TS News: కేపీహెచ్‌బీలో విషాదం.. బిల్డింగ్‌ పైనుంచి పడి జీహెచ్‌ఎంసీ ఉద్యోగి మృతి 

కేపీహెచ్‌బీ కాలనీలో విషాదం చోటు చేసుకుంది. రోడ్‌ నంబర్‌ 2లో భవనం పై నుంచి పడి వ్యక్తి మృతిచెందాడు.

Published : 18 Nov 2021 02:00 IST

హైదరాబాద్‌: నగరంలోని కేపీహెచ్‌బీ కాలనీలో విషాదం చోటు చేసుకుంది. రోడ్‌ నంబర్‌ 2లో భవనం పై నుంచి పడి వ్యక్తి మృతిచెందాడు. ప్రమాదవశాత్తు బిల్డింగ్‌ పై నుంచి పడి కమల్‌రాజ్‌ మెహ్ర(50) అనే వ్యక్తి చనిపోయారు. ఈయన జీహెచ్‌ఎంసీ ఎంటమాలజీ విభాగంలో పని చేస్తున్నట్లు గుర్తించారు. వాకింగ్‌ చేసి గోడపై కూర్చొని జారి పడినట్లు ప్రాథమికంగా నిర్ధరించారు. ఘటనపై స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని