Crime News: లో దుస్తుల్లో బంగారం అక్రమ రవాణా.. శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో ముగ్గురి అరెస్టు

శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టుబడింది. రెండు వేర్వేరు విమానాల్లో హైదరాబాద్‌ వచ్చిన ముగ్గురు ప్రయాణికుల నుంచి లో దుస్తుల్లో అక్రమంగా తరలిస్తున్న 600 గ్రాములకుపైగా బంగారాన్ని కస్టమ్స్‌ అధికారులు స్వాధీనం చేసుకున్నారు....

Updated : 05 Oct 2021 05:04 IST

హైదరాబాద్: శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టుబడింది. రెండు వేర్వేరు విమానాల్లో హైదరాబాద్‌ వచ్చిన ముగ్గురు ప్రయాణికుల నుంచి లో దుస్తుల్లో అక్రమంగా తరలిస్తున్న 600 గ్రాములకుపైగా బంగారాన్ని కస్టమ్స్‌ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కువైట్‌ నుంచి హైదరాబాద్‌ వచ్చిన ప్రయాణికులు వేముల శ్రీనివాస్‌, అమర్‌గొండ శ్రీనివాస్‌లను అరెస్టు చేసి వారి నుంచి రూ.12.31 లక్షలు విలువైన 256 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. దుబాయ్‌ నుంచి వచ్చిన మరో ప్రయాణికుడి 350 గ్రాముల బంగారు కడ్డీలను స్వాధీనం చేసుకొని అదుపులోకి తీసుకున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని