Crime News: ప్రాణం తీసిన వాట్సాప్‌ స్టేటస్‌

తనతో దిగిన చిత్రాలను ఓ యువకుడు వాట్సాప్‌ స్టేటస్‌లో పెట్టడంతో మనస్తాపానికి గురైన యువతి పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్న సంఘటన మంచిర్యాల జిల్లా తాండూరు మండలం అచ్చలాపూర్‌ గ్రామంలో

Published : 08 Apr 2022 05:50 IST

తాండూరు, న్యూస్‌టుడే: తనతో దిగిన చిత్రాలను ఓ యువకుడు వాట్సాప్‌ స్టేటస్‌లో పెట్టడంతో మనస్తాపానికి గురైన యువతి పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్న సంఘటన మంచిర్యాల జిల్లా తాండూరు మండలం అచ్చలాపూర్‌ గ్రామంలో గురువారం చోటు చేసుకుంది. బాధిత కుటుంబీకులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అచ్చలాపూర్‌ గ్రామ పంచాయతీ పరిధిలోని కొమ్ముగూడకు చెందిన యువతి (17) హైదరాబాద్‌లోని ఓ కళాశాలలో పాలిటెక్నిక్‌ మొదటి సంవత్సరం చదువుతోంది. ఉగాది పండగ నిమిత్తం స్వగ్రామానికి వచ్చి ఇక్కడే ఉంటోంది. బుధవారం స్థానిక యువకుడు ఎ.అజయ్‌ యువతితో తీసుకున్న ఫొటోలను వాట్సప్‌ స్టేటస్‌లో పెట్టాడు. ఈ విషయం తెలుసుకున్న ఆ యువతి తల్లిదండ్రులు చిత్రాలను తీసేయాలని విన్నవించినా.. ఆ యువకుడు వినిపించుకోలేదు. దీంతో మనస్తాపానికి గురైన యువతి బుధవారం అర్ధరాత్రి ఇంట్లోనే పురుగు మందు తాగింది. గమనించిన కుటుంబీకులు వెంటనే బెల్లంపల్లి ప్రభుత్వం ఆస్పత్రికి తరలించినప్పటికీ అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతురాలి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై కిరణ్‌కుమార్‌ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని