Road Accident : మిర్యాలగూడలో రోడ్డు ప్రమాదం: ముగ్గురి మృతి

మిర్యాలగూడలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. చింతపల్లి హైవే వద్ద ఆగిఉన్న లారీని ట్రావెల్స్‌ బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందారు. ప్రమాదంలో 15 మందికి గాయాలు అయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు

Updated : 24 Aug 2021 10:37 IST

నల్గొండ: మిర్యాలగూడలో రోడ్డుప్రమాదం జరిగింది. చింతపల్లి హైవే వద్ద ఆగిఉన్న లారీని ట్రావెల్స్‌ బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందగా.. 10 మందికి గాయాలయ్యాయి. బస్సు ఒంగోలు నుంచి హైదరాబాద్‌ వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రమాదానికి బస్సు డ్రైవర్‌ నిర్లక్ష్యమే కారణంగా భావిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను మిర్యాలగూడలోని ఆసుపత్రికి తరలించారు.

మృతులను మల్లికార్జున్‌(40), నాగేశ్వరరావు(44), జయరావు(42)గా గుర్తించారు. వీరిలో మల్లికార్జున్‌ది ప్రకాశం జిల్లా పెద్ద కల్వకుంట కాగా.. నాగేశ్వరరావుది అదే జిల్లా ముఖ్యనవారి పాలెం. మరో మృతుడు జయరావుది గుంటూరు జిల్లా నాగులవరం గ్రామంగా పోలీసులు తెలిపారు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని