట్రంలోని వేర్వేరు జిల్లాలకు చెందిన ఐదుగురు ఇంటర్ విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. -
హోటల్లో భారీ అగ్నిప్రమాదం.. ఆరుగురి సజీవ దహనం
బిహార్ రాజధాని పట్నాలో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. స్థానిక రైల్వేస్టేషన్ సమీపంలోని ఓ హోటల్లో భారీ ఎత్తున మంటలు చెలరేగి ఆరుగురు సజీవ దహనమయ్యారు. -
45 కిలోమీటర్లు.. 1400 సీసీ కెమెరాల జల్లెడ
అర్ధరాత్రి తర్వాత మహిళపై సామూహిక అత్యాచారం.. ఆపై హత్య.. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులకు సీసీ కెమెరాల్లో ఇద్దరూ పరారయ్యే అస్పష్ట చిత్రాలు తప్ప ఒక్క ఆధారం లభించలేదు. -
సల్మాన్ ఇంటివద్ద కాల్పులు.. పంజాబ్లో మరో ఇద్దరు నిందితుల అరెస్టు
బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ఇంటి ముందు జరిగిన కాల్పుల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. -
పోలీసుస్టేషన్ ఆవరణలోనే తెదేపా కార్యకర్తపై దాడి
పోలీసు స్టేషన్ ఆవరణలో వైకాపా నాయకులు హల్చల్ చేశారు. పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం పొందుగల గ్రామానికి చెందిన కొందరు వైకాపా నాయకులు తెదేపా కార్యకర్త యూసఫ్పై స్టేషన్ ఆవరణలోనే దాడి చేశారు. -
వైకాపా నాయకుడి బార్లో.. రూ.1.30 కోట్ల మద్యం స్వాధీనం
శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా అల్లూరులో సెబ్ అధికారులు భారీగా మద్యం స్వాధీనం చేసుకున్నారు. -
గులకరాయి కేసులో నిందితుడిని కస్టడీకి తీసుకున్న పోలీసులు
గులకరాయి కేసులో నిందితుడు సతీష్కుమార్ను పోలీసులు తమ కస్టడీకి తీసుకున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
‘వీవీప్యాట్ల’పై సుప్రీం తీర్పు.. విపక్షాలకు గట్టి చెంపదెబ్బ: మోదీ
-
అవసరమైతే తప్ప బయటకు రావొద్దు: వాతావరణశాఖ
-
‘నోటా’కు ఎక్కువ ఓట్లు వస్తే..? ఈసీకి సుప్రీం కోర్టు నోటీసులు
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా
-
ఐపీఓకు స్విగ్గీ రెడీ.. సెబీ రహస్య మార్గంలో దరఖాస్తు
-
ఆ సమయంలో అతడు ఒక్క బౌండరీ కొట్టలేదు : విరాట్ స్ట్రైక్రేట్పై గావస్కర్